English | Telugu

స్టాండప్ కమెడియన్ కాస్త మోడల్ గా...బిగ్ బాస్ కంటెస్టెంట్ లో లవ్ బ్రేకప్

పటాస్ ప్రియా అంటే తెలుగు ఆడియన్స్ పెద్దగా పరిచయం లేదు కానీ రతిక రోజ్ అంటే చాలు బిగ్ బాస్ సీజన్ 7 లో అలరిస్తున్న అమ్మాయి అంటే అందరికీ అర్థమైపోతుంది. 2016లో ఈటీవీ ప్లస్‌లో ప్రసారమైన ‘పటాస్’ అనే స్టాండప్ కామెడీ షోలో ఒక స్టాండప్ కామెడియన్‌గా ఆడియన్స్ నవ్వించేది ప్రియా. అలా ఒక ఏడాది ఈ షోలో కనిపించింది.

ఆ తర్వాత తను షోలో కనిపించడం మానేసింది. తర్వాత రతిక రోజ్ గా పేరు మార్చుకుని మళ్లీ ఆడియన్స్ ముందుకు వచ్చింది. మోడల్‌గా బిజీ అయిపోయింది. ఈ టైంలోనే ఆమె మూవీ ఛాన్సెస్ కూడా వచ్చాయి. షకలక శంకర్ నటించిన "బొమ్మ అదిరింది.. దిమ్మ తిరిగింది" చిత్రంలో రతిక ఓ పాత్రలో నటించింది. కానీ ఈ మూవీ ఆమెకు పెద్దగా గుర్తింపు తీసుకురాలేకపోయింది. రీసెంట్ గా వచ్చిన బెల్లంకొండ గణేష్ హీరోగా నటించిన "నేను స్టూడెంట్ సర్" మూవీలో నటించింది రతిక. ఈమె ఈ మూవీలో గ్లామర్ పోలీస్ గా కనిపించడంతో ఆ పాత్ర ఆమెకు మంచి క్రేజ్ తీసుకువచ్చింది. ఇక రతిక లవ్ బ్రేకప్ గురించి రీసెంట్ ఎపిసోడ్ బిగ్ బాస్ రివీల్ చేసేసాడు. ఇక ఈ భామకు సోషల్ మీడియాలోనూ ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువే.

రతికకు ఇన్‌స్టాగ్రామ్‌లో దాదాపుగా 133 వేల మంది ఫాలోవర్స్ ఉన్నారు. తమిళంలో కూడా రతిక అవకాశాలు అందుకుంటోంది. ‘మారో’ అనే తమిళ డెబ్యూలో నటించింది రతిక. ఐతే ఈ మూవీ ఇంకా రిలీజ్ కాలేదు రిలీజ్ ఐన మూవీస్ కూడా రతికాకు పెద్ద పేరు తెచ్చిపెట్టింది కూడా లేదు. కానీ ఆమె పోస్ట్ చేసే ఇన్‌స్టాగ్రామ్ పోస్టులకు మాత్రం ఫాలోవర్స్‌ను బాగా తెచ్చిపెట్టాయి. ఐతే బిగ్ బాస్ గ్రాండ్ లాంచ్ రోజున " అసలు బిగ్ బాస్‌లోకి ఎందుకు వచ్చావు" అని నాగార్జున అడగడంతో "ఎన్నో మూవీస్ లో నటించినా రాని గుర్తింపు బిగ్ బాస్‌ ద్వారా వస్తుందని భావించి వచ్చాను" అని చెప్పింది. నిజంగానే ఈ బిగ్ బాస్ ఎపిసోడ్ ద్వారా రతిక ఆల్రెడీ ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించేసుకుంది.

Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.

Illu illalu pillalu : అమూల్యకి పెళ్ళిచూపులు.. కామాక్షి ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -362 లో.. పెళ్లిచూపులకి ఇంకా రావడం లేదని రామరాజు వాళ్ళు ఎదురుచూస్తుంటే వాళ్ళు రారుగా అని శ్రీవల్లి మనసులో అనుకుంటుంది. అప్పుడే అబ్బాయి వాళ్ళు పెళ్లిచూపులకు ఎంట్రీ ఇస్తారు‌. దాంతో శ్రీవల్లి షాక్ అవుతుంది. భాగ్యం, ఆనందరావు కూడా వస్తారు. వాళ్ళు ఏం జరిగిందో శ్రీవల్లికి చెప్తారు. వాళ్ళు చెప్పాల్సింది మొత్తం అబ్బాయి వాళ్ల నాన్నకి చెప్తారు కానీ అతనికి చెవులు వినిపించవు.. వాళ్ల అమ్మ కి చెప్పేలోపు అటువైపు గా ప్రేమ, ధీరజ్ వెళ్లడం చూసి మళ్ళీ చెప్పలేకపోయామని శ్రీవల్లికి భాగ్యం చెప్తుంది.