English | Telugu

'అన్‏స్టాపబుల్'లో ఎన్టీఆర్ వెన్నుపోటు ఘటనపై స్పందించిన బాలయ్య!

'అన్‏స్టాపబుల్ విత్ ఎన్బీకే' షోతో ఓటీటీ వేదిక ఆహాలో నటసింహం నందమూరి బాలకృష్ణ చేస్తున్న సందడి అంతాఇంతా కాదు. బాలయ్య ఎనర్జీకి, టైమింగ్ కి ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. ఇప్పటికే మోహన్ బాబు, నాని, బ్రహ్మానందం, అనిల్ రావిపూడి లతో కలిసి అన్‏స్టాపబుల్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చిన బాలయ్య.. త్వరలో అఖండ మూవీ టీమ్ తో కలిసి అలరించడానికి సిద్ధమయ్యాడు. తాజాగా విడుదలైన ఈ ఎపిసోడ్ ప్రోమోకి సూపర్ రెస్పాన్స్ వస్తోంది. ఈ ప్రోమో ప్రస్తుతం యూట్యూబ్ లో ట్రెండింగ్ లో ఉంది.

'అన్‏స్టాపబుల్' షో 4 వ ఎపిసోడ్ ప్రోమోని తాజాగా ఆహా విడుదల చేసింది. ఈ బాలయ్య హీరోగా నటించిన అఖండ మూవీ టీమ్ పాల్గొనడం విశేషం. హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్, డైరెక్టర్ బోయపాటి శ్రీను, మ్యూజిక్ డైరెక్టర్ తమన్, యాక్టర్ శ్రీకాంత్ పాల్గొన్నారు. ఈ నలుగురితో కలిసి బాలయ్య ఫుల్ అల్లరి చేసారని ప్రోమో చూస్తేనే అర్థమవుతోంది. 'నేను విలన్ గా యాక్ట్ చేయడానికి రెడీగా ఉన్నాను.. కానీ హీరో కూడా నేనే' అంటూ తనదైన టైమింగ్ తో నవ్వించారు బాలయ్య. 'మాలిని స్టూడియో అని' అంటూ బోయపాటి ఏదో చెప్పబోతుండగా 'మాలిని ఎవరు?.. మీ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఆ?..' అంటూ బాలయ్య సెటైర్ వేశారు. జై బాలయ్య సాంగ్ కి ప్రగ్యాతో కలిసి చిందేసిన బాలయ్య.. 'పాట నీదైనా పాప నాది' అంటూ ప్రగ్యాని ఉద్దేశించి తమన్ తో అన్నాడు.

Also Read: 'అఖండ' మూవీ రివ్యూ

ఇక ఈ ఎపిసోడ్ లో రాజకీయ పరమైన విమర్శలపై కూడా బాలయ్య స్పందించాడని ప్రోమో చూస్తే తెలుస్తుంది. స్వర్గీయ ఎన్టీఆర్ కి వెన్నుపోటు పొడిచి ఆయన స్థాపించిన తెలుగుదేశం పార్టీకి లాక్కున్నారని ప్రత్యర్థులు ప్రస్తుత టీడీపీ నాయకత్వంపై విమర్శలు చేస్తుంటారు. దీనిపై స్పందించిన బాలయ్య ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. "వెన్నుపోటు పొడిచారు అనేది తప్పుడు ప్రచారం. చెప్తుంటే కన్నీళ్లు వస్తాయి. ఎందుకంటే నేను ఆయన కొడుకుల్లో ఒకడిని. ఫ్యాన్స్ లో ఒకడిని" అని బాలయ్య ఎమోషనల్ అయ్యారు. ఫుల్ ఎపిసోడ్ వస్తే ఈ అంశంపై బాలయ్య ఇంకా ఏం మాట్లాడారో తెలుస్తుంది.

Karthika Deepam2 : దీప అమ్మానాన్నలు గొప్పొళ్ళు.. నోరు జారిన జ్యోత్స్న!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -537లో.. శివన్నారాయణ ఇంటికి శ్రీధర్ వస్తాడు. పారిజాతం కాఫీ తీసుకొని వస్తుంది. తనని చూసి మీరేంటి అత్తయ్య కాఫీ తీసుకొని వచ్చారని శ్రీధర్ అడుగుతాడు. ఈ ఒక్క రోజు దీప డ్యూటీ తనకి వచ్చిందని కార్తీక్ అంటాడు. అది తర్వాత గానీ ముందు ప్రెజెంటేషన్ ఇవ్వమని శివన్నారాయణ అనగానే శ్రీధర్, కాశీకీ ఫోన్, లాప్ టాప్ తీసుకొని రమ్మని చెప్తాడు. కాశీ వచ్చి సర్ అని శ్రీధర్ ని పిలుస్తుంటే.. ఏంటి వాడిని నీ చుట్టూ తిప్పుకుంటున్నావని పారిజాతం అంటుంది.

Illu illalu pillalu : పార్క్ కి రమ్మని అమూల్యకి లెటర్ రాసిన విశ్వ.. అందరూ చూసేసారుగా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -338 లో. అమూల్యని ఎలాగైనా ఒప్పించి పెళ్లి చేసుకోవాలని విశ్వ అనుకుంటాడు. అమూల్యని పిలుస్తాడు. తనకి విశ్వ ఏం చెప్తున్నాడో ఏం అర్థం కాదు.. దాంతో విశ్వ ఒక పేపర్ పై ఈ రోజు సాయంత్రం పార్క్ లో కలుద్దామని రాసి అమూల్యకి విసిరేస్తాడు. అది అమూల్య చూసి ఒకే అంటుంది. ఆ పేపర్ ని పక్కన విసిరేస్తుంది. అది చందు చూసి చుట్టూ పక్కన ఎవరు ఉన్నారని చూడగా.. బట్టలు ఆరెస్తూ శ్రీవల్లి కనిపిస్తుంది. శ్రీవల్లి రాసిందనుకొని తన వైపుకి మళ్ళీ విసురుతాడు.

Podharillu:పొదరిల్లు సీరియల్ లో సూపర్ ట్విస్ట్.. మహాలక్ష్మికి పెళ్ళి ఫిక్స్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -02 లో.....మహాలక్ష్మి ప్రాజెక్ట్ డిజైన్ రెడీ చేసి హాల్లోకి వస్తుంది. వాళ్ళ నాన్న ప్రతాప్ ఇంకా అన్నయ్య మహాలక్ష్మికి డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేస్తారు. ఒకసారి చూడు మహా అని వాళ్ళ అన్నయ్య అంటాడు. నాకేం ఇప్పుడు పెళ్లి వద్దు అవసరం అయితే వదిన నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకోండి అని మహా అంటుంది. ఇప్పుడు డిజైన్స్ చూపించడానికి వెళ్తున్నానని తెలిస్తే డాడీ వద్దని అంటాడనుకొని డాడీ కాలేజీలో సర్టిఫికెట్ ఉన్నాయి తెచ్చుకుంటానని చెప్తుంది.