English | Telugu

నన్ను మోసం చేశారు...నేను మా నాన్నగారిని చాలా మిస్ అయ్యాను

ఫ్యామిలీ స్టార్స్ లేటెస్ట్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఈ షోకి ఆమని, సింగర్ ఎస్పి చరణ్, కోర్ట్ మూవీ ఫేమ్ రోషన్ వచ్చారు. హోస్ట్ సుధీర్ ఆమనిని చూసి "మేడం మీరెందుకు ఇక్కడికి వచ్చారు" అని అడిగేసరికి "అరే నేను కొనడానికి వచ్చా" అని చెప్పింది. " మీరు సినిమాల్లో భర్తను అమ్మేస్తానంటారు ఇక్కడేమో నన్ను కొంటానంటున్నారు..ఏంటి మేడం ఇది" అని అడిగేసరికి "అంతే మరి..కొంటుంటాం..తీసుకుంటూ ఉంటాం" అని కౌంటర్ వేశారు. తర్వాత తన లైఫ్ లో జరిగిన ఒక ఇన్సిడెంట్ చెప్పి ఆమని కన్నీళ్లు పెట్టుకున్నారు. "తెలుగు ఇండస్ట్రీలో ఎంటర్ అవ్వకముందు తమిళ్ మూవీ కోసం వెళ్లాను. ఆ మూవీ ఇంకా త్రి డేస్ ఉంది. ఆ మూడు రోజులు చేస్తూ ఉండగా లాస్ట్ డే మా నాన్న గారు చనిపోయారు. నాన్నగారికి ఏదో సీరియస్ అని మీ బ్రదర్ ఫోన్ చేసి చెప్పారంటూ ఆ సినిమా టీమ్ వాళ్ళు చెప్పారు. నేను కూడా ఆ మాటల్ని నమ్మాను. ఎందుకంటే సినిమా క్లైమాక్స్ కదా లాస్ట్ డే కదా ఐపోతుంది కదా ఆ తరువాత వెళ్ళొచ్చులే అనుకున్నా.

ఐతే నేను సినిమా పూర్తి చేసి ఇంటికి వెళ్లేసరికి నాన్నగారు చనిపోవడం అన్ని కార్యక్రమాలు జరిగిపోవడం ఐపోయాయి. వాళ్ళ సెల్ఫ్ కోసం నన్ను అలా మోసం చేశారు. లైఫ్ లో మళ్ళీ మా నాన్న గారిని నేను చూడలేను. నేను మా నాన్నగారిని చాలా మిస్ అయ్యాను." అంటూ చిన్నపిల్లలా ఏడ్చేసింది ఆమని. తర్వాత ఎస్పీ చరణ్ తన లైఫ్ లో జరిగిన ఒక ఇన్సిడెంట్ ని చెప్పారు. "ఒక సారి నా కాలికి ఫ్రాక్చర్ అయ్యింది. చాలా విపరీతమైన పెయిన్, అమ్మ పక్కన పడుకున్నారు. ఆమె నా ఏడుపును, నొప్పిని కంట్రోల్ చేయలేకపోయారు. దాంతో ఆమె మా నాన్నకు ఫోన్ చేసి రమ్మని చెప్పారు. నాన్నగారు వచ్చి నన్ను సాముదాయించి పడుకోబెట్టారు. నేను ఆయనకు చాలా అవకాశాలు ఇచ్చాను నా మీద కోప్పడడానికి కానీ ఆయనలా చాలా సహనంగా ఉన్న వ్యక్తిని ఇంతవరకు నా జీవితంలో ఎవరినీ చూడలేదు" అని చెప్పారు.

Jayam serial : బాక్సింగ్ పోటీలో మిస్సెస్ గంగ రుద్ర ప్రతాప్.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -160 లో..... గంగని ఎలాగైనా అకాడమీ సెలక్షన్ కి వెళ్లకుండా ఆపాలని ఇషిక, వీరు ట్రై చేస్తారు కానీ గంగ, రుద్ర ఇద్దరు కలిసి ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసి అకాడమీకి వెళ్తారు. రుద్ర అకాడమీ బయటే ఉంటాడు. నాకు సంబంధించిన కేసు ఇంకా పెండింగ్ లో ఉంది అలా ఉండగా.. నేను లోపలకు రాకూడదని రుద్ర బయటే ఉండి గంగకి అంతా వివరిస్తాడు. నేను నీ పేరు మైక్ లో రావడం వినాలని రుద్ర అంటాడు. గంగ లోపలకు వెళ్తుంది. అక్కడ పారు ఇంకా తన ఫ్రెండ్స్ కలిసి గంగని చులకనగా మాట్లాడుతారు.

Brahmamudi : రుద్రాణిని రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన కనకం!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -922 లో.. ఒకతను వచ్చి రుద్రాణికి మళ్ళీ పసరు మందు ఇస్తాడు. ఆ పసరు మందు పని చేస్తుందా లేదా అని రుద్రాణి అతన్ని అడుగుతుంది. పని చేస్తుందని అతను చెప్తాడు. దాంతో రుద్రాణి పసరు మందు తీసుకొని లోపలికి వెళ్తుంటే అప్పుడే కనకం ఎదురుపడుతుంది. కనకాన్ని చూసి రుద్రాణి టెన్షన్ పడుతుంది. చేతిలో అదేంటీ అని కనకం అనగానే ఇదా.... నాకే పసరు మందు అజీర్తికి వాడమని చెప్పారని చెప్పి రుద్రాణి వెళ్ళిపోతుంది. అలా అయితే ఇంత రాత్రివేళ తీసుకొని వెళ్తుంది ఏంటని కనకంకి డౌట్ వస్తుంది.