English | Telugu

తన తుదిశ్వాస వరకు ఋణపడి ఉంటానని చెప్పిన రాజ్!

ముత్యాలు రాజ శేఖర్.. ఈ పేరు ఎవరికి తెలిసిఉండకపోవచ్చు.‌ కానీ బిగ్ బాస్ సీజన్-6 లో రాజ్ అంటే అందరికి తెలిసి ఉంటుంది. తన కామ్ అండ్ కూల్ నేచర్ తో బిగ్ బాస్ ప్రేక్షకులను తనవైపుకి తిప్పుకున్నాడు రాజ్.

రాజ్ ఒక మోడల్ గా బిగ్ బాస్ సీజన్-6 లోకి అడుగుపెట్టాడు. రాజ్ వాళ్ళ నాన్న 2009 లో చనిపోవడంతో తను చదువు మానేసి ఆఫీస్ బాయ్ గా చేసాడంట. ఆ తర్వాత చిన్న చితక జాబ్స్ చేస్తూ చదువుకున్నాడు. ఒక స్టేజ్ లో తనకి లైఫ్ మీద ఒక క్లారిటీ వచ్చిందని, లివ్ వాట్ యూ లవ్ అనేది తను నమ్మాడని ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు రాజ్. బిగ్ బాస్ సీజన్‌-6 లోకి ఎంట్రీ ఇచ్చాక తనలో చాలా మార్పు వచ్చింది. రాజ్ మొదట కీర్తభట్, ఇనయా సుల్తానాలతో ఎక్కువగా ఉన్నాడు. ఆ తర్వాత ఫైమాతో ఫ్రెండ్ షిప్ చేసాడు. దాంతో రాజ్ కి ఒక తోడులా, ఏది ఎలా మాట్లాడాలని, ఎవరు ఎలా ఉంటారో తెలియజేసింది ఫైమా. అయితే చలాకి చంటితో కలిసి కామెడీ చేసిన రాజ్.. బిగ్ బాస్ హౌస్ లో ఉన్నన్ని రోజులు ప్రేక్షకులను ఆకట్టున్నాడు.

బిగ్ బాస్ హౌస్ లో ఉన్నన్నిరోజులు.. రాజ్ ఎక్కడున్నా రాజే అని నాగార్జున అనేవాడు. అలాగే రాజ్ రెగ్యులర్ గా వాడే ఊతపదం 'మినమం ఉంటది' అనేది ఎక్కువ ఫేమస్ అయింది. అయితే రాజ్ బిగ్ బాస్ తర్వాత తన ఫ్యాన్స్ కి దగ్గరగా ఉంటున్నాడు. ఇన్ స్టాగ్రామ్ లో రెగ్యులర్ గా పోస్ట్ లు చేస్తూ అప్డేట్ లో ఉంటున్న రాజ్.‌ తాజాగా బిగ్ బాస్ కి థాంక్స్ చెప్తూ ఒక నోట్ రాసాడు. 'నా లైఫ్ ని మిరాకిల్ గా మార్చావ్.. నా చివరి శ్వాస ఉన్నంతకాలం నీకు ఋణపడి ఉంటాను' అని రాజ్ ఆ పోస్ట్ లో చెప్పాడు. దాంతో బిగ్ బాస్ ఫ్యాన్స్ కామెంట్లతో తమ అభిప్రాయాలను తెలుపుతూ పాజిటివ్ గా కామెంట్ చేస్తున్నారు.

Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.

Illu illalu pillalu : అమూల్యకి పెళ్ళిచూపులు.. కామాక్షి ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -362 లో.. పెళ్లిచూపులకి ఇంకా రావడం లేదని రామరాజు వాళ్ళు ఎదురుచూస్తుంటే వాళ్ళు రారుగా అని శ్రీవల్లి మనసులో అనుకుంటుంది. అప్పుడే అబ్బాయి వాళ్ళు పెళ్లిచూపులకు ఎంట్రీ ఇస్తారు‌. దాంతో శ్రీవల్లి షాక్ అవుతుంది. భాగ్యం, ఆనందరావు కూడా వస్తారు. వాళ్ళు ఏం జరిగిందో శ్రీవల్లికి చెప్తారు. వాళ్ళు చెప్పాల్సింది మొత్తం అబ్బాయి వాళ్ల నాన్నకి చెప్తారు కానీ అతనికి చెవులు వినిపించవు.. వాళ్ల అమ్మ కి చెప్పేలోపు అటువైపు గా ప్రేమ, ధీరజ్ వెళ్లడం చూసి మళ్ళీ చెప్పలేకపోయామని శ్రీవల్లికి భాగ్యం చెప్తుంది.