English | Telugu

ఆలీతో సరదాగా సీజన్ 2 త్వరలో

బుల్లితెర మీద ఆలీతో సరదాగా షో ఒక రేంజ్ లో ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేసిన విషయం తెలిసిందే. ఎంతోమంది సెలబ్రిటీస్ ని ఇంటర్వ్యూస్ చేసిన ఈ షో కొంత కాలం క్రితం ఆగిపోయింది. సినీ సెలబ్రిటీస్ తో పాటు అప్పుడప్పుడు ట్రెండింగ్ పర్సన్స్ ని కూడా ఈ షోకి తీసుకొచ్చారు. ఇక ఆడియన్స్ లో ఇదే ప్రశ్న వచ్చింది ..ఈ షో ఆగిపోతుందా అని. అప్పుడు ఆలీ తన షోకి తానే ఇంటర్వ్యూకి వచ్చారు.

అలా అక్టోబరు 24, 2016న ప్రారంభమైన ఈ ఆలీతో సరదాగా జర్నీ మధ్య మధ్యలో చిన్న చిన్న గ్యాప్‌లు వచ్చినా.. ఫైనల్‌గా ముగిసిపోయింది. అయితే ఇది కూడా ఫుల్‌స్టాప్‌ కాదని, కామానే అని చెప్పారు ఆలీ. అయితే ఈ కామా ఎన్ని రోజులు అనేది అప్పట్లో ఆయన చెప్పలేదు. మంచు లక్ష్మి గెస్ట్‌గా స్టార్ట్ ఐన ఈ షో ఆలీ ఇంటర్వ్యూతో ఎండ్ అయ్యింది. ఆలీతో ఇంటర్వ్యూ చేసే ఎపిసోడ్‌ను సుమ హోస్ట్‌గా నిర్వహించారు. ఐతే ఇప్పుడు ఈ షోకి ఆ కామా తీసేసి మళ్ళీ పట్టాలెక్కిస్తున్నారు. ఇక ఈ షో చేసే సెట్ ని, ఆలీ సిట్టింగ్ స్టైల్ పిక్స్ ని జ్ఞాపిక ఎంటర్టైన్మెంట్స్ తన ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసింది. ఐతే యాక్టర్ శివాజీ రీసెంట్ గా తన ఇన్స్టాగ్రామ్ లో, యూట్యూబ్ లో మేకప్ వేసుకుంటూ మరో వైపు క్యారవాన్ దగ్గర ఆలీతో మాట్లాడుతూ ఆలీతో సరదాగా సెట్ లో షూటింగ్ లో కనిపించాడు. అంటే శివాజీతో ఈ సీజన్ 2 ని స్టార్ట్ చేయబోతున్నారా అనే విషయం తెలుస్తోంది.. బిగ్ బాస్ సీజన్ 7 లో నటుడు శివాజీ హౌస్ లో కంటెస్టెంట్స్ అందరికీ ఒక మోటివేటర్ గా బాగా దగ్గరుండి గేమ్స్ ఆడించిన విషయం తెలిసిందే. మరి ఇపుడు శివాజీని ఇంటర్వ్యూ చేయబోతున్నారనే విషయం తెలుస్తోంది. మరి ఈ షోకి బిగ్ బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్ కూడా వస్తాడా అనే డౌట్స్ కూడా ఉన్నాయి ఆడియన్స్ లో చూడాలి..ఈ రాబోయే కొత్త సీజన్ లో ఎలాంటి స్టార్స్ రాబోతున్నారు అని ..

Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.

Illu illalu pillalu : అమూల్యకి పెళ్ళిచూపులు.. కామాక్షి ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -362 లో.. పెళ్లిచూపులకి ఇంకా రావడం లేదని రామరాజు వాళ్ళు ఎదురుచూస్తుంటే వాళ్ళు రారుగా అని శ్రీవల్లి మనసులో అనుకుంటుంది. అప్పుడే అబ్బాయి వాళ్ళు పెళ్లిచూపులకు ఎంట్రీ ఇస్తారు‌. దాంతో శ్రీవల్లి షాక్ అవుతుంది. భాగ్యం, ఆనందరావు కూడా వస్తారు. వాళ్ళు ఏం జరిగిందో శ్రీవల్లికి చెప్తారు. వాళ్ళు చెప్పాల్సింది మొత్తం అబ్బాయి వాళ్ల నాన్నకి చెప్తారు కానీ అతనికి చెవులు వినిపించవు.. వాళ్ల అమ్మ కి చెప్పేలోపు అటువైపు గా ప్రేమ, ధీరజ్ వెళ్లడం చూసి మళ్ళీ చెప్పలేకపోయామని శ్రీవల్లికి భాగ్యం చెప్తుంది.