English | Telugu

నిఖిల్ ఇచ్చిన పార్టీలో మెరిసిన సెలెబ్స్!

యూట్యూబర్ గా నిఖిల్ విజయేంద్రసింహ గురించి తెలియని వారంటూ ఎవరూ లేరు. యాంకర్ గా, యాక్టర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. సోషల్ మీడియా ఇన్ఫ్లు ఎన్సర్ గా కూడా ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నాడు. అతను చేసే ఇంటర్వ్యూలు కూడా ఎంతో ఇంటరెస్టింగ్ గా ఉంటాయి.

టాలీవుడ్ నుంచి బుల్లితెర నుంచి ఎంతోమంది సెలబ్రిటీలను నిఖిల్ ఇంటర్వ్యూలు చేశాడు. కొన్ని ఇంటర్వ్యూలు ఫన్నీగా ఉంటాయి ఇంకొన్ని మాత్రం గాసిప్స్ గా మారుతూ ఉంటాయి. సోషల్ మీడియా, యూట్యూబ్ ఫేస్ బుక్ ఇలా అన్ని సామాజిక మాధ్యమాల్లో సెలబ్రిటీలను అడగాలనుకుని అడగలేకపోయిన ఎన్నో ప్రశ్నలను నిఖిల్ సరదాగా నవ్వుతూ అడిగేస్తూ ఉంటాడు. అలా నిఖిల్ ఎంతో బుల్లి తెర సెలబ్రిటీస్ ని ఎంటర్టైన్ చేస్తూ ఉంటాడు.

క్రిస్మస్ పండగ సందర్భంగా నిఖిల్ తన ఇంట్లో ఒక పార్టీ ఏర్పాటు చేసి స్మాల్ , బిగ్ స్క్రీన్ సెలెబ్స్ ను ఇన్వైట్ చేసాడు. దానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలను నిఖిల్ తన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేశాడు. నిఖిల్ ఇచ్చిన పార్టీలో మంచు లక్ష్మి, ప్రగతి, రాజ్ తరుణ్, హంసానందిని, రాజశేఖర్ కుమార్తెలు, యాంకర్ అనసూయ, యాంకర్ ప్రదీప్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలబడ్డారు.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.