English | Telugu

బిగ్ బాస్ హౌస్‌లో శోభా శెట్టిని గన్‌తో కాల్చిన గౌతమ్!

బిగ్ బాస్ సీజన్-7 లో పదకొండు వారాలు పూర్తిచేసుకొని పన్నెండవ వారం ముగింపుకి వచ్చింది. ఇక గ్రాంఢ్ ఫినాలేకి కొన్ని వారాలే ఉండటంతో ఈ వారం చివరి కెప్టెన్ ఎవరా అని ఆసక్తి అందరిలో నెలకొంది.

తాజాగా విడుదలైన ప్రోమోలో.. పన్నెండవ వారం హౌస్ లో కొత్త కెప్టెన్సీ కోసం " మెషిన్ గన్ టాస్క్ " ఇచ్చాడు బిగ్ బాస్. ఇందులో గన్ షూటింగ్ సౌండ్ వచ్చిన ప్రతీసారీ రెండు ఫోటోలు ఎదురుగా ఉంటాయి. ఇద్దరు కంటెస్టెంట్స్ వచ్చి ఏకాభిప్రాయంతో ఒకరిని సెలెక్ట్ చేసుకొని మరొకరిని తీసేయాలని‌‌ బిగ్ బాస్ చెప్పాడు. శోభాశెట్టి, అంబటి అర్జున్ ఇద్దరి ఫోటోలు రాగా గౌతమ్ కృష్ణ తన సపోర్ట్ ని అంబటి అర్జున్ కి ఇచ్చాడు. గౌతమ్ తో కంపేర్ చేస్తే శోభాశెట్టి అన్ ఫెయిర్ గేమ్ ఆడుతుందని అనిపిస్తుందని అందుకే తీసేస్తున్నట్టుగా గౌతమ్ కృష్ణ అన్నాడు. అలా అనగానే శోభాశెట్టి అందుకుంది. నేనెక్కడ ఫౌల్ చేశాను, ఎక్కడ అన్ ఫెయిర్ గేమ్ ఆడానంటూ రెచ్చిపోతూ కన్పించింది‌. ఇక గౌతమ్, ప్రియాంక కలిసి ఏకాభిప్రాయంతో శోభాశెట్టిని కెప్టెన్సీ రేస్ నుండి తప్పించినట్టు తెలుస్తుంది. ఇక ప్రియంక మరియు శోభాశెట్టి మధ్య గ్యాప్ పెరిగే అవకాశం ఉంది. ఇక మరోసారి గన్ షూటింగ్‌ లో .. శివాజీ, ప్రశాంత్ ల ఫోటోలు రావడంతో అటు యావర్ కాల్చే వ్యక్తిగా ఉన్నాడు. నా ఫోటో కాల్చొద్దని నేనంటున్నా అని ప్రశాంత్ అనగా.. శివాజీ అన్న ఫోటో కాల్చాలా అని యావర్ అన్నాడు‌. ఇక ఇందులో ప్రశాంత్ ఫోటో కాలిపోతుందని తెలుస్తుంది.

అమర్ దీప్, అశ్వినిశ్రీ ఇద్దరి ఫోటోలు ఉండగా.. కాల్చడానికి శోభాశెట్టి, ప్రశాంత్ ఉన్నారు. ఇక ఇద్దరు కలిసి అశ్వినిశ్రీని తప్పించినట్టు తెలుస్తుంది. నా సపోర్ట్ ఎప్పుడు అమర్ దీప్ కి, అపోజిట్ గా ఎవరున్నా తీసేస్తానని శోభాశెట్టి గర్వంగా చెప్పింది. ఇక ప్రశాంత్ తన సపోర్ట్ అమర్ కే అని చెప్పగా.. నన్ను ఈ కెప్టెన్సీ రేస్ నుండి ఎవరు తీసేసిన ఒప్పుకుంటాను కానీ నువ్వు తీసేసావ్ చూడు అది నేను తీసుకోలేకపోతున్నాని అశ్వినిశ్రీ అంది. ఇక ఇదే చిట్ట చివరి కెప్టెన్సీ టాస్క్ కాబట్టి ఎవరు కెప్టెన్ అవుతారనే ఆసక్తి అందరిలో ఉంది.

Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.

Illu illalu pillalu : అమూల్యకి పెళ్ళిచూపులు.. కామాక్షి ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -362 లో.. పెళ్లిచూపులకి ఇంకా రావడం లేదని రామరాజు వాళ్ళు ఎదురుచూస్తుంటే వాళ్ళు రారుగా అని శ్రీవల్లి మనసులో అనుకుంటుంది. అప్పుడే అబ్బాయి వాళ్ళు పెళ్లిచూపులకు ఎంట్రీ ఇస్తారు‌. దాంతో శ్రీవల్లి షాక్ అవుతుంది. భాగ్యం, ఆనందరావు కూడా వస్తారు. వాళ్ళు ఏం జరిగిందో శ్రీవల్లికి చెప్తారు. వాళ్ళు చెప్పాల్సింది మొత్తం అబ్బాయి వాళ్ల నాన్నకి చెప్తారు కానీ అతనికి చెవులు వినిపించవు.. వాళ్ల అమ్మ కి చెప్పేలోపు అటువైపు గా ప్రేమ, ధీరజ్ వెళ్లడం చూసి మళ్ళీ చెప్పలేకపోయామని శ్రీవల్లికి భాగ్యం చెప్తుంది.