English | Telugu

నీ ఆట లేదంటూ గౌతమ్‌ని ఉతికారేసిన నాగార్జున!

బిగ్‌ బాస్‌ సీజన్‌-7 లో ఫస్ట్‌ వీక్‌ నామినేషన్‌ ఒక్కటి గుర్తుపెట్టుకొని గత పన్నెండు వారాల నుండి శివాజీని నామినేట్‌ చేసిన గౌతమ్‌ కృష్ణని నిలదీసాడు నాగార్జున. ఎందుకని ఇలా చేస్తున్నావని అడగ్గా.. శివాజీగారు ప్రశాంత్‌, యావర్‌ ఇద్దరిలో ఎవరేం తప్పు చేసినా వాళ్ళని నామినేట్‌ చేయడు. కానీ ఇంక ఎవరినైనా నామినేట్‌ చేస్తాడని గౌతమ్‌ అన్నాడు.

ప్రస్తుతం హౌస్‌లో ఇద్దరు తప్పులు చేస్తున్నారు. కానీ శివాజీ వారిని నామినేట్‌ చేయట్లేదంటావా గౌతమ్‌ అని నాగార్జున అనగా.. అలా అని కాదు సర్‌.. వారిద్దరి మీద శివాజీ గారికి గ్రాట్యిట్యూడ్‌ ఉంది. ఇంకెవరి మీదా లేదని గౌతమ్‌ అన్నాడు. సరే అది పక్కన పెట్టు. ఇప్పటివరకు హౌస్‌లో ఒక్కసారి అంటే ఒక్కసారి అయిన శోభాశెట్టి, అమర్‌ దీప్‌లని ప్రియాంక నామినేట్‌ చేసిందా అని నాగార్జున అడిగాడు. లేదని గౌతమ్‌ అనగా.. లేదన్నప్పుడు ఎందుకు ఇలా ముగ్గురు కలిసి ఆడుతున్నారని నువ్వు అడగాలి కదా అని నాగార్జున అన్నాడు. మొన్న చెప్పాను సర్‌.. అమర్‌ వల్ల నీ గేమ్‌ పోతుందని ప్రియాంకతో చెప్పాను సర్‌ అని గౌతమ్‌ అన్నాడు. నువ్వు ప్రియాంక చెప్పినట్లు విన్నావ్‌. నీ అభిప్రాయం ఏది అని అడిగేసరికి... గౌతమ్‌ తడబడ్డాడు. పన్నెండు వారాలు అయిపోయింది ఇంకా ఒకరికోసం ఒకరు ఆడటమేంటి. ఇండివిడ్యువల్‌ గేమ్‌ ఆడండి అంటూ ప్రియాంక, గౌతమ్‌ లకి నాగార్జున చెప్పాడు.

దాంతో నీకంటూ ఒక గేమ్‌ ప్లాన్‌ లేదు. నీ ఆట లేదు. నీ గేమ్‌ చూశాకా నాకు ఒకటి అయితే క్లియర్‌గా అర్థమైపోయింది.. నీకు అర్జున్‌ కంటే ప్రియాంక చెల్లే ముఖ్యం అంటూ నాగార్జున వేశాడు. దీనికి ఏదో పొగిడినట్లుగా ప్రియాంక తెగ నవ్వేసుకుంది. దీంతో తనని పైకి లేపి నాగార్జున క్లాస్‌ పీకారు. ప్రియాంక.. ఇక నుంచి ఇండివిడ్యూవల్‌ గేమ్‌ మాత్రమే నో మోర్‌ గ్రూప్‌ గేమ్‌ అని అన్నాడు.

Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.

Illu illalu pillalu : అమూల్యకి పెళ్ళిచూపులు.. కామాక్షి ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -362 లో.. పెళ్లిచూపులకి ఇంకా రావడం లేదని రామరాజు వాళ్ళు ఎదురుచూస్తుంటే వాళ్ళు రారుగా అని శ్రీవల్లి మనసులో అనుకుంటుంది. అప్పుడే అబ్బాయి వాళ్ళు పెళ్లిచూపులకు ఎంట్రీ ఇస్తారు‌. దాంతో శ్రీవల్లి షాక్ అవుతుంది. భాగ్యం, ఆనందరావు కూడా వస్తారు. వాళ్ళు ఏం జరిగిందో శ్రీవల్లికి చెప్తారు. వాళ్ళు చెప్పాల్సింది మొత్తం అబ్బాయి వాళ్ల నాన్నకి చెప్తారు కానీ అతనికి చెవులు వినిపించవు.. వాళ్ల అమ్మ కి చెప్పేలోపు అటువైపు గా ప్రేమ, ధీరజ్ వెళ్లడం చూసి మళ్ళీ చెప్పలేకపోయామని శ్రీవల్లికి భాగ్యం చెప్తుంది.