English | Telugu

ఆమ్లెట్ టీ షర్ట్ తో వేణు స్వామి రీల్..మీలో ఈ యాంగిల్ కూడా ఉందా!

ఆమ్లెట్ టీషర్ట్ తో సోషల్ మీడియాలో తెగ వైరల్ ఐపోయాడు వేణు స్వామి. ఐతే వేణు స్వామి కూడా రీల్స్ కి వ్యతిరేకం కాదు అని తెలుస్తోంది. సోషల్ మీడియాలో స్టార్స్ కి జ్యోతిష్యం చెప్తూ అప్పుడప్పుడు సెలెబ్రిటీస్ ఇళ్లల్లో పూజలు చేస్తూ వేణు స్వామి బాగా ఫేమస్ అయ్యాడు. ఆయనతో పూజలు చేయించుకోవడానికి చాలామంది క్యూలు కడుతున్నారు కూడా. ఇప్పుడు అలాంటి ఒక వీడియోతో ఫుల్ వైరల్ గా మారాడు. జ్యోతిష్యం దెప్పడంలో నోరు తిరగడమే కాదు ఇప్పుడు రీల్స్ లో కూడా ఆయన క్రేజ్ అలా టర్న్ ఐపోయింది.

వీణాశ్రీవాణి -వేణు స్వామి ఇద్దరూ కలిసి ప్రభాస్ నటించిన మిర్చి మూవీలో ఒక ఫేమస్ డైలాగ్ కి రీల్ చేసారు. "ఇట్లాంటి అమ్మాయే కావాలని కోరికలు ఉన్నాయా" అనే అనుష్క డైలాగ్ ని వీళ్ళిద్దరూ కలిసి చేసి చూపించారు. ఇక నెటిజన్స్ ఐతే తిట్టేవాళ్ళు తిడుతున్నారు..పొగిడేవాళ్లు పొగుడుతున్నారు. "మిర్చి 2 , ఈ కళలు ఉన్నాయా మీలో దొర, ఎన్ని రోజులు అయింది ఇలా మీ ఇద్దరినీ చూసి, మంచి యాక్టర్ దొరికేసాడు సూపర్ అండి, అప్పుడప్పుడూ ఇలా ఉల్లాసంగా ఉత్సాహంగా కూడా ఉండాలి, ప్రభాస్ ను డామినేట్ చేస్తున్నాడు, వేణు స్వామి గారు షష్టిపూర్తి ఎప్పుడు, గురుగారిలో ఈ యాంగిల్ కూడా ఉందా" అని అంటున్నారు. వేణు స్వామి యాక్టర్ ఏమీ తక్కువ కాదు అని ఈ రీల్ ద్వారా తెలుస్తోంది. ఇప్పటికే కుమారి ఆంటీ బుల్లితెర మీద సీరియల్స్ లో ఈవెంట్స్ లో మెరిసింది. ఇక వేణు స్వామికి ఎలాగో ఇండస్ట్రీతో బాగా టచ్ ఉంది. ఏమో రేపు సీరియల్స్ లో ఆయన కోసం డైరెక్టర్స్ క్యారెక్టర్స్ కూడా సృష్టించవచ్చేమో...చూడాలి. అష్షురెడ్డి వేణుస్వామితో చాలా సార్లు పూజలు కూడా చేయించుకుంది.

Jayam serial : బాక్సింగ్ పోటీలో మిస్సెస్ గంగ రుద్ర ప్రతాప్.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -160 లో..... గంగని ఎలాగైనా అకాడమీ సెలక్షన్ కి వెళ్లకుండా ఆపాలని ఇషిక, వీరు ట్రై చేస్తారు కానీ గంగ, రుద్ర ఇద్దరు కలిసి ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసి అకాడమీకి వెళ్తారు. రుద్ర అకాడమీ బయటే ఉంటాడు. నాకు సంబంధించిన కేసు ఇంకా పెండింగ్ లో ఉంది అలా ఉండగా.. నేను లోపలకు రాకూడదని రుద్ర బయటే ఉండి గంగకి అంతా వివరిస్తాడు. నేను నీ పేరు మైక్ లో రావడం వినాలని రుద్ర అంటాడు. గంగ లోపలకు వెళ్తుంది. అక్కడ పారు ఇంకా తన ఫ్రెండ్స్ కలిసి గంగని చులకనగా మాట్లాడుతారు.

Brahmamudi : రుద్రాణిని రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన కనకం!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -922 లో.. ఒకతను వచ్చి రుద్రాణికి మళ్ళీ పసరు మందు ఇస్తాడు. ఆ పసరు మందు పని చేస్తుందా లేదా అని రుద్రాణి అతన్ని అడుగుతుంది. పని చేస్తుందని అతను చెప్తాడు. దాంతో రుద్రాణి పసరు మందు తీసుకొని లోపలికి వెళ్తుంటే అప్పుడే కనకం ఎదురుపడుతుంది. కనకాన్ని చూసి రుద్రాణి టెన్షన్ పడుతుంది. చేతిలో అదేంటీ అని కనకం అనగానే ఇదా.... నాకే పసరు మందు అజీర్తికి వాడమని చెప్పారని చెప్పి రుద్రాణి వెళ్ళిపోతుంది. అలా అయితే ఇంత రాత్రివేళ తీసుకొని వెళ్తుంది ఏంటని కనకంకి డౌట్ వస్తుంది.