English | Telugu

కొట్టడానికి వస్తున్నావ్ అనుకున్నా అన్నా..మంచు మనోజ్ తో ఆది సెటైర్

ఉగాది పర్వదినం త్వరలో రాబోతోంది. దాంతో ఇక బుల్లితెర మీద షోస్ హడావిడి మొదలయ్యింది. "అనగనగా ఈ ఉగాదికి" పేరుతో ఒక షో ప్రసారం కాబోతోంది. ఆ ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. ఈ ఎపిసోడ్ కి హోస్ట్స్ గా రష్మీ, నందు చేశారు. ఐతే గెస్టులుగా నితిన్, మంచు మనోజ్, ప్రదీప్ మాచిరాజు, బెల్లంకొండ శ్రీనివాస్, నారా రోహిత్ వచ్చారు. ఇక ఆది ఐతే నితిన్ ని చూసి లేచి డైలాగ్ చెప్పేసాడు. "నితిన్ అన్నా నేను మీకు పెద్ద ఫ్యాన్ ని...నేను ఇంటర్ లో ఉన్నప్పుడు మీ జయం మూవీని చూసాను" అని చెప్పాడు. ఇక నితిన్ ఐతే ఆదికి కౌంటర్ ఇచ్చాడు. "ఆ మూవీ చేసేటప్పుడు నేను కూడా ఇంటర్ చదువుతున్నా" అన్నాడు. తర్వాత ఈ షోకి బలగం మూవీలో లీడ్ రోల్ చేసిన మురళీధర్ గౌడ్ వచ్చి ఆది పక్కన కూర్చుకున్నారు.

ఇంతలో స్టేజి మీదకు వచ్చిన మంచు మనోజ్ స్పీడ్ గా ఆది ఉన్న వైపుకు వెళ్ళాడు. మంచు మనోజ్ నడిచి వస్తున్న ఫోర్స్ చూసి ఒక్కసారిగా షాక్ అయ్యాడు. ఏదో కొట్టేయడానికి వస్తున్నాడేమో అని భయపడిపోయాడు. దాంతో మనోజ్ ని చూసేసరికిఆ దాటున లేచి నిలబడ్డాడు అలాగే పక్కనే ఉన్న మురళీధర్ గౌడ్ దగ్గరకు వెళ్లి ఆయనకు షేక్ హ్యాండ్ ఇచ్చాడు. ఆ తర్వాత ఆది లేచి "నేనేమన్నా అన్నానేమో కొట్టడానికి వచ్చారేమో" అనుకున్నా అంటూ చెప్పేసరికి నారా రోహిత్, మంచు మనోజ్, నందు అందరూ గట్టిగా నవ్వేశారు. ఏదేమైనా మంచు మనోజ్ ఆటిట్యూడ్ మాత్రం ఆదిని బాగా బయపెట్టేసింది. ఫైనల్ లో "సరైన రోజు రిలీజ్ అవుతోంది...దుమ్ము దులిపేద్దాం మచ్చా" అంటూ మనోజ్ భారీ డైలాగ్ చెప్పాడు. ఈ ఎపిసోడ్ ఉగాది రోజు ఉదయం 10 గంటలకు ప్రసారం కాబోతోంది.

Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.

Illu illalu pillalu : అమూల్యకి పెళ్ళిచూపులు.. కామాక్షి ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -362 లో.. పెళ్లిచూపులకి ఇంకా రావడం లేదని రామరాజు వాళ్ళు ఎదురుచూస్తుంటే వాళ్ళు రారుగా అని శ్రీవల్లి మనసులో అనుకుంటుంది. అప్పుడే అబ్బాయి వాళ్ళు పెళ్లిచూపులకు ఎంట్రీ ఇస్తారు‌. దాంతో శ్రీవల్లి షాక్ అవుతుంది. భాగ్యం, ఆనందరావు కూడా వస్తారు. వాళ్ళు ఏం జరిగిందో శ్రీవల్లికి చెప్తారు. వాళ్ళు చెప్పాల్సింది మొత్తం అబ్బాయి వాళ్ల నాన్నకి చెప్తారు కానీ అతనికి చెవులు వినిపించవు.. వాళ్ల అమ్మ కి చెప్పేలోపు అటువైపు గా ప్రేమ, ధీరజ్ వెళ్లడం చూసి మళ్ళీ చెప్పలేకపోయామని శ్రీవల్లికి భాగ్యం చెప్తుంది.