English | Telugu

వన్ ఛాన్స్ ప్లీజ్...డైరెక్టర్స్ కోసం పోస్ట్ పెట్టిన ప్రేరణ

స్టార్ మాలో కృష్ణ ముకుంద మురారి సీరియల్ తో తెలుగు ఆడియన్స్ కి బాగా దగ్గరైన నటి ప్రేరణ. కన్నడ పోరి ఐనా కానీ తెలుగు ఆడియన్స్ ని బాగానే ఆకట్టుకుంది. ఈమె బిగ్ బాస్ సీజన్ 8 కి కూడా వెళ్ళొచ్చింది. అలాగే ఇష్మార్ట్ జోడిలో కూడా సందడి చేసింది. అలాంటి ప్రేరణ రీసెంట్ గా తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో ఒక పోస్ట్ పెట్టింది. "విజనరీ డైరెక్టర్స్ కి కి ఒక విషయం. మీకు స్క్రీన్ ప్రెజన్స్ లో అందంగా కనిపిస్తూ ఎమోషన్స్ ని బాగా పండిస్తూ ఆ రోల్ బలాన్ని చాటి చెప్పే సత్తా ఉన్న నటి కోసం మీరు చూస్తున్నట్టయితే నా పేరును పరిశీలించండి. నన్ను కేవలం బిగ్ బాస్ ఫైనలిస్ట్ గా కాకుండా అంతకంటే ఎక్కువ విలువలు ఉన్న మహిళగా, సవాళ్లు ఎదుర్కునే స్త్రీగా, అంతః సౌందర్యంతో ఉండే అమ్మాయిని. ఒక్క అవకాశం ఇస్తే ఆమె తానేంటో నిరూపించుకుంటుంది" అంటూ వన్ ఛాన్స్ అంటూ ఒక పోస్ట్ పెట్టింది.

ప్రేరణ కన్నడలో "చూరికట్టే" అనే మూవీలో నటించింది. తర్వాత ఆయన, పెంటగాన్, ఫిజిక్స్ టీచర్ వంటి మూవీస్ లో కూడా నటించింది. కన్నడ మినీ బిగ్ బాస్ సీజన్ లో కూడా కంటెస్టెంట్ గా వెళ్ళింది. ఇక ఈమె శ్రీపాద్ ని వివాహం చేసుకుంది. కొన్ని వరకు ప్రేరణ మాత్రమే బుల్లితెర షోస్ లో కనిపించేది కానీ తర్వాత తనతో పాటు తన భర్తను కూడా షోస్ లో ఇంట్రడ్యూస్ చేసింది. అలా ఆదివారం విత్ స్టార్ మా పరివారం షోలో వీళ్ళు జంటగా వస్తూ ఎంటర్టైన్ చేస్తూ ఉంటారు. ఇక ఇప్పుడు ప్రేరణ మనసు మూవీస్ మీదకు మళ్లింది. మరి డైరెక్టర్స్ ఎవరైనా ఆమెకు అవకాశం ఇస్తారో లేదో చూడాలి.

Jayam serial : బాక్సింగ్ పోటీలో మిస్సెస్ గంగ రుద్ర ప్రతాప్.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -160 లో..... గంగని ఎలాగైనా అకాడమీ సెలక్షన్ కి వెళ్లకుండా ఆపాలని ఇషిక, వీరు ట్రై చేస్తారు కానీ గంగ, రుద్ర ఇద్దరు కలిసి ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసి అకాడమీకి వెళ్తారు. రుద్ర అకాడమీ బయటే ఉంటాడు. నాకు సంబంధించిన కేసు ఇంకా పెండింగ్ లో ఉంది అలా ఉండగా.. నేను లోపలకు రాకూడదని రుద్ర బయటే ఉండి గంగకి అంతా వివరిస్తాడు. నేను నీ పేరు మైక్ లో రావడం వినాలని రుద్ర అంటాడు. గంగ లోపలకు వెళ్తుంది. అక్కడ పారు ఇంకా తన ఫ్రెండ్స్ కలిసి గంగని చులకనగా మాట్లాడుతారు.

Brahmamudi : రుద్రాణిని రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన కనకం!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -922 లో.. ఒకతను వచ్చి రుద్రాణికి మళ్ళీ పసరు మందు ఇస్తాడు. ఆ పసరు మందు పని చేస్తుందా లేదా అని రుద్రాణి అతన్ని అడుగుతుంది. పని చేస్తుందని అతను చెప్తాడు. దాంతో రుద్రాణి పసరు మందు తీసుకొని లోపలికి వెళ్తుంటే అప్పుడే కనకం ఎదురుపడుతుంది. కనకాన్ని చూసి రుద్రాణి టెన్షన్ పడుతుంది. చేతిలో అదేంటీ అని కనకం అనగానే ఇదా.... నాకే పసరు మందు అజీర్తికి వాడమని చెప్పారని చెప్పి రుద్రాణి వెళ్ళిపోతుంది. అలా అయితే ఇంత రాత్రివేళ తీసుకొని వెళ్తుంది ఏంటని కనకంకి డౌట్ వస్తుంది.