English | Telugu

చారుశీలగా నటిస్తున్న సౌజన్య ఎవరో తెలుసా ?

కార్తీక దీపం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంత పేరు తెచ్చుకుందో అందరికీ తెలుసు. ఐతే ఈ సీరియల్ లో ప్రస్తుతం మెయిన్ విలన్ రోల్ లో చేస్తున్న మోనితని తప్పించి చారుశీల పాత్రను ఇంట్రడ్యూస్ చేశారు. ఐతే ఈమె గురించిన కొన్ని విషయాలు తెలుసుకుందాం.

ఇప్పుడు మోనిత ప్లేస్ మెయిన్ రోల్ విలన్ గా డాక్టర్ చారుశీలగా నటిస్తోంది. ఈమె అసలు పేరు సౌజన్య. అక్కమొగుడు, బంగారు పంజరం సీరియల్స్ లో నటించింది. ఈమె సిస్టర్స్ శిరీష, హరిత కూడా సీరియల్స్ లో నటిస్తున్నారు. ఈమె సొంత ఊరు తెలంగాణ రాష్ట్రం సిరిసిల్ల. చిన్నప్పటి నుంచి డాన్స్, యాక్టింగ్ అంటే ఇంటరెస్ట్ కారణంగా ఈమె సీరియల్స్ లోకి ఎంట్రీ ఇచ్చింది. సౌజన్య కూడా వరుస సీరియల్స్ లో నటించి మంచి పేరు సంపాదించుకుంది. "మెట్టినిల్లు" అనే వెబ్ సిరీస్ లో నటించింది. "బావ మరదలు" "ఈ జన్మ నీకే" అనే మూవీస్ లో నటించింది సౌజన్య. ఇప్పుడు కార్తీకదీపంలో విలన్ గా ఎంట్రీ ఇచ్చింది. కార్తీక్-దీపకి సపోర్ట్ చేస్తున్నట్టుగా నటిస్తున్న చారుశీల ఇప్పుడు తనలో ఉన్న మరో యాంగిల్ ని బయటపెట్టింది. మోనిత తనను చదివించింది కాబట్టి ఆమె కోరిక ప్రకారం డాక్టర్ బాబు, వంటలక్కను శాశ్వతంగా విడగొట్టడమే తన పని అని..అందుకే దీపకు లేని రోగం అంటగట్టానని చెప్పింది.

అయితే ఇప్పుడు రూటుమార్చి...దీపను చంపేయడమే కాదు..ఆస్తి కోసం కార్తీక్ ను పెళ్లి చేసుకోవడం కోసం స్కెచ్ వేస్తోంది. కానీ ఆడియన్స్ కి మాత్రం చారుశీల క్యారెక్టర్ పెద్దగా నచ్చినట్లు కనిపించలేదు. మరి ఈ క్యారెక్టర్ ని కంటిన్యూ చేస్తారా లేదా స్టోరీలో చేంజెస్ చేసి మోనిత క్యారెక్టర్ ని తిరిగి ప్రవేశపెడతారా అనే విషయం ప్రస్తుతానికి సస్పెన్స్..

Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.

Illu illalu pillalu : అమూల్యకి పెళ్ళిచూపులు.. కామాక్షి ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -362 లో.. పెళ్లిచూపులకి ఇంకా రావడం లేదని రామరాజు వాళ్ళు ఎదురుచూస్తుంటే వాళ్ళు రారుగా అని శ్రీవల్లి మనసులో అనుకుంటుంది. అప్పుడే అబ్బాయి వాళ్ళు పెళ్లిచూపులకు ఎంట్రీ ఇస్తారు‌. దాంతో శ్రీవల్లి షాక్ అవుతుంది. భాగ్యం, ఆనందరావు కూడా వస్తారు. వాళ్ళు ఏం జరిగిందో శ్రీవల్లికి చెప్తారు. వాళ్ళు చెప్పాల్సింది మొత్తం అబ్బాయి వాళ్ల నాన్నకి చెప్తారు కానీ అతనికి చెవులు వినిపించవు.. వాళ్ల అమ్మ కి చెప్పేలోపు అటువైపు గా ప్రేమ, ధీరజ్ వెళ్లడం చూసి మళ్ళీ చెప్పలేకపోయామని శ్రీవల్లికి భాగ్యం చెప్తుంది.