English | Telugu

బిగ్ బాస్ షో.. సెలబ్రిటీలు దొరకడం లేదా?

తెలుగులో బిగ్ బాస్ షో ఇప్పటివరకు నాలుగు సీజన్లను పూర్తి చేసుకుంది. అన్ని సీజన్లకు మంచి రేటింగ్స్ వచ్చాయి. ఇప్పుడు సీజన్ 5ను మొదలుపెట్టబోతున్నారు. జూలై నుండి ఈ షో ప్రారంభించాలని బిగ్ బాస్ నిర్వాహకులు భావిస్తున్నారు. దానికి సంబంధించిన పనులను కూడా మొదలుపెట్టారు. అయితే ఇప్పుడు వారికో సమస్య మొదలైంది. అదేంటంటే.. బిగ్ బాస్ షోలో కనిపించడానికి సెలబ్రిటీలెవరూ కూడా ఆసక్తి చూపడంలేదట.

సీజన్ 4లో పేరున్న తారలెవరూ కనిపించలేదనే విమర్శలు వచ్చాయి. అందుకే ఈసారి కాస్త క్రేజ్ ఉన్న వాళ్లను తీసుకురావాలని భావించారు. ఆ విధంగానే 30 మంది సెలబ్రిటీల లిస్ట్ ను సిద్ధం చేశారు. వారిలో 16 మందిని ఫైనల్ చేయాలనుకున్నారు. ఇంటర్వ్యూలు కూడా మొదలుపెట్టారు. అయితే వీరిలో చాలా మంది ఈ ఆఫర్‌ను రిజెక్ట్ చేస్తున్నారట. ఈ షో విషయంలో ఉత్సాహం చూపకపోవడానికి చాలా కారణాలున్నాయి. ఈ షో కోసం తప్పనిసరిగా రెండు వారాలు క్వారెంటైన్‌లో ఉండాలి.

దాంతో పాటు మరో వంద రోజులు షో కోసం వెచ్చించాలి. అంటే దాదాపు నాలుగు నెలల వరకు పర్సనల్ లైఫ్‌కి దూరంగా ఉండాలి. షోలో ఉన్నప్పుడు కరోనా వస్తే ఇంకో తలనొప్పి. అందుకే సెలబ్రిటీలు ఎవరూ కూడా ఈ షోపై పెద్దగా ఆసక్తి చూపడం లేదంటున్నారు. అంతేకాదు.. టైటిల్ గెలిచినప్పటికీ సినిమా అవకాశాలు వస్తాయనే కన్ఫర్మేషన్ లేదు. ఎందుకంటే గతంలో టైటిల్ గెలిచిన వారెవరికీ కూడా సరైన అవకాశాలు రాలేదు. అందుకే ఈ షో వైపు క్రేజ్ ఉన్న వారెవరూ చూడడం లేదు. అంటే ఈసారి కూడా అరకొర సెలబ్రిటీలతో అడ్జస్ట్ అవ్వాలన్నమాట!

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.