English | Telugu

సుమకి అప్పుడప్పుడు చెంప దెబ్బలు అవసరం అన్న బాలయ్య

బాలయ్య బాబు ఎక్కడుంటే అక్కడ సందడే సందడి. ఆయన ఆల్ రౌండర్..సరదాగా మాట్లాడతారు...ఫన్నీగా కౌంటర్ లు వేస్తారు. బాలయ్య అంటే వాట్ నాట్ అనిపించుకునేలా ఉంటుంది ఆయన ఆటిట్యూడ్. అలాంటి బాలయ్య యాంకర్ సుమ మీద సెటైర్లు పేల్చారు. ఆయన మాటలకు ఆమె అవాక్కయ్యింది. ‘రుద్రంగి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో బాలయ్య మైక్ తీసుకుని వేరే లెవెల్ లో మాట్లాడారు. ఆయన మైక్ తీసుకునేసరికి ఫ్యాన్స్ అంతా ‘కోకోకోలా పెప్సీ, బాలయ్య బాబు సెక్సీ’ అంటూ గట్టిగట్టిగా అరిచారు. ఆ మాటలకు ఆయన కౌంటర్ ఇచ్చారు.. తనను సెక్సీ అంటే సుమ, విమలా రామన్, మమతా మోహన్ దాస్ అందరూ జెలస్ ఫీలవుతారు అన్నారు నవ్వుతూ.

"నేను రాగానే ఈవిడ అంది నేను చెప్పకుండా చప్పట్లు కొడతారా అని.. ఈవిడకు అప్పుడప్పుడు చెంప దెబ్బలు అవసరం..కానీ ఇంకోటి జాగ్రత్తగా ఉండాలి.. చెప్పు దెబ్బలు కొడుతుంది.. పాపం ఆ రాజీవ్ కనకాల ఎలా భరిస్తున్నాడో’ అని సుమని అనేసరికి ఆమె షాకైపోయి అలానే నవ్వుతూ బాలయ్యని చూస్తుండి పోయింది. ఇంతలో జగపతి బాబు మైక్ తీసుకుని "సుమ బిజీగా ఉండడం వల్ల బాలయ్య బాబు డేట్ కూడా మార్చుకున్నారని" చెప్పడంతో "వద్దు సర్ ఇక చాలు" అంది సుమ ..దాంతో ‘సీమసింహం’ లోని ‘పోరీ హుషారుగుందిరోయ్’ అనే లైన్ పాడి అలరించారు బాలయ్య. మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్స్ కి సుమ యాంకరింగ్ పెట్టింది పేరు. ఆమెకు డేట్స్ ఖాళీగా లేకపోతే గనక ఆ ఈవెంట్ ని పోస్ట్ పోన్ కూడా చేసేస్తారు. ఇక సుమ హోస్టింగ్ అంటే చాలు అందరూ అలా చూస్తుండిపోతారు..ఒక్కోసారి ఆమె వేసే కామెంట్స్, సెటైర్స్ కూడా సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతూ ఉంటాయి. అలాంటి సుమకే చెంపదెబ్బలు అవసరం అన్న బాలయ్య కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.

Illu illalu pillalu : అమూల్యకి పెళ్ళిచూపులు.. కామాక్షి ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -362 లో.. పెళ్లిచూపులకి ఇంకా రావడం లేదని రామరాజు వాళ్ళు ఎదురుచూస్తుంటే వాళ్ళు రారుగా అని శ్రీవల్లి మనసులో అనుకుంటుంది. అప్పుడే అబ్బాయి వాళ్ళు పెళ్లిచూపులకు ఎంట్రీ ఇస్తారు‌. దాంతో శ్రీవల్లి షాక్ అవుతుంది. భాగ్యం, ఆనందరావు కూడా వస్తారు. వాళ్ళు ఏం జరిగిందో శ్రీవల్లికి చెప్తారు. వాళ్ళు చెప్పాల్సింది మొత్తం అబ్బాయి వాళ్ల నాన్నకి చెప్తారు కానీ అతనికి చెవులు వినిపించవు.. వాళ్ల అమ్మ కి చెప్పేలోపు అటువైపు గా ప్రేమ, ధీరజ్ వెళ్లడం చూసి మళ్ళీ చెప్పలేకపోయామని శ్రీవల్లికి భాగ్యం చెప్తుంది.