English | Telugu

Jayam serial: ఫుడ్ ఫెస్టివల్ కి రుద్ర.. రానని చెప్పేసిన గంగ!

జీ తెలుగు లో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -143 లో..... గంగని తీసుకొని రమ్మని ఇంట్లో డిస్కషన్ చేస్తుంటారు. వద్దని శకుంతల అంటుంది. తీసుకొని వస్తానని పెద్దసారు అంటాడు. ఎక్కడ డిస్కషన్ పెద్దగా అయి గంగని తీసుకొని వస్తారోనని వీరు టాపిక్ డైవర్ట్ చేస్తాడు. ఫుడ్ ఫెస్టివల్ కి మనం వెళ్ళాలి అని అంటాడు. నేను అదే అందామని అనుకుంటున్నానని రుద్ర అంటాడు. సరే నువ్వు దాని గురించి చూసుకోమని వీరుకి రుద్ర చెప్తాడు.

ఆ తర్వాత ఫుడ్ ఫెస్టివల్ కి సంబంధించినది నువ్వు చూసుకోమని రుద్రతో పెద్దసారు అంటాడు. సరే అని రుద్ర అంటాడు. అదేంటి వీరు చూసుకుంటానని అన్నాడు కదా అని శకుంతల అనగానే.. ఎవరు చూసుకుంటే ఏంటి.. కావాలంటే రుద్రకి అసిస్టెంట్ గా వీరు ఉంటాడని పెద్దసారు అంటాడు. ప్రీతీ మనం గంగ దగ్గరికి వెళ్దామని పెద్దసారు అంటాడు. ఆ తర్వాత ప్రీతీ, ప్రమీల, పెద్దసారు ముగ్గురు కలిసి గంగ దగ్గరికి వెళ్తారు. గంగని రమ్మని రిక్వెస్ట్ చేస్తారు. నేను రాను నేను ఏ తప్పు చెయ్యలేదు.. అది ఆయన నమ్మి, నన్ను తీసుకొని వెళ్ళాలని గంగ వాళ్ళని తిరిగి పంపిస్తుంది. ఆ తర్వాత గంగ తన తల్లికి వైద్యం చేయించడం కోసం డబ్బులు కోసం పని చూసుకుంటుంది. తను గతం లో చేసిన సిలిండర్ డెలివరీ చేసిన దగ్గరికి వెళ్లి పని కావాలని అడుగుతుంది. నువ్వు పెద్దింటి కోడలివి.. నువ్వు నా దగ్గర పని చేస్తే నాకు మాట వస్తుందని అతను అంటాడు. అప్పడే శ్రీను వచ్చి గంగని తీసుకొని వెళ్తాడు.

ఆ తర్వాత పెద్దసారు కోపంగా ఇంటికి వస్తాడు. ఏమైందని శకుంతల అడుగగా.. గంగ ఇంటికి రానని చెప్పిందని ప్రీతీ చెప్తుంది. ఆ తర్వాత పెద్దసారు, రుద్ర దగ్గరికి వెళ్తాడు. నువ్వు గంగని తీసుకొనిరా.. తనేం తప్పు చెయ్యలేదని పెద్దసారు కోప్పడుతాడు. నేను తీసుకొని వస్తాను కానీ నేను ఈ ఇంట్లో ఉండనని రుద్ర అనగానే అందరు షాక్ అవుతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Brahmamudi: రాహుల్ మనిషిని పట్టుకున్న రాజ్, కావ్య.. ఇక దేత్తడి!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -905 లో....అప్పు పాప కేసు ఫైల్ చూస్తుంటే ఆఫీసర్ వస్తాడు. నీకు ఎన్నిసార్లు చెప్పాను వద్దని అయినా అలాగే చేస్తున్నావని కోప్పడతాడు. లేదు సర్ పాప చనిపోలేదు.. చనిపోయిన పాప వేరు.. ఆ పాప DNA తో మ్యాచ్ అవ్వడం లేదని రిపోర్ట్స్ చూపించగానే అవునా కేసులో ఒక కొత్త మలుపు తీసుకొని వచ్చావ్ గుడ్ కేరియాన్ అని ఆఫీసర్ అంటాడు. కాసేపటికి రేపు పాప వాళ్ళ ఫాదర్ ని స్టేషన్ కి రప్పించండి అని కానిస్టేబుల్ తో అప్పు చెప్తుంది. మరొకవైపు రాహుల్ అవార్డు ఫంక్షన్ కి రాజ్, కావ్య వెళ్తారు. అక్కడ రాహుల్ డిజైన్స్ చూసి రాజ్, కావ్య షాక్ అవుతారు.

Karthika Deepam2: జ్యోత్స్న చేసిన ఫ్రాడ్ చూసి కార్తీక్, శ్రీధర్ షాక్.. ఇంటి వారసురాలు కాదేమో!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -542 లో..... కార్తీక్, శ్రీధర్ జ్యోత్స్న రెస్టారెంట్ ఫుడ్ ట్రక్స్ బాగా పాపులర్ అయ్యాయని హ్యాపీగా ఉంటారు. ఇద్దరు బయట టీ తాగుతూ కబుర్లు చెప్పుకుంటారు. జ్యోత్స్న చాలా తప్పు డు లెక్కలు చూపించిందని శ్రీధర్ అనగానే ఎంత మొన్న కొన్న ల్యాండ్ గురించా అని  కార్తీక్ అడుగుతాడు. లేదు అది జస్ట్ శాంపిల్ మాత్రమే.... ఎంత అంటే అది చెప్తే శివన్నారాయణ గుండె పట్టుకొని పడిపోయేంత డబ్బులు ఫ్రాడ్ చేసిందని శ్రీధర్ అనగానే కార్తీక్ షాక్ అవుతాడు.