English | Telugu

నా చివరి సినిమా జగదేక వీరుడు అతిలోక సుందరి పార్ట్ - 2 !

ఆలీతో సరదాగా షోకి ఎంతో మంది ఫేమస్ పర్సన్స్ వస్తూ ఉంటారు. అలాంటి ఇంటెలెక్ట్యువల్స్ లో అశ్వనీ దత్ ఒకరు. ఇక ఈ షోకి సంబంధించి రాబోయే వారం ఎపిసోడ్ ప్రోమో రిలీజ్ అయ్యింది. గౌరీశంకరుల కథ సినిమా షూటింగ్ టైంలో ఇండస్ట్రీలో ఏదో ఇన్సిడెంట్ జరిగిందట కదా ఏమిటది అని ఆలీ అడిగేసరికి సింగీతం ఒక వైపు , కేవీ రెడ్డి ఒక వైపు ఉన్నారట. ఇంతలో ఒక పాము సెట్ లోకి వచ్చిందట. సింగీతం గారు పాము అనేసరికి వదలండి బ్రదర్ వారే వస్తారు ఇక్కడికి అన్నారట సీనియర్ ఎన్టీఆర్.

ఆయన ఎవరినైనా అలా గౌరవంగా పిలుస్తారన్నారు. సీనియర్ ఎన్టీఆర్ పార్టీలోకి మీరు ఎందుకు వెళ్ళలేదు అనేసరికి పార్టీ అభిమానిగా ఉన్నాను, ఒక మెంబర్ గా ఉన్నాను తప్ప ప్రత్యక్ష రాజకీయాలలోకి రావాలని ఎప్పుడూ అనిపించలేదన్నారు. ఇంకా వైజయంతి బ్యానర్ నుంచి ఎలాంటి సినిమాలను ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనేసరికి మైండ్ లో అనుకుంటున్నాను కానీ ముందుకు వెళ్లడం లేదు...అదే నా ఆఖరి చిత్రం అని నా మైండ్ లో డిక్లేర్ చేసుకున్నా అది జగదేక వీరుడు అతిలోక సుందరి పార్ట్ 2 తీద్దామని అనుకుంటున్నా అని చెప్పారు.

కృష్ణుడి రూపంలో ఉండే సీనియర్ ఎన్టీఆర్ ని ఎప్పటికీ దైవంగానే భావిస్తానన్నారు అశ్వనీ దత్. అప్పట్లో ఎదురులేని మనిషి సినిమాకు 16 లక్షలు అయ్యాయని చెప్పేసరికి ఈ రోజుల్లో ఆ మొత్తాన్ని వాళ్ళ మేకప్ మెన్స్ కి ఇస్తున్నారు కదా అంటూ ఆలీ పంచ్ వేస్తాడు. జాతిరత్నాలు సినిమా కథ విన్నారా అని అడిగేసరికి చెప్పడానికి అక్కడ కథ ఉంటేగా అన్నీ కామెడీ సీన్స్ మాత్రమే తర్వాత మూవీ రిలీజ్ అయ్యాక థియేటర్ లో చూస్తే పడీ పడీ నవ్వుకున్నా అని చెప్పారు అశ్వనీదత్ .

Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.

Illu illalu pillalu : అమూల్యకి పెళ్ళిచూపులు.. కామాక్షి ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -362 లో.. పెళ్లిచూపులకి ఇంకా రావడం లేదని రామరాజు వాళ్ళు ఎదురుచూస్తుంటే వాళ్ళు రారుగా అని శ్రీవల్లి మనసులో అనుకుంటుంది. అప్పుడే అబ్బాయి వాళ్ళు పెళ్లిచూపులకు ఎంట్రీ ఇస్తారు‌. దాంతో శ్రీవల్లి షాక్ అవుతుంది. భాగ్యం, ఆనందరావు కూడా వస్తారు. వాళ్ళు ఏం జరిగిందో శ్రీవల్లికి చెప్తారు. వాళ్ళు చెప్పాల్సింది మొత్తం అబ్బాయి వాళ్ల నాన్నకి చెప్తారు కానీ అతనికి చెవులు వినిపించవు.. వాళ్ల అమ్మ కి చెప్పేలోపు అటువైపు గా ప్రేమ, ధీరజ్ వెళ్లడం చూసి మళ్ళీ చెప్పలేకపోయామని శ్రీవల్లికి భాగ్యం చెప్తుంది.