English | Telugu

Bigg boss 9 Telugu : పట్టు వదలకు టాస్క్ లో డీమాన్ పవన్ గెలుపు.. గట్టి పోటీ ఇచ్చిన భరణి!

బిగ్ బాస్ సీజన్-9 అయిదో వారం లో కెప్టెన్ రాము రాథోడ్, ఇమ్మాన్యుయల్ తప్ప అందరు నామినేషన్ లో ఉన్నారు. ఇక అయిదో వారం చివర్లో వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ ల ఎంట్రీ ఉంటుందని బిగ్ ట్విస్ట్ ఇచ్చాడు బిగ్ బాస్. నిన్నటి(మంగళవారం) నాటి ఎపిసోడ్ లో ఏం జరిగిందో ఓసారి చూసేద్దాం.

హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ తమ ఫ్యామిలీలని గుర్తుచేసుకొని ఎమోషనల్ అవుతారు. అలాగే సంజనా తనకిచ్చిన పనిష్మెంట్ అంట్లు తోమడం చేస్తూ ఫన్ జనరేట్ చేస్తుంది. ఇక ఇలా కాసేపు వీరి కబుర్లు చూపించిన బిగ్ బాస్. గార్డెన్ ఏరియాలోకి వెళ్ళడానికి డోర్స్ ఓపెన్ చేశాడు. ఇక అందులో అప్పటికే డేంజర్ జోన్ అని పెద్ద పెద్ద అక్షరాలతో బోర్డ్ లు పెట్టి, బార్డర్ లు కూడా కట్టేశాడు బిగ్ బాస్. 'రణరంగం మీ ఊహలకి అందని ప్రదేశం.. ఈ వారం డేంజర్‌లో ఉన్నవారికి పెద్ద ప్రమాదం పొంచి ఉంది.. వచ్చే ఫైర్ స్టార్మ్ డేంజర్‌లో ఉన్నవారిని కుదిపేస్తుంది.. ఆ ఫైర్ స్టార్మ్ ఏంటో మీకు తెలుసా.. వైల్డ్ కార్డ్స్ ఈ ఇంట్లోకి అడుగుపెట్టబోతున్నారు.. ఈ తుఫాను నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోవటానికి ఒకే ఒక్క ఛాన్స్' అంటూ కంటెస్టెంట్స్ కి దడ పుట్టించాడు బిగ్ బాస్.

వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ ని ఆపాలంటే మీరు కొన్ని టాస్క్ లు ఆడాలని కంటెస్టెంట్స్ ని టీమ్ లుగా డివైడ్ చేశాడు బిగ్ బాస్. ఇమ్మాన్యుయల్, రాము రాథోడ్ లని ఈ టాస్క్ లకి సంచాలకులుగా నియమించాడు. భరణి-దివ్య ఒక టీమ్, సంజన-ఫ్లోరా ఒక టీమ్, రీతూ-డీమాన్ పవన్, తనూజ-కళ్యాణ్, సుమన్-శ్రీజ టీమ్ లుగా ఉన్నారు. మొదటి టాస్క్.. పట్టు వదలకు .. ఇందులో పోటీ పడే వాళ్ళు తమ సీసాని చివరివరకూ ప్లాట్‌ఫామ్‌కి టచ్ కాకుండా చూసుకోవాలి. వారే ఈ టాస్కు విజేతలు అవుతారని బిగ్‌బాస్ చెప్పాడు.

ఇందులో మొదటగా సుమన్ శెట్టి ట్రాప్ అవుతాడు. ఆ తర్వాత సంజనా ట్రాప్ అవుతుంది. కాసేపటికి పవన్ కళ్యాణ్ డ్రాప్ అవుతాడు. ఇక చివరగా డీమాన్ పవన్, భరణి ఉంటారు. చివరి వరకు టఫ్ ఫైట్ ఇచ్చిన భరణి నొప్పి భరించలేక డ్రాప్ అవుతాడు.‌ ఇక 'పట్టు వదలకు' టాస్క్ లో డీమాన్ పవన్-రీతూ టీమ్ గెలుస్తుంది. ఇక టాస్క్ లో పర్ఫామెన్స్ ని బట్టి పాయింట్లు ఇచ్చాడు బిగ్ బాస్. డీమాన్-రీతూ గెలిచారు కాబట్టి వారికి వంద పాయింట్లు వచ్చాయి. ‌ఇక రెండో స్థానంలో లో భరణి-దివ్య, మూడవ స్థానంలో తనూజ-కళ్యాణ్, నాల్గవ స్థానంలో సంజన-ఫ్లోరా, అయిదవ స్థానంలో సుమన్ శెట్టి-శ్రీజ ఉన్నారు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.

Karthika Deepam2 : దాస్ ని నిజం చెప్పకుండా ఆపిన కార్తీక్.. దీప ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(karthika Deepam2).ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -566 లో.. జ్యోత్స్న గురించి శివన్నారాయణకి దాస్ నిజం చెప్పాలని అనుకుంటాడు. జ్యోత్స్న, పారిజాతం టెన్షన్ పడుతారు. దాస్ ని జ్యోత్స్న  కొట్టిన విషయం చెప్తాడు కావచ్చని దశరథ్ అనుకుంటాడు. జ్యోత్స్న గురించి ఇప్పుడే నిజం తెలియొద్దని దాస్ ని ఆపాలని కార్తీక్ ట్రై చేస్తాడు.. దాస్ నిజం చెప్పబోతుంటే ఒకవైపు దశరథ్.. ఒకవైపు కార్తీక్.. ఒకేసారి దాస్ ని ఆగమంటారు. దాస్ ఏదో ..చెప్పడానికి ఇబ్బంది పడుతున్నావ్ పక్కకిరా.. నాతో చెప్పమని దశరథ్ అంటాడు.