English | Telugu

బిగ్ బాస్ అగ్ని పరీక్ష లేటెస్ట్ అప్ డేట్స్.. ఎలిమినేట్ అయ్యేది ఎవరు?

బిగ్ బాస్ అగ్ని పరీక్ష షూటింగ్ కి సిద్దమైనట్లు అప్ డేట్స్ ద్వారా తెలుస్తోంది. జడ్జెస్ గా నవాడీపీ, అభిజిత్, బిందు మాధవి ఉన్నారన్న విషయం తెలుస్తోంది. 40 మంది కామన్ మ్యాన్ నుంచి ఈ జడ్జెస్ బెస్ట్ అనుకున్న వాళ్ళను నెక్స్ట్ రౌండ్ కి పంపించబోతున్నారు. అలాగే ఇందులో 25 మంది ఎలిమినేట్ కాబోతున్నారన్న విషయం తెలుస్తోంది. ఇక సెలెక్ట్ ఐన 15 మందిని ముగ్గురు జడ్జెస్ ఒక్కొక్కరు 5 గురిని తీసుకుని వాళ్లకు టాస్కులు ఇచ్చి ఆడించబోతున్నారు. అలాగే నెక్స్ట్ లెవెల్ ఆడియన్స్ పోల్ ఉండబోతోందన్న విషయం తెలుస్తోంది. టాప్ 5 ఓట్స్ తో ఎవరు లీడ్ లో ఉంటారో వాళ్ళే బిగ్ బాస్ సీజన్ 9 వెళ్లారంటూ అప్ డేట్స్ ద్వారా తెలుస్తోంది.

అగస్ట్ 22 నుంచి ఈ అగ్నిపరీక్ష స్టార్ట్ కాబుతోంది. ఇక కామన్ మ్యాన్ క్యాటగిరి కంటెస్టెంట్స్ కి జడ్జెస్ కొన్ని టాగ్స్ తో బడ్జెస్ కూడా ఇవ్వబోతున్నారు. బ్యాడ్జ్ ఆన్ హోల్డ్, బ్యాడ్జెస్ ఆల్మోస్ట్ ఒకే, బ్యాడ్జిస్ సెలెక్టెడ్ ఫర్ లెవెల్ 2 ఇలా ఇవ్వబోతున్నారు. అలాగే 0 బ్యాడ్జ్ అంటే స్పాట్ ఎలిమినేషన్ కూడా ఉండబోతోందన్నమాట. ఇక ఈ టాస్కుల్లో ఆల్రెడీ కొంతమంది ఎలిమినేటెడ్ కంటెస్టెంట్స్ పేర్లు కూడా తెలుస్తున్నాయి. యాంకర్ మల్లేశ్వరి, మొహమ్మద్ సమీర్, ట్రాన్స్జెండర్ అంకిత, దమ్ము శ్రీరాజ్ వంటి వాళ్ళు ఎలిమినేట్ అయ్యారన్న విషయం తెలుస్తోంది.

Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.

Illu illalu pillalu : అమూల్యకి పెళ్ళిచూపులు.. కామాక్షి ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -362 లో.. పెళ్లిచూపులకి ఇంకా రావడం లేదని రామరాజు వాళ్ళు ఎదురుచూస్తుంటే వాళ్ళు రారుగా అని శ్రీవల్లి మనసులో అనుకుంటుంది. అప్పుడే అబ్బాయి వాళ్ళు పెళ్లిచూపులకు ఎంట్రీ ఇస్తారు‌. దాంతో శ్రీవల్లి షాక్ అవుతుంది. భాగ్యం, ఆనందరావు కూడా వస్తారు. వాళ్ళు ఏం జరిగిందో శ్రీవల్లికి చెప్తారు. వాళ్ళు చెప్పాల్సింది మొత్తం అబ్బాయి వాళ్ల నాన్నకి చెప్తారు కానీ అతనికి చెవులు వినిపించవు.. వాళ్ల అమ్మ కి చెప్పేలోపు అటువైపు గా ప్రేమ, ధీరజ్ వెళ్లడం చూసి మళ్ళీ చెప్పలేకపోయామని శ్రీవల్లికి భాగ్యం చెప్తుంది.