English | Telugu

నడవడానికి ఇంకో నెల టైం పడుతుంది...అందుకే ఇంట్లోంచి షార్ట్స్ చేస్తున్నాను


రౌడీ రోహిణి బుల్లితెర మీద చాలా తక్కువ కాలంలో ఫేమస్ ఐన ఆర్టిస్ట్. జబర్దస్త్ లో లేడీ కమెడియన్ గా మంచి నేమ్ అండ్ ఫేమ్ సంపాదించుకుంది. తన కామెడీ టైమింగ్ తో ఎంతో మందిని ఆకట్టుకుంది. మొదటి లేడీ టీమ్‌ లీడర్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు . ఇప్పుడు సినిమాలు, వెబ్‌ సిరీస్‌లతో కూడా బిజీగా మారిపోయారు రోహిణి. రీసెంట్ గా "సేవ్ ది టైగర్స్" అనే వెబ్ సిరీస్ లో రోహిణి కామెడీ రోల్ కి ఆడియన్స్ చాలామంది ఫాన్స్ ఇపోయారు. అలాంటి రోహిణి చాలా కాలం క్రితం ఒక రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఆ టైములో ఆమె కాలికి తీవ్ర గాయమయ్యింది. దాంతో అప్పుడు ఆమె కుడి కాలులో ఒక రాడ్ వేశారు.

కొంతకాలం తర్వాత ఆ రాడ్ తీసేయాలని చెప్పారట డాక్టర్స్. కానీ రోహిణి కెరీర్ లో బిజీగా ఉండటంతో హాస్పిటల్ వెళ్ళలేదు. ఇక రీసెంట్ గా లాస్ట్ మంత్ లో ఆమె హాస్పిటల్ లో జాయిన్ అయ్యారు. దాదాపు 10 గంటలు కష్టపడి డాక్టర్స్ ఆ రాడ్డును తొలగించారు. అప్పటి నుంచి రోహిణి ఇంట్లోనే రెస్ట్ తీసుకుంటూ ఉన్నారు. ఇక ఇప్పుడు నెమ్మదిగా కోలుకుని మళ్ళీ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండడానికి రెడీ అయ్యారు. అందులో భాగంగా ఫాన్స్ తో ముచ్చట్లు పెట్టింది రోహిణి. చాలామంది చాల ప్రశ్నలు అడిగారు. "మీ హెల్త్ కండిషన్ ప్రస్తుతానికి ఓకే నా" " నడవడానికి ఇంకో నెల సమయం పడుతుంది" "మీ కంబ్యాక్ కోసం వెయిటింగ్" " నేను కూడా వెయిటింగ్" మీరు నాకు రౌడీ రోహిణి కాదు..ఒక పెర్ఫార్మర్ ఏ ట్రూ రాక్ స్టార్" థ్యాంక్యూ" "షూట్స్ కి వెళ్తున్నారా" "లేదు వెళ్లడం లేదు...నడవడానికి ఇంకో నెల సమయం పడుతుంది..ఇంట్లో నుంచి షార్ట్ వీడియోస్ చేస్తున్నాను" అని చెప్పింది రోహిణి.


Brahmamudi Serial : దుగ్గిరాల కుటుంబం హ్యాపీ.. రుద్రాణి కన్నింగ్ ప్లాన్ అదేనా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ బ్రహ్మముడి (Brahmamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-931 లో.. మినిస్టర్ కి పాప పుడుతుంది. ఆపరేషన్ తర్వత డాక్టర్ బయటకు వస్తాడు. మీకు పాప పుట్టింది అని డాక్టర్ అనగానే.. మినిస్టర్ ఫుల్ హ్యాపీగా ఉంటాడు. కానీ పాపకి ఒక ప్రాబ్లమ్ ఉందని డాక్టర్ చెప్తాడు. ఏ ప్రాబ్లమ్ ఉన్నా ఆపరేషన్ చేయించండి.. ఎంతమంది డాక్టర్ లు ఐనా , ఎక్కడి నుంచి అయినా తీసుకొచ్చి అయినా ఆపరేషన్ చేపించండి అని మినిస్టర్ అనగానే.. ఇప్పుడు చేయకూడదు.. పాప వెయిట్ తక్కువ ఉంది.. పాప పెరిగాక ఆపరేషన్ చేయాలని డాక్టర్ చెప్తాడు. వాళ్ళిద్దరూ మాట్లాడుకునేదంతా రుద్రాణి చూస్తుంది.

Illu illalu pillalu Serial:  అమూల్య ఎంగేజ్ మెంట్ ఆపడానికి భద్రవతి ప్లాన్.. భాగ్యం ఏం చేయనుంది!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు (Illu illalu pillalu). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-370 లో.. దేవుడా ఏ ఆటంకం లేకుండా ఈ నిశ్చితార్థం సవ్యంగా జరిగేలా చూడు అని దేవుడికి మొక్కుకుంటుంది వేదవతి. అప్పుడే దేవుడి దగ్గరున్న దీపాలు ఆరిపోతాయి. అయ్యో ఇదేంటి దీపాలు ఆరిపోయాయేంటని వేదవతి టెన్షన్ పడుతుంది. మరోవైపు కామాక్షి భర్త కోసం గుమ్మం దగ్గర ఎదురుచూస్తుంటుంది. అప్పుడే తిరుపతి చూస్తాడు. ఏంటమ్మా అని అడుగుతాడు. మా ఆయన కోసం ఎదురుచూస్తున్నానని కామాక్షి చెప్తుంది. అప్పుడే కామాక్షి భర్త ఆటోలో ఎంట్రీ ఇస్తాడు.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.