English | Telugu

ఎయిర్‌లైన్స్‌కు వార్నింగ్ ఇచ్చిన ఫైర్ బ్రాండ్ అనసూయ!

అనసూయ బుల్లితెర ఫైర్ బ్రాండ్ గా పేరు తెచ్చుకుంది. ఏ విషయం మీదైనా కుండ బద్దలు కొట్టినట్టు సోషల్ మీడియా వేదికగా చెప్పాలనుకున్నది చెప్పేస్తుంది. బెంగళూరు నుంచి హైదరాబాద్ కి అనసూయ ఫామిలీ బయల్దేరింది.ఐతే వీళ్ళు ప్రయాణించాల్సిన ఎయిర్ లైన్స్ సంస్థ వాళ్ళు ఫ్లైట్ రన్ వే మీద నుంచి బయలు దేరేందుకు సిద్ధంగా ఉందని ఫైనల్ కాల్ అనౌన్స్ చేశారు.

ఎయిర్ పోర్ట్ కి వెళ్ళాక మాస్క్ లు లేవని లోపలి పంపించలేదు. మళ్ళీ తర్వాత వాళ్ళే అవసరం లేదు అన్నారు. ఇక ఆఖరి నిమిషంలో ఫామిలీ మొత్తాన్ని ఈ ఎయిర్ లైన్ సిబ్బంది వాళ్ళు పరిగెత్తించారు. ‘అలయన్స్ ఎయిర్ 9I 517 ప్లైట్ ప్రొటో‌కాల్‌ వలన చాలా ఇబ్బందులు పడ్డాం. అసలు ఈ ఎయిర్ లైన్ సిబ్బందికి ఎందుకు ఇంత క‌న్‌ఫ్యూజ‌న్. పోనీ విమానం ఎక్కాక సీట్లు కూడా ఎక్కడెక్కడో ఇచ్చారు. వరుసగా సీట్లు బుక్ చేసుకున్నప్పుడు వేరు వేరుగా ఎలా కూర్చోబెడతారని అనసూయ అడిగితే సిబ్బంది ఎలాంటి సమాధానం చెప్పలేదట.

ఇక ఆ పరిగెత్తిన హడావిడిలో , ఆ కంగారులో నా షర్ట్ సీటుకు తగిలి చిరిగిపోయింది. పాసెంజర్స్ కి చెప్పే ముందు మీరు వాళ్ళతో ఎలా వ్యవహరించాలో తెలుసుకోండి’ అంటూ అనసూయ ఫైర్ అయ్యింది. విమాన సిబ్బంది కారణంగా అనసూయ ఎదుర్కొన్న ఇబ్బందులను ట్వీట్ రూపంలో సోషల్ మీడియాలో చెప్పింది. ప్యాసింజర్స్‌తో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని గట్టిగానే వార్నింగ్ ఇచ్చింది.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.