English | Telugu

మా నాన్నకు ఆ పిచ్చి.. దాని వ‌ల్లే ఆస్తులు పోగొట్టుకున్నాం!

ఒక‌వైపు బుల్లితెరపై యాంకర్‌గా రాణిస్తోన్న అనసూయ.. మరోపక్క వెండితెరపై నటిగా తన సత్తా చాటుతోంది. సోషల్ మీడియాలో ఈ ముద్దుగుమ్మకు ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తనపై జరిగే ట్రోలింగ్‌కు ఘాటుగా కౌంటర్లు ఇస్తుంటుంది అనసూయ. తాజాగా ఈ బ్యూటీ ఓ ఇంటర్వ్యూలో పాల్గొని పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది. అనసూయ తన వ్యక్తిగత జీవితం గురించి గతంలో చాలా సార్లు చెప్పింది. అమ్మానాన్న, చెల్లెళ్లు, భర్త గురించి ఎన్నో విషయాలు చెప్పుకొచ్చింది.

అయితే లేటెస్ట్‌గా కొన్ని కొత్త విష‌యంలు పంచుకుంది అనసూయ. తన చిన్నతనంలో చాలా కష్టాలు పడ్డానని చెబుతోంది. అద్దె ఇంట్లో ఉండేవాళ్లమని.. డబ్బులు సరిపోక బస్టాప్ వరకు నడుచుకుంటూ వెళ్లేదాన్ని అని వివరించిన అనసూయ.. తన తండ్రి గురించి చెబుతూ తమను ఎలా పెంచారో చెప్పుకొచ్చింది. స్వతంత్రంగా, ధైర్యంగా ఉండాలని చెప్పేవారని.. ఆటోవాళ్లతో ఎలా మాట్లాడతామో, ఎలా హ్యాండిల్ చేస్తామోనని దూరం నుండి చూసేవారని ఆ మధ్య అనసూయ తెలిపింది.

తాజాగా తన తండ్రి గురించి మరికొన్ని విషయాలు చెప్పుకొచ్చింది. చిన్నప్పుడు చాలా రిచ్ గానే పెరిగామని.. ఈ విషయం ఇప్పటివరకు ఎక్కడా చెప్పలేదని తెలిపింది. తమ దగ్గర చాలా గుర్రాలు ఉండేవని.. తన తండ్రికి హార్స్ రేసింగ్, గ్యాంబ్లింగ్ అంటే పిచ్చి అని.. అలా ఆస్తులన్నీ పోగొట్టుకున్నామని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం అనసూయ చేతిలో నాలుగైదు సినిమాలు ఉన్నాయి. తెలుగులోనే కాకుండా తమిళ, మలయాళ భాషల సినిమాల్లో నటిస్తోంది!

Jayam serial : బాక్సింగ్ పోటీలో మిస్సెస్ గంగ రుద్ర ప్రతాప్.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -160 లో..... గంగని ఎలాగైనా అకాడమీ సెలక్షన్ కి వెళ్లకుండా ఆపాలని ఇషిక, వీరు ట్రై చేస్తారు కానీ గంగ, రుద్ర ఇద్దరు కలిసి ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసి అకాడమీకి వెళ్తారు. రుద్ర అకాడమీ బయటే ఉంటాడు. నాకు సంబంధించిన కేసు ఇంకా పెండింగ్ లో ఉంది అలా ఉండగా.. నేను లోపలకు రాకూడదని రుద్ర బయటే ఉండి గంగకి అంతా వివరిస్తాడు. నేను నీ పేరు మైక్ లో రావడం వినాలని రుద్ర అంటాడు. గంగ లోపలకు వెళ్తుంది. అక్కడ పారు ఇంకా తన ఫ్రెండ్స్ కలిసి గంగని చులకనగా మాట్లాడుతారు.

Brahmamudi : రుద్రాణిని రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన కనకం!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -922 లో.. ఒకతను వచ్చి రుద్రాణికి మళ్ళీ పసరు మందు ఇస్తాడు. ఆ పసరు మందు పని చేస్తుందా లేదా అని రుద్రాణి అతన్ని అడుగుతుంది. పని చేస్తుందని అతను చెప్తాడు. దాంతో రుద్రాణి పసరు మందు తీసుకొని లోపలికి వెళ్తుంటే అప్పుడే కనకం ఎదురుపడుతుంది. కనకాన్ని చూసి రుద్రాణి టెన్షన్ పడుతుంది. చేతిలో అదేంటీ అని కనకం అనగానే ఇదా.... నాకే పసరు మందు అజీర్తికి వాడమని చెప్పారని చెప్పి రుద్రాణి వెళ్ళిపోతుంది. అలా అయితే ఇంత రాత్రివేళ తీసుకొని వెళ్తుంది ఏంటని కనకంకి డౌట్ వస్తుంది.