English | Telugu

కార్తీకదీపం vs ఐపిఎల్... రిమోట్ దొరకడం కష్టమే!

సినిమాలకే కాదండి సీరియల్స్ కి కూడా సీక్వెల్స్ ఉంటాయి. ఇప్పుడు అలాగే కార్తీక దీపం సీరియల్ కి సీక్వెల్ వచ్చేస్తోంది. ‘కార్తీక దీపం ఇది నవవసంతం’ అంటూ సీక్వెల్ టైటిల్ కూడా రివీల్ చేశారు. ఐతే రీసెంట్ గా రిలీజ్ చేసిన సెకండ్ పార్ట్ ప్రోమో ఆడియన్స్ ని ఆకట్టుకుంటోంది. తెలుగు లోగిళ్లు మరువని కథ కొత్త వెలుగులతో మళ్లీ వస్తోంది అంటూ చెప్పుకొచ్చారు. ఈ సీరియల్ సృష్టించిన రికార్డు ఇంకే సీరియల్ కూడా సృష్టించలేకపోయింది.

ఒకప్పుడు దూరదర్శన్ లో అద్భుతమైన లవ్ స్టోరీ ఋతురాగాలు కోసం లేడీస్, జెంట్స్, కాలేజీ స్టూడెంట్స్ అంతా వెయిట్ చేసేవాళ్ళు. ఆ తర్వాత సీరియల్స్ చరిత్రలో గుర్తు పెట్టుకునే మరో సీరియల్ గా కార్తీక దీపం నిలిచింది. ఇందులో దీప అలియాస్ వంటలక్క పాత్రలో ప్రేమీ విశ్వనాథ్ కనిపించింది. ఆమె నటనకు తెలుగు అడియన్స్ ఫిదా అయ్యారు. ఈ సీరియల్ ద్వారా ప్రేమీ విశ్వనాథ్ కు ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఏర్పడింది. డాక్టర్ బాబుగా నిరుపమ్ పాత్ర గురించి చెప్పక్కర్లేదు. మొత్తం ఆరేళ్లపాటు సుమారు 1559 ఎపిసోడ్స్ పూర్తి చేసుకుంది. తెలుగులో అత్యధిక టీఆర్పీ రేటింగ్ దక్కించుకున్న సీరియల్ గా నిలిచింది. ఇక ఇప్పుడు ఈ సీరియల్ కు సీక్వెల్ మళ్లీ రాబోతుంది. ఐతే ఈ సీక్వెల్ ఎప్పుడు స్టార్ట్ కాబోతోందో డేట్ ఇవ్వలేదు. కానీ వచ్చే నెల నుంచి ఐపిఎల్ షెడ్యూల్ ఇచ్చేసింది. దీంతో కార్తీక దీపం వెర్సెస్ ఐపీఎల్ అంటూ ట్రోల్ల్స్ మీమ్స్ బాగా వైరల్ అవుతున్నాయి. తెలుగు ఆడియన్స్ అంతా "హమ్మయ్యా చివరికి కార్తీక దీపం అప్ డేట్ వచ్చింది" అనుకుంటూ ఉంటే, "ఇక రిమోట్ దొరకడం అంటూ తీవ్ర ఆందోళనకు గురవుతున్న ఐపిఎల్ యూత్"..అనే మీమ్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. "ఒక రోజు నేను టీవీలో సీరియల్స్ చూస్తా..నువ్వు ఓటిటిలో కార్తీక దీపం చూడు. ఇంకో రోజు నేను ఓటిటిలో క్రికెట్ చూస్తా నువ్వు టీవీలో కార్తీక దీపం చూడు" అంటూ తల్లి పిల్లల మధ్య మాటలు బాగా పేలాయి.

Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.

Illu illalu pillalu : అమూల్యకి పెళ్ళిచూపులు.. కామాక్షి ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -362 లో.. పెళ్లిచూపులకి ఇంకా రావడం లేదని రామరాజు వాళ్ళు ఎదురుచూస్తుంటే వాళ్ళు రారుగా అని శ్రీవల్లి మనసులో అనుకుంటుంది. అప్పుడే అబ్బాయి వాళ్ళు పెళ్లిచూపులకు ఎంట్రీ ఇస్తారు‌. దాంతో శ్రీవల్లి షాక్ అవుతుంది. భాగ్యం, ఆనందరావు కూడా వస్తారు. వాళ్ళు ఏం జరిగిందో శ్రీవల్లికి చెప్తారు. వాళ్ళు చెప్పాల్సింది మొత్తం అబ్బాయి వాళ్ల నాన్నకి చెప్తారు కానీ అతనికి చెవులు వినిపించవు.. వాళ్ల అమ్మ కి చెప్పేలోపు అటువైపు గా ప్రేమ, ధీరజ్ వెళ్లడం చూసి మళ్ళీ చెప్పలేకపోయామని శ్రీవల్లికి భాగ్యం చెప్తుంది.