English | Telugu

ఈ వారం అమర్ దీప్ ఎలిమినేషన్ పక్కా.. రైతులని కించపరచడమే కారణమా?

బిగ్ బాస్ సీజన్-7 లో గతవారం కిరణ్ రాథోడ్ ఎలిమినేషన్ అయిన విషయం అందరికి తెలిసిందే. కాగా ఇప్పుడు అమర్ దీప్ ఈ వారం ఎలిమినేషన్ అయ్యే ఛాన్సులు తొంభై శాతం ఉన్నాయంటూ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. ‌కారణం లేకపోలేదు. అయితే బిగ్ బాస్ హౌజ్ లోకి వచ్చి దాదాపు పదకొండు రోజులు కావొస్తుంది.‌ కానీ హౌజ్ లో ఉన్నాడా లేడా అని నాగార్జున వచ్చినప్పుడు అన్నాడు. దాంతో మెల్లి మెల్లిగా ఇప్పుడే మేల్కొన్నాడు.‌ ఇక నామినేషన్లు అడ్డం పెట్టుకొని కామన్ మ్యాన్ ను నామినేట్ చేశాడు అమర్ దీప్.

బీటెక్ చదువుకున్న వాళ్ళని గ్రేట్ అని చెప్పే ప్రాసెస్ లో అమర్ దీప్.. రైతులని తగ్గించి మాట్లాడాడు. పల్లవి ప్రశాంత్ స్ట్రాంగ్ కంటెస్టెంట్ అని అందరికి తెలుసు. దాంతో ఎలాగైనా నామినేట్ చేసి అతడిని బయటకు పంపిస్తే మనకు కాంపిటీషన్ ఉండదంటు దాదాపు మిగిలిన పన్నెండు మంది పల్లవి ప్రశాంత్ గురించి అనుకుంటున్నారు. అయితే సోమవారం జరిగిన నామినేషన్లో పదే పదే రైతు బిడ్డ అంటున్నావ్? ఏంటి గొప్పా? బిటెక్ చదివి, నా‌నా కష్టాలు పడి ఇంటర్వ్యూలకి అటెండ్ అయి ఏదో ఒక జాబ్ లో జాయిన్ అయి, అది సరిగ్గా సరిపోక, ట్రాఫిక్ లో లేట్ గా వెళ్తూ.. అటు ఆఫీస్ లో ఇటు ఇంట్లో మా కష్టాలు నీకు తెలుసా అంటూ సినినా డైలాగ్స్ ని కాపీ కొట్టాడు అమర్ దీప్‌.

అయితే ఇప్పటికే ఫేస్ బుక్ లో , ఇన్ స్టాగ్రామ్ లో అమర్ దీప్ కి వ్యతిరేకంగా పోస్ట్ లు, వీడియోలు, ట్రోల్స్ ట్రెండ్ అవుతున్నాయి. రైతు కష్టాలు అతని చూసి వచ్చాడు కాబట్టి తనకి వచ్చిన డబ్బుని రైతుకి ఇద్దామనుకుంటున్నాడు. నీ మొఖానికి ఏనాడైనా రైతుల కష్టాలేంటో చూశావా అమర్ దీప్? అసలు రైతులు సూసైడ్ ఎందుకు చేసుకుంటారో తెలుసా అమర్ దీప్ ? అంటూ వీడియోల రూపంలో, పోస్ట్ ల రూపంలో అమర్ దీప్ ని విమర్శిస్తున్నారు. కాగా అమర్ దీప్ బయట కొన్ని ఫ్యాన్ పేజ్ లు క్రియేట్ చేసుకొని అందులో తనకు అనుకూలంగా కంటెంట్ రాసేలా చేసుకుంటున్నాడు. అయితే అమర్ దీప్ ఇప్పుడు బిగ్ బాస్ ప్రేక్షకుల దృష్ణిలో చాలా నెగెటివ్ అయ్యాడు.‌ ముఖ్యంగా అతను పల్లవి ప్రశాంత్ ని వాడిన పదాలన్నీ చాలా పెద్ద ఎత్తున ఉద్యమంలా సాగుతుంది. భుజం దించరా, ఇక్కడ యాక్టింగ్ చేయకురా అంటూ అమర్ దీప్ చేసిన వాఖ్యలు పూర్తిగా రెచ్చగొట్టే ధోరణిలో ఉన్నాయంటున్నారు విశ్లేశకులు‌. అయితే సాధారణ రైతు కుటుంబంలో పుట్టి ఎంతో మందికి రిక్వెస్ట్ చేసుకొని బిగ్ బాస్ లోకి రావడానికి తను చాలా కష్టపడిన పల్లవి ప్రశాంత్ ని అందరు కలిసి టార్గెట్ చేశారని, దాంతోపాటు పూర్తిగా తనని ఫిజికల్ గా , మెంటల్ గా గేమ్స్ నుండి, హౌజ్ నుండి పంపించడానికే అమర్ దీప్ కావాలని చేశాడని స్పష్టంగా తెలుస్తుంది. రైతులని మధ్యలోకి తీసుకురావడం మూర్ఖత్వమని, అది మొత్తం అన్ ఫెయిర్ అంటూ సోషల్ మీడియాలో అమర్ దీప్ పై విరుచుకుపడుతున్నారు.

Jayam serial : గంగ, రుద్ర పూజలో కూర్చుంటారా.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -164 లో..... రుద్ర ఏ విధంగా గంగకి హెల్ప్ చేసాడో అందరికి చెప్తాడు. పాపం పెద్దమ్మ హర్ట్ అయినట్లు ఉందని వంశీ అనగానే అయితే అవనివ్వులే గంగ సేఫ్ అయిందని పెద్దసారు అంటాడు. మరొకవైపు పారు ఫ్రెండ్స్ ని అకాడమీ మేడమ్ సస్పెండ్ చేస్తుంది. దాంతో నువ్వు సస్పెండ్ ఆపకపోతే నువ్వే ఇదంతా చేసావని మేడమ్ కి చెప్తానని పారు ఫ్రెండ్ పారుతో అంటుంది. దాంతో మేడమ్ ని సస్పెండ్ క్యాన్సిల్ చెయ్యమని రిక్వెస్ట్ చేస్తుంది పారు. తప్పు ఒప్పుకుంటున్నారు కదా ఈ ఒక్కసారి క్షమించండి అని మేడమ్ తో గంగ అనగానే తను సరే అని సస్పెన్షన్ క్యాన్సిల్ చేస్తుంది.

ఆ మీమ్ నన్ను చాలా డిస్టర్బ్ చేసింది...సావండి అంటున్న నైనికా అనసుర

నైనికా అనసురు బుల్లితెర మీద అందరికీ పరిచయమే. బిగ్ బాస్ సీజన్ 8 ద్వారా బాగా ఫేమస్ అయ్యింది. అలాగే ఢీ డాన్స్ షోలో డాన్స్ ద్వారా బాగా పాపులర్ అయ్యింది. ఇక ఇప్పుడు బిబి జోడి సీజన్ 2 లో అమరదీప్ కి జోడిగా చేస్తోంది. అలాంటి నైనికా రీసెంట్ గా తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో ఘాటుగా ఒక పోస్ట్ పెట్టింది. "ఎలాంటి పని లేకుండా జస్ట్ కూర్చుని అమ్మాయిల చిత్రాలను ఘోరంగా ఎడిట్ చేస్తూ వాళ్ళను హరాస్ చేసే ఒక స్టుపిడ్ మీమ్ పేజీలో పోస్ట్ చేసిన నా చిత్రాలు నన్ను చాలా డిస్టర్బ్ చేశాయి. మీకు పని లేదు బ్రో, మాకు మిమ్మల్ని పట్టించుకునేంత టైం లేదు. నువ్వు మా మీద పోస్ట్లు పెడుతున్నావ్ అంటే నువ్వు నీలోనే తోపు ఐనట్టే..మీ పేరెంట్స్ నిన్ను బాగా పెంచారు. మీలాంటి వాళ్ళే రేపు రేపిస్టుల్లా తయారవుతారు.