English | Telugu

Bigboss 9 Telugu : బిగ్‌బాస్ నే మార్చేసిన నాగార్జున...ఈసారి చదరంగం కాదు..రణరంగమే!

బిగ్ బాస్ రియాలిటి షో మొదలు కావడానికి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. తాజాగా బిగ్ బాస్ టీమ్ ప్రోమో ఒకటి రిలీజ్ చేశారు. అన్ని సీజన్ ల కంటే ఈ సీజన్ భిన్నంగా ఉండబోతుందనేది ఈ ప్రోమోని చూస్తే తెలుస్తుంది. హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వాలంటే ఒక మినీ యుద్ధమే గెలవాలన్నట్లుగా ప్రోమో ఉంది. షోకి సెలబ్రిటీలతో పాటు కామన్ మ్యాన్ కి కూడా ఆహ్వానం ఉంది.

బిగ్ బాస్ కంటెస్టెంట్స్ సెలెక్షన్ లో భాగంగా లక్షలో అప్లికేషన్ వచ్చాయంట. అందులో బిగ్ బాస్ కొంతమందిని సెలక్ట్ చేసారని వారికి ఓ సవాలు ఇచ్చారంట. సెలక్ట్ చేసిన వాళ్ళకి 'అగ్నిపరీక్ష' ఉంటుందంట.. అది గెలిస్తేనే హౌస్ లోకి ఎంట్రీ ఉంటుంది. ఈ అగ్నిపరీక్షకి నలభై అయిదు మంది(45) వెళ్లారట. ఈ అగ్నిపరీక్షకి బిందు మాధవి, నవదీప్,అభిజిత్ జడ్జులుగా ఉన్నారు . ఈ ముగ్గురు కూడా అగ్నిపరీక్ష ద్వారా హౌస్ లోకి వెళ్లే వాళ్ళని ఎంపిక చేస్తారని తెలుస్తోంది.

ఈ అగ్ని పరీక్షలో భాగంగా పదిహేను మంది అర్హత సాధించారని తెలుస్తోంది. ముగ్గురు జడ్జులు ఒక్కొక్కరు అయిదుగురు కంటెస్టెంట్స్ ని కలిగి మూడు టీమ్ లుగా డివైడ్ అవుతారు. మూడు గ్రూప్ లకి జడ్జెస్ హెడ్.. వాళ్ళ గ్రూప్ లలో పర్ఫామెన్స్ ని బట్టి సెలెక్ట్ చేస్తారు. అలా పర్ఫామెన్స్ ని బట్టీ ఒక్కో టీమ్ నుండి కంటెస్టెంట్స్ ని హౌస్ లోకి పంపిస్తున్నారట‌ ఇంకా పన్నెండు మందికి ఆడియన్స్ పోల్ పెడుతారంట. ఓటింగ్ లో టాప్ 2 లో ఉన్న వాళ్ళకి డైరెక్ట్ హౌస్ లోకి ఎంట్రీ ఉంటుందని.. అలా హౌస్ లోకి ఇప్పటి వరకు అయిదుగురు కంటెస్టెంట్స్ కన్ఫమ్ అయ్యారని తెలుస్తోంది. ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో ఈ అగ్నిపరీక్ష షూటింగ్ జరుగుతుందని.. ఈ నెల 22 న జియో హాట్ స్టార్ లో బిగ్ బాస్ అట్టహాసంగా మొదలవబోతుందని తెలుస్తోంది. మరి మీలో ఎంతమంది ఈ బిగ్ బాస్ సీజన్ 9 చూడటం కోసం ఎదురుచూస్తున్నారో కామెంట్ చేయండి.

Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.

Illu illalu pillalu : అమూల్యకి పెళ్ళిచూపులు.. కామాక్షి ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -362 లో.. పెళ్లిచూపులకి ఇంకా రావడం లేదని రామరాజు వాళ్ళు ఎదురుచూస్తుంటే వాళ్ళు రారుగా అని శ్రీవల్లి మనసులో అనుకుంటుంది. అప్పుడే అబ్బాయి వాళ్ళు పెళ్లిచూపులకు ఎంట్రీ ఇస్తారు‌. దాంతో శ్రీవల్లి షాక్ అవుతుంది. భాగ్యం, ఆనందరావు కూడా వస్తారు. వాళ్ళు ఏం జరిగిందో శ్రీవల్లికి చెప్తారు. వాళ్ళు చెప్పాల్సింది మొత్తం అబ్బాయి వాళ్ల నాన్నకి చెప్తారు కానీ అతనికి చెవులు వినిపించవు.. వాళ్ల అమ్మ కి చెప్పేలోపు అటువైపు గా ప్రేమ, ధీరజ్ వెళ్లడం చూసి మళ్ళీ చెప్పలేకపోయామని శ్రీవల్లికి భాగ్యం చెప్తుంది.