English | Telugu

గ్రాండ్ గా బిగ్ బాస్ కంటెస్టెంట్ పెళ్లి...సందడి చేసిన మిగతా కంటెస్టెంట్స్


బిగ్‌బాస్ తెలుగు సీజన్ 8తో ఆడియన్స్ కి బాగా దగ్గరయ్యింది సోనియా ఆకుల.ఇక ఇప్పుడు తన లవర్ యష్ ని అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకుంది. యష్ తో వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టింది సోనియా. ఈ పెళ్ళికి మొత్తం బిగ్‌బాస్ కంటెస్టెంట్స్, మాజీ కంటెస్టెంట్స్ వెళ్లారు. ఈ వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. అందులో జెస్సీ, అమర్ దీప్, తేజస్విని, బేబక్క, రోహిణి, టేస్టీ తేజ, కిర్రాక్ సీత వచ్చారు. డైరెక్టర్ ఆర్జీవీ తెరకెక్కించిన కొన్ని మూవీస్ లో సోనియా నటించింది.

ఆ పాపులారిటీతో సోనియా బిగ్‌బాస్ లోకి అడుగుపెట్టింది. ఇక హౌస్ లో స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా నిరూపించుకుంది. తర్వాత నిఖిల్, పృథ్వీతో ఫ్రెండ్ షిప్ కారణంగా ఆమె మీద చాలా నెగటివిటీ వచ్చేసింది. ఫైనల్ గా ఫోర్త్ వీక్ లోనే ఎలిమినేట్ ఐపోయింది. హౌస్ నుంచి వచ్చాక సోషల్ మీడియాలో తెగ ఫేమస్ అయ్యింది సోనియా. హౌస్ నుంచి బయటకు వచ్చాక ఎన్నో ఇంటర్వ్యూలలో మాట్లాడింది. ఇక తన ఫ్రెండ్స్ నిఖిల్, పృథ్వీతో తనకున్న బాండింగ్ పై సైతం క్లారిటీ ఇచ్చింది.

Jayam serial : బాక్సింగ్ పోటీలో మిస్సెస్ గంగ రుద్ర ప్రతాప్.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -160 లో..... గంగని ఎలాగైనా అకాడమీ సెలక్షన్ కి వెళ్లకుండా ఆపాలని ఇషిక, వీరు ట్రై చేస్తారు కానీ గంగ, రుద్ర ఇద్దరు కలిసి ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసి అకాడమీకి వెళ్తారు. రుద్ర అకాడమీ బయటే ఉంటాడు. నాకు సంబంధించిన కేసు ఇంకా పెండింగ్ లో ఉంది అలా ఉండగా.. నేను లోపలకు రాకూడదని రుద్ర బయటే ఉండి గంగకి అంతా వివరిస్తాడు. నేను నీ పేరు మైక్ లో రావడం వినాలని రుద్ర అంటాడు. గంగ లోపలకు వెళ్తుంది. అక్కడ పారు ఇంకా తన ఫ్రెండ్స్ కలిసి గంగని చులకనగా మాట్లాడుతారు.

Brahmamudi : రుద్రాణిని రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన కనకం!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -922 లో.. ఒకతను వచ్చి రుద్రాణికి మళ్ళీ పసరు మందు ఇస్తాడు. ఆ పసరు మందు పని చేస్తుందా లేదా అని రుద్రాణి అతన్ని అడుగుతుంది. పని చేస్తుందని అతను చెప్తాడు. దాంతో రుద్రాణి పసరు మందు తీసుకొని లోపలికి వెళ్తుంటే అప్పుడే కనకం ఎదురుపడుతుంది. కనకాన్ని చూసి రుద్రాణి టెన్షన్ పడుతుంది. చేతిలో అదేంటీ అని కనకం అనగానే ఇదా.... నాకే పసరు మందు అజీర్తికి వాడమని చెప్పారని చెప్పి రుద్రాణి వెళ్ళిపోతుంది. అలా అయితే ఇంత రాత్రివేళ తీసుకొని వెళ్తుంది ఏంటని కనకంకి డౌట్ వస్తుంది.