English | Telugu

కంటెస్టెంట్స్ మధ్య 'నువ్వా నేనా' అన్నట్లు సాగిన టాస్క్!

బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ భాగంగా కంటెస్టెంట్స్ ఫుడ్ కోసం నిన్నటి వరకు ఆటలో పాల్గొన్నారు. కాగా బిగ్ బాస్ ఆదేశానుసారం అందరిని ఇప్పటి నుండి హౌస్ లో ఉండడం కోసం టాస్క్ ఆడమని చెప్పారు. దీంతో హౌస్ మేట్స్ ఫుల్ జోష్ తో గేమ్ అడడానికి సిద్ధం అయ్యారు.

కెప్టెన్సీ టాస్క్ రద్దు కారణంగా పనిష్మెంట్ తీసుకోవడం మంచిదే అయింది. ఇప్పుడు అందరూ బాగా ఎంటర్టైన్మెంట్ చేస్తున్నారని ప్రేక్షకులు భావిస్తున్నారు. ఎందుకంటే టాస్క్ లో అందరు వారికి సాధ్యమైనంత వరకు ప్రయత్నిస్తున్నారు. కాగా ఈ టాస్క్ లో ఫిజికల్ అవ్వడం, ఒకరినొకరు తిట్టుకోవడం. ఇదంతా చూసే ప్రేక్షకులకు కాస్త ఎంటర్టైన్మెంట్ లా అనిపించింది అని చెప్పడం లో సందేహం లేదు. నిన్న జరిగిన టాస్క్ లో రేవంత్ పేరు ఎక్కువ సార్లు వినిపించింది. శ్రీసత్య ప్రతీసారి రేవంత్ ని టార్గెట్ చేసినట్టు తెలుసింది. అలాగే మెరీనా, శ్రీహాన్ మధ్య కాసేపు వాగ్వాదం జరిగింది.

అప్పటికే హౌస్ రెండు గ్రూప్ లుగా ఉన్నా విషయం తెలిసిందే. కాగా ఇరు గ్రూపులు కూడా నువ్వా నేనా అంటు టాస్క్ ఆడుతున్నారు. రేవంత్ శ్రీసత్య మధ్య కొంత వాగ్వాదం జరిగింది. "ప్రతీసారి నువ్వు నన్నే టార్గెట్ చేసి అంటున్నావ్. నేను చూస్తున్నాను" అని రేవంత్ అనగా, "అదేం లేదు నాకు నువ్వు మాత్రమే కనిపిస్తున్నావ్. నువ్వు ఫేయిర్ గేమ్ ఆడట్లేదు " అని శ్రీసత్య చెప్పుకొచ్చింది. ఆ తర్వాత అర్జున్, పైమాను తోసేసాడు. అది చూసిన రేవంత్, "ఎవరు అడ్డమొస్తే వారిని తోసిపడదొబ్బు" అని అన్నాడు. అది విన్న శ్రీసత్య, "ఫార్మల్ వర్డ్స్ వాడు" అని రేవంత్ తో చెప్పింది. "తోసిపడదొబ్బు, ఏసిపడదొబ్బు అంటే ఎవరు పడేలా లేరు ఇక్కడ. చూసుకొని మట్లాడు" అని శ్రీసత్య, రేవంత్ తో చెప్పగా, అలాగే "మీరేం నాకు చెప్పాల్సిన అవసరం లేదు" అని రేవంత్ అన్నాడు.

శ్రీహాన్, శ్రీసత్య మధ్య ఆర్గుమెంట్ కొనసాగగా, శ్రీహాన్, అర్జున్ మధ్య గట్టిగానే గొడవ జరిగింది. "నువ్వు నా కాళ్ళు పట్టుకొని లాగావ్ అది ఫిజికల్ కాదా" అని అర్జున్ అనగా, "నువ్వు నన్ను లాగేసావ్. ఇది ఫిజికల్ కాదా" అని శ్రీహాన్ చెప్పాడు. కాసేపు ఇద్దరికి వాగ్వాదం జరిగింది. ఇందులో శ్రీహాన్, అర్జున్ తో దమ్ముంటే అడ్డుకో అన్నాడు. " ఆ నేను చూస్తా, నువ్వెలా అడ్డుకుంటావో" అని అర్జున్ అన్నాడు.

Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.

Illu illalu pillalu : అమూల్యకి పెళ్ళిచూపులు.. కామాక్షి ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -362 లో.. పెళ్లిచూపులకి ఇంకా రావడం లేదని రామరాజు వాళ్ళు ఎదురుచూస్తుంటే వాళ్ళు రారుగా అని శ్రీవల్లి మనసులో అనుకుంటుంది. అప్పుడే అబ్బాయి వాళ్ళు పెళ్లిచూపులకు ఎంట్రీ ఇస్తారు‌. దాంతో శ్రీవల్లి షాక్ అవుతుంది. భాగ్యం, ఆనందరావు కూడా వస్తారు. వాళ్ళు ఏం జరిగిందో శ్రీవల్లికి చెప్తారు. వాళ్ళు చెప్పాల్సింది మొత్తం అబ్బాయి వాళ్ల నాన్నకి చెప్తారు కానీ అతనికి చెవులు వినిపించవు.. వాళ్ల అమ్మ కి చెప్పేలోపు అటువైపు గా ప్రేమ, ధీరజ్ వెళ్లడం చూసి మళ్ళీ చెప్పలేకపోయామని శ్రీవల్లికి భాగ్యం చెప్తుంది.