English | Telugu

త్వరలో 'సరిగమప' ఛాంపియన్ షిప్ న్యూ సీజన్!


'స రి గ మ ప తెలుగు' బుల్లితెర మీద ఎంతగా ఫేమస్ అయ్యిందో అందరికీ తెలిసిన విషయమే. ఇక త్వరలో సరికొత్త సీజన్ తో మళ్ళీ మన ముందుకు రాబోతోంది. ఈ కొత్త సీజన్ కి 'స రి గ మ ప ఛాంపియన్‌షిప్' అని పేరు పెట్టారు. ఈ షోకి సంబంధించిన థీమ్ సాంగ్ ని రిలీజ్ చేశారు మేకర్స్. కొత్త సీజన్ జనవరి నెలాఖరు నుంచి ప్రసారం అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ షోని ప్ర‌దీప్ మాచిరాజు హోస్ట్ చేయ‌నున్నారు.

ఇక జడ్జెస్ గా అనంత శ్రీరామ్, ఎస్పీ శైలజ, మనో ఈ ఛాంపియన్ షిప్ సీజన్ లో కనిపించబోతున్నారు. "ప్రతిభకు జయాపజయాలతో పని లేదు. ఓటమి గమనాన్ని ఆపలేదు. విజయం గమ్యం కాదు...సంగీతం ఒక మహా సముద్రం..సంగీత సాగరంలో సరిగమల మధ్య సమరం మళ్ళీ ఆరంభం" అనే ఇంట్రోతో ఈ షో ప్రోమో రిలీజ్ అయ్యింది. ఈ పేరులోనే తెలిసిపోతోంది ..ఈ సీజన్ స్పెషలిటీ ఏమిటి అనేది. మధురమైన స్వరాలతో, ఆహ్లాదకరమైన గానాలతో, మైమరపించే పాటలతో చివరి 4 సీజన్స్ లో గెలిచిన విన్నర్స్ మధ్య సరిగమల సమరంతో మీ ముందుకి వచ్చేస్తుంది సరిగమప ఛాంపియన్ షిప్.

ఇక ఈ షోలో మెంటార్స్ గా శ్రీకృష్ణ, సాకేత్ కొమండూరి, రమ్య బెహరా, అరుణ్ కౌండిన్య కనిపించబోతున్నారు.

Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.

Illu illalu pillalu : అమూల్యకి పెళ్ళిచూపులు.. కామాక్షి ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -362 లో.. పెళ్లిచూపులకి ఇంకా రావడం లేదని రామరాజు వాళ్ళు ఎదురుచూస్తుంటే వాళ్ళు రారుగా అని శ్రీవల్లి మనసులో అనుకుంటుంది. అప్పుడే అబ్బాయి వాళ్ళు పెళ్లిచూపులకు ఎంట్రీ ఇస్తారు‌. దాంతో శ్రీవల్లి షాక్ అవుతుంది. భాగ్యం, ఆనందరావు కూడా వస్తారు. వాళ్ళు ఏం జరిగిందో శ్రీవల్లికి చెప్తారు. వాళ్ళు చెప్పాల్సింది మొత్తం అబ్బాయి వాళ్ల నాన్నకి చెప్తారు కానీ అతనికి చెవులు వినిపించవు.. వాళ్ల అమ్మ కి చెప్పేలోపు అటువైపు గా ప్రేమ, ధీరజ్ వెళ్లడం చూసి మళ్ళీ చెప్పలేకపోయామని శ్రీవల్లికి భాగ్యం చెప్తుంది.