English | Telugu
ప్యానిక్ అవకుండా ఇంటర్ ఎగ్జామ్స్ బాగా రాయండి అన్న రచ్చ రవి...
Updated : Feb 27, 2024
తెలంగాణలో ఇంటర్ పరీక్షలు మొదలయ్యాయి. పరీక్షలు అంటే చాలు చాలామంది వచ్చిన ప్రశ్నలనే చూసి, చదివిన పాఠాలే ఐనా రాయడానికి భయపడుతూ ఉంటారు. ఇలాంటి టైంలో స్టూడెంట్స్ కి మోటివేషన్ ఇస్తూ ఉంటారు చాలామంది. ఇప్పుడు కమెడియన్ రచ్చ రవి కూడా తన ఇన్స్టాగ్రామ్ పేజీ ద్వారా స్టూడెంట్స్ కి నాలుగు మంచి మాటలు చెప్పాడు. 'పరీక్ష అంటే ముందు టెన్షన్ పడొద్దు, ప్యానిక్ అవ్వొద్దు, మీరు గుర్తుపెట్టుకోవాల్సింది మీకు వచ్చే ప్రతీ ప్రశ్న ఏడాది నుంచి మీరు చూసిందే, చదివిందే. కాబట్టి ఎగ్జాంకి వెళ్లే ముందు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు లాస్ట్ నుంచి ఫస్ట్ వరకు ఒకసారి రివిజన్ లా చూసుకోండి. కూల్ గా ఎగ్జాంని అటెండ్ చేసి బాగా రాయాలి.. రాస్తారు కూడా..నాకు ఆ నమ్మకం ఉంది. ఎందుకంటే మీరు చదివిన లైసెన్స్ కదా.
మరొక్కసారి మీ అందరికీ ఆల్ ది బెస్ట్. బంగారు భవిష్యత్తు మీదే." అంటూ ఇంటర్ స్టూడెంట్స్ కి మంచి మోటివేషనల్ స్పీచ్ ఇచ్చాడు. ఐతే పిల్లల్ని పరీక్షలకు పంపే ముందు ఇంట్లో పేరెంట్స్ కూడా ఇన్ టైంలో తీసుకెళ్లడం మంచిది అని అలాగే జాగ్రత్తగా తీసుకెళ్లాలని నెటిజన్స్ కోరుతున్నారు. ఆఖరి నిమిషంలో హడావిడి చేసి స్పీడ్ గా వెళ్లొద్దు అని మెసేజ్ చేస్తున్నారు. పిల్లల్ని మరీ టెన్షన్ పడకుండా బాగా రాయాలి రాంక్ రావాలి అంటూ మరీ స్ట్రెస్ పెట్టకుండా చూసుకోవాలి పేరెంట్స్ అంటున్నారు ...అసలే ఎండలు అదిరిపోతున్నాయి. ఇలాంటి టైంలో ఒక పక్కన ఉక్క మరో పక్క పరీక్ష కాబట్టి వాళ్ళను మరీ ఇబ్బంది పెట్టకుండా ఎగ్జాం సెంటర్స్ దగ్గర కూల్ గా వదిలి రావడం ముఖ్యం అని తెలుసుకోవాలి అంటూ నెటిజన్స్ కూడా పేరెంట్స్ కి టిప్స్ ఇస్తున్నారు.