English | Telugu

పూట గడవని స్థితిలో సీనియర్ నటి పాకీజా!

మూవీ ఇండస్ట్రీ అంటేనే రంగురంగుల జీవితం..ఎప్పుడు ఎవరి జీవితాల్లో రంగులు నిండుతాయో, ఎవరి జీవితాల్లో వెలుగులు ఆరిపోతాయో ఎవరికీ తెలీదు. ఒక వెలుగు వెలిగి మాయమైపోయిన వాళ్ళు ఇక్కడ లెక్కకు మించి కనిపిస్తారు. కొంతమంది దీనస్థితిలో తినడానికి కూడా తిండి లేని స్థాయికి వెళ్ళిపోయి నిరాశగా జీవిస్తూ ఉంటారు. అలాంటి వారిలో సీనియర్ నటి పాకీజా అలియాస్ వాసుకి ఒకరు. పాకీజా పేరు వినగానే మోహన్ బాబు సినిమా గుర్తొస్తుంది. పాకీజా అసలు పేరు వాసుకి. ఈమె తమిళనాడు కారైకుడికి చెందిన నటి.

ఇప్పుడు ఆమె వయసు పైబడడంతో పాటు పేదరికంతో ఓ హాస్టల్‌లో ఉంటూ కాలం వెళ్లదీస్తున్నట్లు ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. తెలుగులో దాదాపు 50, తమిళ్‌తో కలుపుకుంటే 150కి పైగా చిత్రాల్లో నటించారు. తెలుగులో "అసెంబ్లీ రౌడీ" మూవీలో వేసిన పాకీజా రోల్ ద్వారా ఆమె పాపులర్ అయ్యారు. తర్వాత పెదరాయుడు, రౌడీ ఇన్స్పెక్టర్ లాంటి చాలా సినిమాలలో ఆమె నటించింది. పాకీజా లేడీ కమెడియన్ గా ఎంతో మంచి పేరు సంపాదించుకున్నప్పటికీ, ఆస్తిపాస్తులు మాత్రం ఏమి వెనకేసుకోలేదట. వాళ్ళ అమ్మ కాన్సర్ తో మరణించారని చెప్పింది.

అలాగే తనకు షుగర్ ఎటాక్ అయ్యిందని అలాగే యుటిరస్ కూడా తొలగించాల్సి వచ్చిందని తన కష్టాలు చెప్పుకొచ్చారు. తెలుగులో తన బెస్ట్ ఫ్రెండ్ అంటే జయలలిత అని చెప్పారు. హెల్ప్ కోసం తమిళ నడిగర్ సంఘంతో పాటు అందరు హీరోలను సంప్రదించాను అని వివరించారు. ఆఖరికి సీఎం కుమారుడు ఉదయనిధి స్టాలిన్ కి కూడా తన పరిస్థిని వివరించామన్నారు. కానీ తనకు ఎవరూ హెల్ప్ చేయలేదు చాలా బాధపడ్డారు.

Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.

Illu illalu pillalu : అమూల్యకి పెళ్ళిచూపులు.. కామాక్షి ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -362 లో.. పెళ్లిచూపులకి ఇంకా రావడం లేదని రామరాజు వాళ్ళు ఎదురుచూస్తుంటే వాళ్ళు రారుగా అని శ్రీవల్లి మనసులో అనుకుంటుంది. అప్పుడే అబ్బాయి వాళ్ళు పెళ్లిచూపులకు ఎంట్రీ ఇస్తారు‌. దాంతో శ్రీవల్లి షాక్ అవుతుంది. భాగ్యం, ఆనందరావు కూడా వస్తారు. వాళ్ళు ఏం జరిగిందో శ్రీవల్లికి చెప్తారు. వాళ్ళు చెప్పాల్సింది మొత్తం అబ్బాయి వాళ్ల నాన్నకి చెప్తారు కానీ అతనికి చెవులు వినిపించవు.. వాళ్ల అమ్మ కి చెప్పేలోపు అటువైపు గా ప్రేమ, ధీరజ్ వెళ్లడం చూసి మళ్ళీ చెప్పలేకపోయామని శ్రీవల్లికి భాగ్యం చెప్తుంది.