Read more!

English | Telugu

పండు నీ డాన్స్ చూస్తే బన్నీ గారు కొరియోగ్రాఫర్ గా తీసుకుంటారన్న జడ్జెస్

ఢీ ఛాంపియన్ షిప్ బ్యాటిల్ సీజన్ 15 గ్రాండ్ ఫినాలే లోకి ఎంట్రీ ఇచ్చింది. సోమేష్, రేవంత్, గ్రీష్మ, పండు ఈ నలుగురు కొరియోగ్రాఫర్స్ గ్రాండ్ ఫినాలేలోకి వచ్చారు. వీళ్లకు మార్క్స్ వేయడం కోసం అలాగే బెదురులంక మూవీ ప్రొమోషన్స్ లో భాగంగా కార్తికేయ, నేహా శెట్టి కూడా  ఈ షోకి వచ్చారు. ఈ నలుగురు లోంచి ఒకరు ఎలిమినేట్ అవుతారు మిగతా ముగ్గురిలో పోటీ ఉంటుంది..వాళ్ళల్లో ఒకరు టైటిల్ విన్నర్ అవుతారని శేఖర్ మాస్టర్ చెప్పారు. అలాగే ఈ వారం లెవెల్ 1 నిర్వహించారు. ఇందులో ప్రాపర్టీస్ యూజ్ చేసుకుని గ్రూప్ పెర్ఫార్మెన్స్ చేయాలి. వాళ్లకు మేం సీక్రెట్ స్కోర్ వేస్తాం..ఎవరైతే లీస్ట్ స్కోర్ చేస్తారో వాళ్ళు ఎలిమినేట్ అవుతారు..మిగతా ముగ్గురు నెక్స్ట్ లెవెల్ కి వెళ్తారు అని చెప్పారు. ఈ నలుగురు కొరియోగ్రాఫర్స్ పోటా పోటీగా పెర్ఫార్మ్ చేశారు. ఫైనల్ గా నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళబోతున్న కొరియోగ్రాఫర్స్ పేర్లను కార్తికేయ, నేహా శెట్టి అనౌన్స్ చేశారు. గ్రీష్మ, సోమేష్, పండు మాస్టర్లు ముగ్గురు నెక్స్ట్ లెవెల్ కి వెళ్లగా రేవంత్ మాష్టర్ ఎలిమినేట్ అయ్యారు. పండు మాష్టర్  కంటెస్టెంట్ నవీన్ వచ్చి పెర్ఫార్మ్ చేసాడు. ఇందులో పుష్ప 2 లో అల్లు అర్జున్ వేసే గెటప్ లో వచ్చి డాన్స్ పెర్ఫార్మ్ చేసినందుకు జడ్జెస్ అంతా ఫిదా ఇపోయారు.

"ఈ పాట చూస్తే బన్నీ గారు తన సాంగ్ కోరియోగ్రఫీకి నిన్ను పెట్టేసుకుంటారేమో..ఇవన్నీ కాదు డైరెక్ట్ గా బన్నీ గారి సాంగ్ కొట్టేద్దామనేనా నీ గోల్...తర్వాత మరి నా సినిమాకు కూడా చేస్తావా..నాకు ఈ సాంగ్ చూసాక మంచి ఊపొచ్చింది..నిజంగా బన్నీ గారి సాంగ్ చూసానేమో అనిపించింది" అని చెప్పారు కార్తికేయ. "ఒక వేళా ఈ సాంగ్ ని బన్నీ గారు చూస్తే గనక కచ్చితంగా మిమ్మల్ని కలుస్తారు" అని చెప్పారు నేహా శెట్టి. "పుష్ప 2 ఇంకా రాలేదు...బన్నీ గారి గెటప్ కి డాన్స్ ఎలా ఉంటుందో తెలీదు..అసలు ఆ గెటప్ తో సాంగ్ ఉంటుందో లేదో కూడా తెలీదు...అలాంటిది తీసుకుని నువ్వు ఎక్స్పీరిమెంట్ చేసావ్. డెఫినిట్ గా సుకుమార్ గారు , బన్నీ గారు, మైత్రి మూవీస్ వాళ్ళు చూస్తారు...వాళ్లకు నచ్చితే మాత్రం నిన్ను పిలుస్తారు." అని విష్ చేశారు శేఖర్ మాష్టర్.