English | Telugu

కావ్యశ్రీ దగ్గరికి నిఖిల్.. హైప్ ఎక్కిస్తున్న ప్రోమో!

బిగ్ బాస్ సీజన్‌-8 విజేతగా నిలిచిన నిఖిల్ గురించి అందరికి తెలిసిందే. అతని మాజీ ప్రేయసి కావ్యశ్రీతో బ్రేకప్ అయ్యింది. నిఖిల్ కావ్యలు కలవాలని, వాళ్లిద్దరి మధ్య ఉన్న గ్యాప్‌ని చెరిపేసుకుని కావ్య నిఖిల్‌ గా ఉండాలని చాలామంది సీరియల్ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. బిగ్ బాస్ తరువాత ఏం ప్రాజెక్ట్ చేస్తారని అందరిలోనూ ఆసక్తి ఉండేది. అయితే నిఖిల్ రీ ఎంట్రీ మాత్రం మామూలుగా లేదు.

కావ్య శ్రీ హీరోయిన్‌గా నటిస్తున్న ‘చిన్ని’ సీరియల్‌ ఆసక్తికరంగా సాగుతుంది. జైలులో ఖైదీగా ఉన్న కావేరి (కావ్య) చనిపోయిందని అంతా అనుకుంటారు. కానీ ఆమె ఉషగా తిరిగి రావడంతో ఆ సీరియల్‌కి మంచి హైప్ వచ్చింది. అయితే ఇప్పుడు అదే సీరియల్‌లోకి నిఖిల్ ఎంట్రీ ఇచ్చాడు. ఇక ‘గేమ్ స్టార్ట్ నౌ’ అంటూ కావ్యతో చేతులు కలిపాడు నిఖిల్. 50 సెకన్ల నిడివితో ఉన్న ఈ ప్రోమో అయితే అదిరిపోయింది. ఇక ప్రోమోకి నిఖిల్, కావ్య ఫ్యాన్స్ తెగ కామెంట్లు చేస్తున్నారు. ఇదేం ట్విస్ట్‌రా బాబూ.. ఇన్నాళ్లూ మీరిద్దరూ కలవాలని కోరుకున్నాం.. కానీ ఇద్దరూ కలిసి పెద్ద ట్విస్టే ఇచ్చారంటూ అటు నిఖిల్ ఫ్యాన్స్, ఇటు కావ్య ఫ్యాన్స్ తెగ సంబరపడుతున్నారు‌.

తాజా ప్రోమోలో జస్ట్ అతను జీపుపై రావడం.. బాస్కెట్ బాల్ కోర్టులో ఉన్న కావ్యని కలిసి.. ఆమెకి బాల్ ఇచ్చి ఆమెతో చేతులు కలపడం చూపించారు. ఇద్దరూ చేతులు కలిపినప్పుడు ‘గేమ్ స్టార్ట్ నౌ’ అని టైటిల్ వేశారు. దీన్ని బట్టి చూస్తే.. ఇద్దరి మధ్య రియల్ లైఫ్‌లో ఎలాంటి వైరం ఉందో పక్కన పెడితే.. ‘చిన్ని’ సీరియల్‌లో మాత్రం టఫ్ వార్ ఉండబోతుందని తేలిపోయింది. ఆ ప్రోమోని బట్టి చూస్తే.. నిఖిల్ పోలీస్ ఆఫీస్ అయ్యే అవకాశం నూటికి నూరు శాతం కనిపిస్తుంది. క్షుణ్ణంగా చూస్తే.. నిఖిల్ పక్కన జబర్దస్త్ పవిత్ర వైట్ అండ్ బ్లూ డ్రెస్‌లో అతనికి అసిస్టెంట్‌గా కనిపిస్తుంది. ప్రస్తుతం ఈ ప్రోమో ట్రెండింగ్ లో ఉంది.

Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.

Illu illalu pillalu : అమూల్యకి పెళ్ళిచూపులు.. కామాక్షి ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -362 లో.. పెళ్లిచూపులకి ఇంకా రావడం లేదని రామరాజు వాళ్ళు ఎదురుచూస్తుంటే వాళ్ళు రారుగా అని శ్రీవల్లి మనసులో అనుకుంటుంది. అప్పుడే అబ్బాయి వాళ్ళు పెళ్లిచూపులకు ఎంట్రీ ఇస్తారు‌. దాంతో శ్రీవల్లి షాక్ అవుతుంది. భాగ్యం, ఆనందరావు కూడా వస్తారు. వాళ్ళు ఏం జరిగిందో శ్రీవల్లికి చెప్తారు. వాళ్ళు చెప్పాల్సింది మొత్తం అబ్బాయి వాళ్ల నాన్నకి చెప్తారు కానీ అతనికి చెవులు వినిపించవు.. వాళ్ల అమ్మ కి చెప్పేలోపు అటువైపు గా ప్రేమ, ధీరజ్ వెళ్లడం చూసి మళ్ళీ చెప్పలేకపోయామని శ్రీవల్లికి భాగ్యం చెప్తుంది.