English | Telugu

యాంకర్ రష్మీ ఎమోషనల్ పోస్ట్...జీవితాంతం నిన్ను మిస్ అవుతూనే ఉంటా


బుల్లితెర మీద రష్మీ గౌతమ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఐతే ఆమెకు శునకాలంటే పిచ్చి ప్రేమ. ఏ మూగజీవానికి హాని జరిగినా ఊరుకోదు. అలాంటి రష్మీ దగ్గర ఒకప్పుడు చుట్కి అనే పెట్ డాగ్ ఉండేది. దాంతో చేసిన అల్లరి మొత్తాన్ని కూడా రష్మీ ఇన్స్టాగ్రామ్ పేజీలో షేర్ చేసేది. ఐతే అది కొంతకాలం క్రితం చనిపోయింది. ఇక రష్మీ తన పెట్ డాగ్ అస్థికలను గోదావరి నదిలో కలిపేసింది. ఆ వీడియోని అలాగే తన చుట్కితో గడిపిన క్షణాల వీడియోస్ ని కూడా పోస్ట్ చేసింది. "ఒక జీవిత కాలం పాటు నీ ప్రేమను నేను మిస్ అవుతూనే ఉంటాను. పునర్జన్మ అనేది ఉంటే గనక ఎలాంటి బాధా లేకుండా పుట్టాలని కోరుకుంటున్నాను.

నీ విషయంలో కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చినందుకు నన్ను క్షమించు..ఇక ప్రశాంతంగా మరో లోకానికి వేళ్ళు..చుట్కి గౌతమ్" అంటూ ఒక హార్ట్ టచింగ్ ఎమోషనల్ పోస్ట్ పెట్టింది రష్మీ. ఇక నెటిజన్స్ ఐతే "ఇలాంటి మనిషిని నా జీవితంలో చూడలేదు..ఓం శాంతి చుట్కి బేటా. జంతువుల మీద మీరు చూపించే ప్రేమ గొప్పది" అంటూ మెసేజెస్ ఇస్తున్నారు. ఇక రష్మీ ఈటీవీ షోస్ తో బాగా పాపులర్ అయ్యింది. ఇక బుల్లితెర మీద హిట్ పెయిర్ గా నిలిచింది. ఈ జంట పెర్ఫార్మెన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఐతే వీళ్ళు పెళ్లి చేసుకుంటారని ప్రచారం జరిగింది కానీ తర్వాతి కాలంలో వీళ్ళు విడిపోయారు.. ఐతే వీళ్ళు మళ్ళీ కలవాలని ఆడియన్స్ కూడా కోరుకుంటున్నారు.

Jayam serial : బాక్సింగ్ పోటీలో మిస్సెస్ గంగ రుద్ర ప్రతాప్.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -160 లో..... గంగని ఎలాగైనా అకాడమీ సెలక్షన్ కి వెళ్లకుండా ఆపాలని ఇషిక, వీరు ట్రై చేస్తారు కానీ గంగ, రుద్ర ఇద్దరు కలిసి ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసి అకాడమీకి వెళ్తారు. రుద్ర అకాడమీ బయటే ఉంటాడు. నాకు సంబంధించిన కేసు ఇంకా పెండింగ్ లో ఉంది అలా ఉండగా.. నేను లోపలకు రాకూడదని రుద్ర బయటే ఉండి గంగకి అంతా వివరిస్తాడు. నేను నీ పేరు మైక్ లో రావడం వినాలని రుద్ర అంటాడు. గంగ లోపలకు వెళ్తుంది. అక్కడ పారు ఇంకా తన ఫ్రెండ్స్ కలిసి గంగని చులకనగా మాట్లాడుతారు.

Brahmamudi : రుద్రాణిని రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన కనకం!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -922 లో.. ఒకతను వచ్చి రుద్రాణికి మళ్ళీ పసరు మందు ఇస్తాడు. ఆ పసరు మందు పని చేస్తుందా లేదా అని రుద్రాణి అతన్ని అడుగుతుంది. పని చేస్తుందని అతను చెప్తాడు. దాంతో రుద్రాణి పసరు మందు తీసుకొని లోపలికి వెళ్తుంటే అప్పుడే కనకం ఎదురుపడుతుంది. కనకాన్ని చూసి రుద్రాణి టెన్షన్ పడుతుంది. చేతిలో అదేంటీ అని కనకం అనగానే ఇదా.... నాకే పసరు మందు అజీర్తికి వాడమని చెప్పారని చెప్పి రుద్రాణి వెళ్ళిపోతుంది. అలా అయితే ఇంత రాత్రివేళ తీసుకొని వెళ్తుంది ఏంటని కనకంకి డౌట్ వస్తుంది.