English | Telugu

ఫాథర్ సెంటిమెంట్ తో కన్నీళ్లు..సుమంత్ ని దత్తత తీసుకున్న అక్కినేని నాగేశ్వరరావు

శ్రీదేవి డ్రామా కంపెనీ నెక్స్ట్ వీక్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఈ షోకి అనగనగ మూవీ టీమ్ నుంచి హీరో సుమంత్ వచ్చారు. అలాగే ఈ తరం నటుడు ప్రసాద్ బెహరా కూడా వచ్చాడు. ఈ ఎపిసోడ్ ఎండింగ్ లో కొన్ని స్వీట్ మెమోరీస్ పేరుతో వాళ్ళ జ్ఞాపకాలను గుర్తు చేసింది రష్మీ. ప్రసాద్ బెహరా కోసం ఒక ప్లాన్ చేసి వాళ్ళ నాన్న ఫోటోని చూపించింది. ఆ ఫోటోని చూసేసరికి ప్రసాద్ కన్నీటిపర్యంతమయ్యాడు. "మీ నాన్నా ఇప్పుడు మీ ముందుకు వస్తే ఎం చెప్పాలనుకుంటున్నారు" అని అడిగింది. "ఉండిపొమ్మని అడుగుతానండి...ప్రతీ అప్లికేషన్ ముందు నాన్న పేరు లేట్ అని రాసేటప్పుడు మా నాన్న ఉంటె బాగుండు అనిపించేది." అని చెప్పేసరికి సుమంత్ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. తర్వాత భావన వాళ్ళ నాన్న గురించి చెప్పుకొచ్చింది. "ఊహ తెలిసాక నాన్నతో కలిసి అన్ని షేర్ చేసుకుందాం, మాట్లాడదాం అనుకునేసరికి నాన్న లేరు" అంటూ వాళ్ళ నాన్న ఫోటో చూపించింది కన్నీళ్లు పెట్టుకుంటూ. తర్వాత సుమంత్ కూడా తన తండ్రి విషయం చెప్పుకొచ్చాడు.

నిజానికి నాకు ఇద్దరు తండ్రులు ఉన్నారని నేను నమ్ముతాను. నన్ను కన్నతండ్రి సురేంద్ర అలాగే అక్కినేని నాగేశ్వరరావు గారు నన్ను దత్తత తీసుకున్నారు. ప్రాక్టికల్ గా నాగేశ్వరరావు గారే నా తండ్రి" అంటూ చెప్పాడు. ఇక ఫైనల్ గా సుమంత్ టాలీవుడ్ లోకి అడుగుపెట్టి 25 ఏళ్ళు ఐన సందర్భంగా ఆయనకు అందరూ కలిసి చిరు సత్కారం చేశారు. ఇక ఫైనల్ గా తండేల్ సీన్ ని రిక్రియేట్ చేశారు ఇమ్ము - వర్ష. ఐతే రష్మీ "వర్షా ఇమ్ముతో ఆల్మోస్ట్ ఇది చివరి పెర్ఫార్మెన్స్ అనుకోవచ్చా" అని అడిగింది. దాంతో వర్ష ఏడుస్తూ "ఇమ్ము ఇక్కడ ఎంతమంది ఉన్నా నువ్వు లేకపోతే బాగోదు" అని చెప్పింది. ఇక ఇమ్ము ఐతే తలదించుకునే ఉన్నాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.

Karthika Deepam2 : దాస్ ని నిజం చెప్పకుండా ఆపిన కార్తీక్.. దీప ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(karthika Deepam2).ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -566 లో.. జ్యోత్స్న గురించి శివన్నారాయణకి దాస్ నిజం చెప్పాలని అనుకుంటాడు. జ్యోత్స్న, పారిజాతం టెన్షన్ పడుతారు. దాస్ ని జ్యోత్స్న  కొట్టిన విషయం చెప్తాడు కావచ్చని దశరథ్ అనుకుంటాడు. జ్యోత్స్న గురించి ఇప్పుడే నిజం తెలియొద్దని దాస్ ని ఆపాలని కార్తీక్ ట్రై చేస్తాడు.. దాస్ నిజం చెప్పబోతుంటే ఒకవైపు దశరథ్.. ఒకవైపు కార్తీక్.. ఒకేసారి దాస్ ని ఆగమంటారు. దాస్ ఏదో ..చెప్పడానికి ఇబ్బంది పడుతున్నావ్ పక్కకిరా.. నాతో చెప్పమని దశరథ్ అంటాడు.