English | Telugu

నిన్న 'మందారం'.. నేడు 'తార‌'.. హిమ‌జ గ్యారేజ్‌లో మ‌రో కొత్త కారు!

బిగ్ బాస్ షో తరువాత చాలా మంది కంటెస్టెంట్లకు మంచి పేరొచ్చింది. వారిలో హిమజ ఒకరని చెప్పాలి. అప్పటివరకు పలు సీరియల్స్, సినిమాల్లో సైడ్ క్యారెక్టర్లు పోషించిన ఈ నటికి బిగ్ బాస్ షో మంచి క్రేజ్ ను తీసుకొచ్చింది. ఈ క్రేజ్ ను క్యాష్ చేసుకునే పనిలో పడింది హిమజ. తనకు వచ్చిన పాపులారిటీతో ఇటీవల ఓ యూట్యూబ్ ఛానెల్ ఓపెన్ చేసింది. బిగ్ బాస్ షో నుండి బయటకు వచ్చిన చాలా మంది కంటెస్టెంట్ లు యూట్యూబ్ ఛానెల్స్ ను ఓపెన్ చేశారు కానీ హిమజ ఛానెల్ కి రోజురోజుకి స‌బ్‌స్ర్కైబ‌ర్స్ బాగా పెరుగుతున్నారు.

హిమజ బ్రేక్ ఇవ్వకుండా సెలబ్రిటీలకు చెందిన వీడియోలతో పాటు, వంటలకు సంబంధించిన వీడియోలను పోస్ట్ చేస్తోంది. బిగ్ బాస్ షో నుండి బయటకు వచ్చిన తరువాత కొత్త ఇంటిని కొనుక్కున్న హిమజ కొద్ది రోజుల క్రితం బెంజ్ కారు కూడా కొనుక్కుంది. ఆ సమయంలో ఆమెని చాలా మంది లగ్జరీ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నామంటూ కామెంట్స్ చేయగా.. లోన్ తీసుకొని కారు కొన్నానని.. నెల నెలా ఈఎంఐ కట్టడానికి కష్టపడి పని చేస్తున్నానని హిమజ చెప్పింది.

ఇదిలా ఉంటే లేటెస్ట్‌గా హిమజ మరో కారు కొనుక్కుంది. దీనికి సంబంధించిన వీడియోను ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసింది. మహీంద్ర థార్‌ వాహనాన్ని సొంత చేసుకున్న హిమజ ఈ కారుకి 'తార' అనే పేరు కూడా పెట్టేసింది. ఈ పోస్ట్ చూసిన నెటిజన్లు ఆమెకి శుభాకాంక్షలు చెబుతున్నారు. ఈ కారు ధర రూ.13 నుండి రూ.15 లక్షల వరకు ఉంటుందని సమాచారం. మునుపు కొనుక్కున్న బెంజ్ కానీ, ఇప్పుడు కొన్న మ‌హీంద్ర థార్ కానీ రెడ్ క‌ల‌ర్‌వే. "ఐ ల‌వ్ రెడ్" అని చెప్తోంది హిమ‌జ‌.

Jayam serial : బాక్సింగ్ పోటీలో మిస్సెస్ గంగ రుద్ర ప్రతాప్.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -160 లో..... గంగని ఎలాగైనా అకాడమీ సెలక్షన్ కి వెళ్లకుండా ఆపాలని ఇషిక, వీరు ట్రై చేస్తారు కానీ గంగ, రుద్ర ఇద్దరు కలిసి ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసి అకాడమీకి వెళ్తారు. రుద్ర అకాడమీ బయటే ఉంటాడు. నాకు సంబంధించిన కేసు ఇంకా పెండింగ్ లో ఉంది అలా ఉండగా.. నేను లోపలకు రాకూడదని రుద్ర బయటే ఉండి గంగకి అంతా వివరిస్తాడు. నేను నీ పేరు మైక్ లో రావడం వినాలని రుద్ర అంటాడు. గంగ లోపలకు వెళ్తుంది. అక్కడ పారు ఇంకా తన ఫ్రెండ్స్ కలిసి గంగని చులకనగా మాట్లాడుతారు.

Brahmamudi : రుద్రాణిని రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన కనకం!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -922 లో.. ఒకతను వచ్చి రుద్రాణికి మళ్ళీ పసరు మందు ఇస్తాడు. ఆ పసరు మందు పని చేస్తుందా లేదా అని రుద్రాణి అతన్ని అడుగుతుంది. పని చేస్తుందని అతను చెప్తాడు. దాంతో రుద్రాణి పసరు మందు తీసుకొని లోపలికి వెళ్తుంటే అప్పుడే కనకం ఎదురుపడుతుంది. కనకాన్ని చూసి రుద్రాణి టెన్షన్ పడుతుంది. చేతిలో అదేంటీ అని కనకం అనగానే ఇదా.... నాకే పసరు మందు అజీర్తికి వాడమని చెప్పారని చెప్పి రుద్రాణి వెళ్ళిపోతుంది. అలా అయితే ఇంత రాత్రివేళ తీసుకొని వెళ్తుంది ఏంటని కనకంకి డౌట్ వస్తుంది.