Read more!

English | Telugu

డ్యాన్స్ షో కాస్త ఫుల్ సర్కస్ షో అయింది.. అఖిల్ సార్థక్ సెన్సేషనల్ కామెంట్స్!

అఖిల్ సార్థక్ ఇప్పుడు సోషల్ మీడియాలఫ డిఫరెంట్ పోస్ట్ లతో ప్రేక్షకులను తన వైపుకి తిప్పుకుంటున్న మోస్ట్ ఎలజిబుల్ బ్యాచిలర్. ఇతను బిగ్ బాస్ -4 లో రన్నర్ గా నిలిచిన విషయం అందరికి తెలిసిందే. కాగా ఆ షోలో మోనల్ కోసం అభిజిత్ తో కలిసి పోటాపోటీగా సాగిన కోల్డ్ వార్ అందరికి గుర్తుండే ఉంటుంది. అన్ని సీజన్లలో కన్న ఎక్కువ మంది ఇష్టపడింది, గుర్తుండిపోయింది బిగ్ బాస్-4. ఈ సీజన్ లో అఖిల్ సార్థక్ తన అటిట్యూడ్ తో ప్రేక్షకులలో మంచి ఫేమ్ సంపాదించుకున్నాడు. 

నీతోనే డ్యాన్స్ షో అంటూ తేజస్వీతో కలిసి అఖిల్ డ్యాన్స్ చేశాడు. మొదటి సీజన్‌లో ఈ జోడి బాగానే పర్ఫామెన్స్ చేసింది. కానీ అఖిల్‌కు డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తూ గాయం అవ్వడంతో మధ్యలోనే ఆ జంట డ్రాప్ అయింది. ఇప్పుడు నీతోనే డ్యాన్స్ షో సెకండ్ సీజన్ నడుస్తోంది. అసలు బుల్లితెరపై డ్యాన్స్ షోలంటే డ్యాన్సులు తక్కువ.. కామెడీ ఎక్కువ.. జిమ్నాస్టిక్స్ ఎక్కువగా ఉంటాయన్న సంగతి తెలిసిందే. ఈ నీతోనే డ్యాన్స్ షో సెకండ్ సీజన్‌లోనూ అంతే. డ్యాన్సులు తక్కువ ఫీట్లు ఎక్కువగా ఉన్నాయి. రీసెంట్‌గా రిలీజ్ చేసిన ప్రోమో మీద అఖిల్ తన అసంతృప్తిని తెలియజేసాడు. ఇలా మాట్లాడుతున్నందుకు క్షమించమని కూడా అఖిల్ అన్నాడు. ఈసారి నీతోనే డ్యాన్స్ షోలో తరుణ్ మాస్టర్, సదా, రాధా వంటి వారు జడ్జ్‌లుగా ఉన్నారు. ఈ క్రమంలో అఖిల్ సార్థక్ షోని, జడ్జ్‌లను టార్గెట్ చేసినట్టుగా కనిపిస్తోంది. డ్యాన్స్ షోలో డ్యాన్స్ చేయడం లేదని, డ్యాన్స్ చేసే వాళ్లని తీసేస్తారంటూ కౌంటర్లు వేశాడు. ఈ సారి జడ్జ్‌లు బాగా లేరని, అక్కడ కంటెస్టెంట్లది తప్పేమీ లేదని, అంతా జడ్జ్‌లే చేస్తున్నారంటూ సెటైర్లు వేశాడు. 

ఇక నీతోనే డ్యాన్స్ ప్రోమో చూసి .. " ఇప్పుడే ఓ ప్రోమో చూశాను.. చాాలా దారుణంగా ఉంది.. డ్యాన్స్ చేస్తే మార్క్స్ ఇవ్వరు.. స్టంట్స్ చేస్తే చాలంటా.. జడ్జ్‌లు వాళ్ల స్థాయికి తగ్గట్టుగా లేరు.. ఇలా అంటున్నందుకు క్షమించండి.. స్టార్ మా ఈ సారి పరువు తీసుకుంటోంది.. ఫుల్ సర్కస్ షో అయింది.. కంటెస్టెంట్ల తప్పేమీ లేదు.. వాళ్లని ఎంకరేజ్ చేస్తున్న జడ్జ్‌లదే తప్పు.. డ్యాన్స్ షో డ్యాన్స్ షోలానే ఉంటే బాగుంటుంది.. ఈ సారి జడ్జ్‌లు ఏమీ బాగా లేరు.. ఇది నా అభిప్రాయం" అంటూ అఖిల్ పోస్ట్ చేశాడు. కాగా ఇది నెట్టింట వైరల్ గా మారింది. బిగ్ బాస్ సీజన్ సెవెన్ ముగిసిన తర్వాత పల్లవి ప్రశాంత్ ని కలిసిన అఖిల్ సార్థక్ ఆ వీడియోని తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేయగా అది మిలియన్ వ్యూస్ కి చేరుకుంది. ఇలా రెగ్యులర్ గా వైరల్ అయ్యే కంటెంట్ తో నెటిజన్లకు దగ్గరగా ఉంటున్నాడు.