English | Telugu

ఫాథర్ సెంటిమెంట్ తో కన్నీళ్లు..సుమంత్ ని దత్తత తీసుకున్న అక్కినేని నాగేశ్వరరావు

శ్రీదేవి డ్రామా కంపెనీ నెక్స్ట్ వీక్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఈ షోకి అనగనగ మూవీ టీమ్ నుంచి హీరో సుమంత్ వచ్చారు. అలాగే ఈ తరం నటుడు ప్రసాద్ బెహరా కూడా వచ్చాడు. ఈ ఎపిసోడ్ ఎండింగ్ లో కొన్ని స్వీట్ మెమోరీస్ పేరుతో వాళ్ళ జ్ఞాపకాలను గుర్తు చేసింది రష్మీ. ప్రసాద్ బెహరా కోసం ఒక ప్లాన్ చేసి వాళ్ళ నాన్న ఫోటోని చూపించింది. ఆ ఫోటోని చూసేసరికి ప్రసాద్ కన్నీటిపర్యంతమయ్యాడు. "మీ నాన్నా ఇప్పుడు మీ ముందుకు వస్తే ఎం చెప్పాలనుకుంటున్నారు" అని అడిగింది. "ఉండిపొమ్మని అడుగుతానండి...ప్రతీ అప్లికేషన్ ముందు నాన్న పేరు లేట్ అని రాసేటప్పుడు మా నాన్న ఉంటె బాగుండు అనిపించేది." అని చెప్పేసరికి సుమంత్ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. తర్వాత భావన వాళ్ళ నాన్న గురించి చెప్పుకొచ్చింది. "ఊహ తెలిసాక నాన్నతో కలిసి అన్ని షేర్ చేసుకుందాం, మాట్లాడదాం అనుకునేసరికి నాన్న లేరు" అంటూ వాళ్ళ నాన్న ఫోటో చూపించింది కన్నీళ్లు పెట్టుకుంటూ. తర్వాత సుమంత్ కూడా తన తండ్రి విషయం చెప్పుకొచ్చాడు.

నిజానికి నాకు ఇద్దరు తండ్రులు ఉన్నారని నేను నమ్ముతాను. నన్ను కన్నతండ్రి సురేంద్ర అలాగే అక్కినేని నాగేశ్వరరావు గారు నన్ను దత్తత తీసుకున్నారు. ప్రాక్టికల్ గా నాగేశ్వరరావు గారే నా తండ్రి" అంటూ చెప్పాడు. ఇక ఫైనల్ గా సుమంత్ టాలీవుడ్ లోకి అడుగుపెట్టి 25 ఏళ్ళు ఐన సందర్భంగా ఆయనకు అందరూ కలిసి చిరు సత్కారం చేశారు. ఇక ఫైనల్ గా తండేల్ సీన్ ని రిక్రియేట్ చేశారు ఇమ్ము - వర్ష. ఐతే రష్మీ "వర్షా ఇమ్ముతో ఆల్మోస్ట్ ఇది చివరి పెర్ఫార్మెన్స్ అనుకోవచ్చా" అని అడిగింది. దాంతో వర్ష ఏడుస్తూ "ఇమ్ము ఇక్కడ ఎంతమంది ఉన్నా నువ్వు లేకపోతే బాగోదు" అని చెప్పింది. ఇక ఇమ్ము ఐతే తలదించుకునే ఉన్నాడు.

Jayam serial : బాక్సింగ్ పోటీలో మిస్సెస్ గంగ రుద్ర ప్రతాప్.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -160 లో..... గంగని ఎలాగైనా అకాడమీ సెలక్షన్ కి వెళ్లకుండా ఆపాలని ఇషిక, వీరు ట్రై చేస్తారు కానీ గంగ, రుద్ర ఇద్దరు కలిసి ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసి అకాడమీకి వెళ్తారు. రుద్ర అకాడమీ బయటే ఉంటాడు. నాకు సంబంధించిన కేసు ఇంకా పెండింగ్ లో ఉంది అలా ఉండగా.. నేను లోపలకు రాకూడదని రుద్ర బయటే ఉండి గంగకి అంతా వివరిస్తాడు. నేను నీ పేరు మైక్ లో రావడం వినాలని రుద్ర అంటాడు. గంగ లోపలకు వెళ్తుంది. అక్కడ పారు ఇంకా తన ఫ్రెండ్స్ కలిసి గంగని చులకనగా మాట్లాడుతారు.

Brahmamudi : రుద్రాణిని రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన కనకం!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -922 లో.. ఒకతను వచ్చి రుద్రాణికి మళ్ళీ పసరు మందు ఇస్తాడు. ఆ పసరు మందు పని చేస్తుందా లేదా అని రుద్రాణి అతన్ని అడుగుతుంది. పని చేస్తుందని అతను చెప్తాడు. దాంతో రుద్రాణి పసరు మందు తీసుకొని లోపలికి వెళ్తుంటే అప్పుడే కనకం ఎదురుపడుతుంది. కనకాన్ని చూసి రుద్రాణి టెన్షన్ పడుతుంది. చేతిలో అదేంటీ అని కనకం అనగానే ఇదా.... నాకే పసరు మందు అజీర్తికి వాడమని చెప్పారని చెప్పి రుద్రాణి వెళ్ళిపోతుంది. అలా అయితే ఇంత రాత్రివేళ తీసుకొని వెళ్తుంది ఏంటని కనకంకి డౌట్ వస్తుంది.