English | Telugu

Jayam serial : ఇషికకి చెంపదెబ్బ.. గంగ, రుద్రలని వెంబడిస్తున్న వీరు!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -172 లో.... గంగ పెట్టిన డబ్బు కనిపించడం లేదని ఇంట్లో వాళ్లకు చెప్తుంది. జాగ్రత్తగా పెట్టాల్సిన డబ్బు అలా నెగ్లెట్ చేస్తే ఎలా అని ఇషిక అంటుంది. నేను అంత వెతికానని గంగ అంటుంది. అయితే మీ అమ్మ వాళ్ల బ్యాగ్ చూడాల్సిందేనని ఇషిక అనగానే వద్దని పెద్దసారు కోప్పడుతాడు. ఇషిక నువ్వు వెళ్లి చూడమని శకుంతల అంటుంది. ఇషిక చూడబోతుంటే.. ఆగు ఇషిక అని రుద్ర ఎంట్రీ ఇస్తాడు. నాకు అవసరం ఉండి నేనే డబ్బు తీసుకున్నానని రుద్ర అనగానే ఇషిక షాక్ అవుతుంది.

వచ్చిన ప్రతిసారీ ఇలాగే అవమానం జరుగుతుందని అనుకొని పైడిరాజు, లక్ష్మీ వెళ్ళిపోతారు. అనవసరంగా వాళ్ళని తప్పుగా అర్థం చేసుకున్నామని శకుంతలతో పెద్దసారు అంటాడు. అవసరం బట్టి చెయ్యాల్సి ఉంటుందని శకుంతల అంటుంది. ఆ తర్వాత నేను తీసిన డబ్బు రుద్ర బావ తీసాడని అంటున్నాడు ఏంటని ఇషిక మనసులో అనుకుంటుంది. అప్పుడే ఇషిక దగ్గరికి సూర్య వచ్చి.. నువ్వు దొంగతనం చేసిన డబ్బు ఎక్కడికి పోయిందని అనుకుంటున్నావా అని సూర్య అడుగుతాడు. దొంగతనం ఏంటని ఇషిక అనగానే.. రాత్రి నువ్వు డబ్బు తీసి వాళ్ళ బ్యాగ్ లో వెయ్యడం..నేను చూసానని ఇషిక చెంపచెల్లుమనిపిస్తాడు సూర్య. అసలు నీ ప్రాబ్లమ్ ఏంటని సూర్య అనగానే బస్తీ అమ్మాయి నాకు సమానంగా ఉండడం ఇష్టం లేదని ఇషిక అంటుంది. నువ్వు డబ్బు తీసినట్లు అన్నయ్యకి చెప్తే ఏం అన్నాడో తెలుసా.. ఏదో జెలస్ ఫీల్ తో చేసినట్లు ఉంది సర్ది చెప్పు అన్నాడని ఇషికకి సూర్య వార్నింగ్ ఇస్తాడు.

మరొకవైపు లక్ష్మి వాళ్ళు వెళ్తుంటే.. విభూది బాబా గురించి తెలుస్తుంది. వాళ్ళు అక్కడికి వెళ్లి గంగ గురించి అడుగుతారు. మనిషి వస్తేనే చెప్తానని విభూది బాబా అనగానే గంగకి ఫోన్ చేస్తుంది లక్ష్మీ. ఇక విభూది బాబా గురించి గంగకి చెప్తుంది. విభూది బాబా వారు ఏ సమస్య ఉన్నా పరిష్కారం చూపిస్తారు అంట.. మీ అత్తయ్యకి నీపై కోపం పోయి మంచిగా ఉండేలా పరిష్కారం చెప్తారని లక్ష్మీ అనగానే గంగ సరే అంటుంది. అదే విషయం రుద్రతో గంగ చెప్తుంది. మొదట వద్దన్నా గంగ అలిగిందని వెళదామని రుద్ర అంటాడు. ఆ మాటలు వీరు విని.. వాళ్ళని ఫాలో అవుతారు. ఇక దారి మధ్యలో గంగ, రుద్ర ఐస్ క్రీమ్ షాప్ దగ్గర ఆగి ఐస్ క్రీమ్ తింటు ఉంటారు. అది చూసి వీరు.. వీళ్ళేంటి ఇక్కడ ఆగి ఐస్ క్రీం తింటున్నారని అనుకుంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

ట్రెండింగ్ లో కావ్య, సుధీర్ జోడి.. మల్టీ టాలెంటెడ్ మెజీషియన్ తో వివాహ యోగం

ఆట గ్రాండ్ లాంఛ్ ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. ఇక ఈ షోలో ఉన్న కావ్య మీద సుధీర్, సుధీర్ మీద నిహారిక ఫుల్ సెటైర్స్ వేసుకున్నారు. "మీ గురించి రికమెండ్ చేసి మరీ తీసుకొచ్చాను. ఎలాగున్నా నాకు మంచి పేరు తేవాలి" అన్నాడు. దాంతో కావ్య ఏమీ తెలీనట్టు నవ్వింది. ఆమెను చూసి జానీ మాష్టర్ నవ్వాడు. ఇక సుధీర్ ఆమె గురించి ఒక పెద్ద బయోడేటా లిస్ట్ రాసుకొచ్చాడు. "పేరు కావ్యశ్రీ, ముద్దుపేరు నడిచే తాజ్ మహల్, ఎగిరే ఎల్లోరా, కదిలే కాశ్మీర్" అన్నాడు. వెంటనే నిహారిక "అవన్నీ హనీమూన్ డెస్టినేషన్స్" అనేసరికి సుధీర్ షాకయ్యాడు. 

Brahmamudi : మినిస్టర్ కి ఎదురుతిరిగిన కావ్య.. రాజ్ ఏం చేయనున్నాడు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -943 లో..... కావ్య తన కూతురు మినిస్టర్ దగ్గర ఉందని తెలిసి వెంటనే అక్కడికి వెళ్లి మినిస్టర్ తో గొడవపడుతుంది. నా బిడ్డని నాకెందుకు దూరం చేశారని కావ్య అడుగుతుంది. ఓహ్ నిజం తెలిసిపోయిందా నా బిడ్డ అనారోగ్యంగా ఉందని నా భార్యకి తెలిస్తే తట్టుకోలేదు అందుకే బిడ్డని మార్చేసాను.. అయిన నీ బిడ్డ అనడానికి నీ దగ్గర ఏమైనా సాక్ష్యం ఉందా.. లేదు కదా.. నీ బిడ్డని నీకు ఇచ్చే ప్రసక్తే లేదని కావ్యతో మినిస్టర్ అంటాడు. నా బిడ్డని పదిహేను రోజుల్లో నా దగ్గరికి చేర్చుకుంటానని మినిస్టర్ కి కావ్య వార్నింగ్ ఇస్తుంది.