English | Telugu

బిగ్ బాస్ హౌస్ లోకి శ్రష్టి వర్మ.. ఆట మామూలుగా ఉండదు!

బిగ్ బాస్ తెలుగు సీజన్-9 త్వరలో ప్రారంభం కానుంది. ఈ సీజన్ లో కంటెస్టెంట్స్ ఎవరనే ఆసక్తి అందరిలో నెలకొంది. ఇప్పటికే పలువురి పేర్లు వినిపించాయి. ఇప్పుడు లేడీ కొరియోగ్రాఫర్ శ్రష్టి వర్మ పేరు తెరపైకి వచ్చింది. (Shrasti Verma)

ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ దగ్గర అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా పని చేసిన శ్రష్టి వర్మ అందరికీ సుపరిచితమే. జానీ మాస్టర్ పై లైంగిక వేధింపుల కేసు పెట్టడంతో.. మీడియాలో ఆమె పేరు మారుమోగిపోయింది. ఈ కేసులో జానీ మాస్టర్ కొద్దిరోజులు జైలు జీవితం కూడా గడిపాడు. (Bigg Boss 9 Telugu)

జానీ మాస్టర్ కేసుతో శ్రష్టి వర్మ పేరు చాలారోజులు మీడియా, సోషల్ మీడియాలో నానింది. ఆ సమయంలో ఆమె ఎన్నో ఇంటర్వ్యూలు ఇచ్చింది. ఇటీవల కొన్ని సాంగ్స్ కి కొరియోగ్రఫీ కూడా చేసింది. సినిమాల్లోనూ నటిగా అవకాశాలు వస్తున్నట్లు తెలుస్తోంది. ఇలాంటి సమయంలో ఆమె బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టనుందన్న వార్త ఆసక్తికరంగా మారింది.

శ్రష్టి వర్మ ఇంటర్వ్యూలను గమనిస్తే.. ఆమె ఒక ఫైటర్ అని, స్ట్రాంగ్ లేడీ అని అర్థమవుతోంది. బిగ్ బాస్ హౌస్ అంటేనే వివాదాలు, గొడవలకు పెట్టింది పేరు. మరి బిగ్ బాస్ హౌస్ లో శ్రష్టి వర్మ ఎలా ఆడబోతుంది? తనలోని అసలుసిసలైన ఫైటర్ ని చూపించబోతుందా? అనేది కొద్దిరోజుల్లో తేలిపోనుంది.

Jayam serial : బాక్సింగ్ పోటీలో మిస్సెస్ గంగ రుద్ర ప్రతాప్.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -160 లో..... గంగని ఎలాగైనా అకాడమీ సెలక్షన్ కి వెళ్లకుండా ఆపాలని ఇషిక, వీరు ట్రై చేస్తారు కానీ గంగ, రుద్ర ఇద్దరు కలిసి ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసి అకాడమీకి వెళ్తారు. రుద్ర అకాడమీ బయటే ఉంటాడు. నాకు సంబంధించిన కేసు ఇంకా పెండింగ్ లో ఉంది అలా ఉండగా.. నేను లోపలకు రాకూడదని రుద్ర బయటే ఉండి గంగకి అంతా వివరిస్తాడు. నేను నీ పేరు మైక్ లో రావడం వినాలని రుద్ర అంటాడు. గంగ లోపలకు వెళ్తుంది. అక్కడ పారు ఇంకా తన ఫ్రెండ్స్ కలిసి గంగని చులకనగా మాట్లాడుతారు.

Brahmamudi : రుద్రాణిని రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన కనకం!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -922 లో.. ఒకతను వచ్చి రుద్రాణికి మళ్ళీ పసరు మందు ఇస్తాడు. ఆ పసరు మందు పని చేస్తుందా లేదా అని రుద్రాణి అతన్ని అడుగుతుంది. పని చేస్తుందని అతను చెప్తాడు. దాంతో రుద్రాణి పసరు మందు తీసుకొని లోపలికి వెళ్తుంటే అప్పుడే కనకం ఎదురుపడుతుంది. కనకాన్ని చూసి రుద్రాణి టెన్షన్ పడుతుంది. చేతిలో అదేంటీ అని కనకం అనగానే ఇదా.... నాకే పసరు మందు అజీర్తికి వాడమని చెప్పారని చెప్పి రుద్రాణి వెళ్ళిపోతుంది. అలా అయితే ఇంత రాత్రివేళ తీసుకొని వెళ్తుంది ఏంటని కనకంకి డౌట్ వస్తుంది.