English | Telugu

షణ్ముఖ్‌ జస్వంత్‌కి పనోడిగా లోబో!

ఎవరి చేతిలో పవర్‌ రూమ్‌ యాక్సెస్‌ ఉంటే వాళ్లు చెప్పింది మిగతావాళ్లు చేయాల్సిందే! అందుకని, హౌస్‌లో కంటెస్టెంట్లు అందరూ పవర్‌ రూమ్‌ యాక్సెస్‌ కోసం పోటీపడ్డారు. ఒకసారి బజర్‌ మోగినప్పుడు డాన్స్‌ మాస్టర్‌ నటరాజ్‌తో పాటు హీరోయిన్‌ శ్వేతా వర్మ... ఇద్దరూ ఓకేసారి చెయ్యి పెట్టారు. దాంతో ఎవరికీ యాక్సెస్‌ రాలేదు. తర్వాత బజర్‌ మోగినప్పుడు యూట్యూబర్‌ సిరి హన్మంత్‌ యాక్సెస్‌ దక్కించుకుంది.

షణ్ముఖ్‌ జస్వంత్‌, లోబో ఇద్దరిలో ఒకరు ఇంకొకరికి వ్యక్తిగత సేవకుడిగా ఉండాలని సిరి హ‌న్మంతుతో ‘బిగ్‌ బాస్‌’ చెబుతాడు. అప్పుడు షణ్ముఖ్‌ జస్వంత్‌కి పనోడిగా ఉండమని లోబోకి చెప్పంది సిరి. షణ్ముఖ్‌కి లోబో బాడీ మసాజ్‌ చేశాడు. అతడు సేవలు చేస్తున్నప్పుడు మిగతావాళ్లు నవ్వితే.. ‘ఏయ్‌! నవ్వకు నువ్వు’ అని లోబో అన్నాడు. ‘పనోడివి పనోడిలా ఉండు’ అని రవి కామెడీ చేసే ప్రయత్నం చేశాడు. ఇంకేం జరిగాయో ఈ రోజు ఎపిసోడ్‌ చూస్తే తెలుస్తుంది. ఏమైందో ఏమో... సిరికి బిగ్‌ బాస్‌ మొదటి హెచ్చరిక జారీ చేశాడు.

‘బిగ్‌ బాస్‌’ అంటే గొడవలు కామన్‌. ఈ రోజు హమీదా, లహరి మధ్య గొడవ జరిగింది. తప్పు ఎవరిదీ అనేది ఇప్పుడే చెప్పలేం. అయితే... ‘మాట్లాడేటప్పుడు సరిగా మాట్లాడు’ అని లహరి అన్నది. అందుకు బదులుగా ‘నేను ఎలా మాట్లాడాలో నా ఇష్టం. మీరు నాకు నేర్పించాల్సిన అవసరం లేదు’ అని హమీదా చెప్పింది. తర్వాత కన్నీళ్లు పెట్టుకుంది. లహరి కోపంగా ‘నా ఇష్టం వచ్చినట్టు నేను ఆన్సర్‌ ఇస్తానంటే నేనెందుకు పడతా. నేనేమైనా వాళ్లింట్లో పని చేస్తున్నానా?’ అని విశ్వతో తన వెర్షన్‌ చెప్పుకొంది.

Brahmamudi: రాహుల్ మనిషిని పట్టుకున్న రాజ్, కావ్య.. ఇక దేత్తడి!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -905 లో....అప్పు పాప కేసు ఫైల్ చూస్తుంటే ఆఫీసర్ వస్తాడు. నీకు ఎన్నిసార్లు చెప్పాను వద్దని అయినా అలాగే చేస్తున్నావని కోప్పడతాడు. లేదు సర్ పాప చనిపోలేదు.. చనిపోయిన పాప వేరు.. ఆ పాప DNA తో మ్యాచ్ అవ్వడం లేదని రిపోర్ట్స్ చూపించగానే అవునా కేసులో ఒక కొత్త మలుపు తీసుకొని వచ్చావ్ గుడ్ కేరియాన్ అని ఆఫీసర్ అంటాడు. కాసేపటికి రేపు పాప వాళ్ళ ఫాదర్ ని స్టేషన్ కి రప్పించండి అని కానిస్టేబుల్ తో అప్పు చెప్తుంది. మరొకవైపు రాహుల్ అవార్డు ఫంక్షన్ కి రాజ్, కావ్య వెళ్తారు. అక్కడ రాహుల్ డిజైన్స్ చూసి రాజ్, కావ్య షాక్ అవుతారు.

Karthika Deepam2: జ్యోత్స్న చేసిన ఫ్రాడ్ చూసి కార్తీక్, శ్రీధర్ షాక్.. ఇంటి వారసురాలు కాదేమో!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -542 లో..... కార్తీక్, శ్రీధర్ జ్యోత్స్న రెస్టారెంట్ ఫుడ్ ట్రక్స్ బాగా పాపులర్ అయ్యాయని హ్యాపీగా ఉంటారు. ఇద్దరు బయట టీ తాగుతూ కబుర్లు చెప్పుకుంటారు. జ్యోత్స్న చాలా తప్పు డు లెక్కలు చూపించిందని శ్రీధర్ అనగానే ఎంత మొన్న కొన్న ల్యాండ్ గురించా అని  కార్తీక్ అడుగుతాడు. లేదు అది జస్ట్ శాంపిల్ మాత్రమే.... ఎంత అంటే అది చెప్తే శివన్నారాయణ గుండె పట్టుకొని పడిపోయేంత డబ్బులు ఫ్రాడ్ చేసిందని శ్రీధర్ అనగానే కార్తీక్ షాక్ అవుతాడు.