English | Telugu

కమిట్‌మెంట్ ఇస్తేనే ఆఫర్స్ అని లేదు...తెలుగు ఆర్టిస్టులు లేకపోవడానికి కారణం...

సిల్వర్ స్క్రీన్ మీద జ్యోతి ఫేమస్ నటి. ఎన్నో మూవీస్ లో నటించిన ఆమె ఒక ఇంటర్వ్యూలో ఎన్నో విషయాలు చెప్పుకొచ్చింది. ఇండస్ట్రీలో తెలుగు ఆర్టిస్టులు లేకపోవడానికి కారణం ఏమంటారు మీరు అని అడిగింది. దానికి జవాబిచ్చింది జ్యోతి. తెలుగు వచ్చని చెప్పడమే. దూరపు కొండలు నునుపు అంటారు కదా. బొంబాయి లాంటి ప్లేసెస్ నుంచి తీసుకొస్తున్నారు. అంటే వచ్చేయి రాని తెలుగు ఐతే అవకాశాలు ఉంటున్నాయి. అంటే ఏదో ఉంది వీళ్లల్లో అని పిలిచి మరీ అవకాశాలు ఇస్తున్నారు. గుప్పిట ముడుచుకుని ఉన్నప్పుడే అనడం కదా ఓపెన్ ఐపోతే అందం ఉండదు కదా" అంటూ అసలు విషయాన్నీ చెప్పుకొచ్చింది. "ఇండస్ట్రీలో కమిట్మెంట్స్ ఇస్తే కానీ ఆఫర్స్ రావు అంటారు. ఎంతవరకు నిజం అంటారు" అని అడిగింది హోస్ట్. "అది బుల్ షిట్. ఇప్పుడు ఉన్న జనరేషన్ చాలా ఫాస్ట్ ఉన్నారు. మొహం మీదే చెప్పేస్తున్నారు. నేను 2002 లో ఇండస్ట్రీకి వచ్చాను. అప్పటి నుంచి నేను చూస్తోంది ఏంటంటే నేను కమిట్మెంట్ ఇచ్చి నేను ఎలాంటి ఆఫర్ ని తీసుకోలేదు సీరియస్ గా. నేను ఎక్కువగా చేసింది అంతా కృష్ణ రెడ్డి గారి సినిమాల్లోనే. ఆయన నాకు తండ్రితో సమానం. ఈ విషయాన్నీ చాల ఇంటర్వ్యూస్ లో కూడా చెప్పాను. నాకు ఇష్టమైతేనే నేను ఒక రిలేషన్ షిప్ లోకి ఎంటరవుతాను. అంతేకాని నన్ను ఇంతవరకు అలా ఎవరూ ఫోర్స్ చేసిన వాళ్ళు లేరు. ఈ విషయం ఎక్కువగా మన ఇండస్ట్రీలోనే ఫోకస్ గా ఉంటుంది. అదే బయట చూస్తే అదొక మ్యూచువల్ గా జరిగే విషయం. మన ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇస్తేనే అవకాశాలు ఇస్తారు లాంటిది ఏమీ లేదు. అదంతా టాలెంట్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. ఇక ఇప్పుడు ఉన్న జనరేషన్ ఐతే చాల స్పీడ్ గా ఉంది. ఇప్పుడు మీడియా, సోషల్ మీడియా చాలా స్పీడ్ గా ఉంది. ఏ చిన్న నాన్సెన్స్ జరిగినా వాళ్ళు సోషల్ మీడియాని అప్రోచ్ అవుతున్నారు. నువ్వేంతరా, నువ్వు నాకేంటి చెప్పెదిరా అని అడిగేస్తున్నారు. ఒక్క సినిమాకు కాంప్రమైజ్ కావడం అనేది పెద్ద నాన్సెన్స్ విషయం. సక్సెస్ అనేది మనకు ఏమీ నేర్పించదు. కానీ ఫెయిల్యూర్ మాత్రం చాలా విషయాలు నేర్పిస్తున్నారు. కాబట్టి అవకాశం రావట్లేదు అన్నప్పుడు వేరే బిజినెస్ వైపు అడుగులు వేయడం మంచిది."అని చెప్పింది జ్యోతి.

Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.

Illu illalu pillalu : అమూల్యకి పెళ్ళిచూపులు.. కామాక్షి ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -362 లో.. పెళ్లిచూపులకి ఇంకా రావడం లేదని రామరాజు వాళ్ళు ఎదురుచూస్తుంటే వాళ్ళు రారుగా అని శ్రీవల్లి మనసులో అనుకుంటుంది. అప్పుడే అబ్బాయి వాళ్ళు పెళ్లిచూపులకు ఎంట్రీ ఇస్తారు‌. దాంతో శ్రీవల్లి షాక్ అవుతుంది. భాగ్యం, ఆనందరావు కూడా వస్తారు. వాళ్ళు ఏం జరిగిందో శ్రీవల్లికి చెప్తారు. వాళ్ళు చెప్పాల్సింది మొత్తం అబ్బాయి వాళ్ల నాన్నకి చెప్తారు కానీ అతనికి చెవులు వినిపించవు.. వాళ్ల అమ్మ కి చెప్పేలోపు అటువైపు గా ప్రేమ, ధీరజ్ వెళ్లడం చూసి మళ్ళీ చెప్పలేకపోయామని శ్రీవల్లికి భాగ్యం చెప్తుంది.