English | Telugu

రాత్రి 12 నుంచి న్యూ జర్నీ.. రిషిని హగ్ చేసుకున్న వసుధార!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -722 లో... రిషి, వసుధారలు కాలేజీలో తమ ప్రేమ గురించి మాట్లాడుకుంటారు. "నాకు పాత రోజులు కావాలి.. నీలో ఉన్న స్వచ్ఛమైన ప్రేమ, దాపరికాలు లేని ప్రేమ కావాలి" అని వసుధారతో రిషి అంటాడు. "మనం పాత రిషి సర్, వసుధారలు అయిపోదామా.. మన ప్రేమ, మన పరిచయం మళ్ళీ మొదలుపెడదాం. అప్పుడైనా మనం సంతోషంగా ఉంటామేమో" అని వసు అంటుంది. "బాగానే ఉంది కాని మన చుట్టూ మనల్ని చూసేవాళ్ళు ఏమనుకుంటారు.. మనల్ని అంగీకరిస్తారా" అని రిషి అంటాడు. మనం మన జర్నీని మళ్ళీ మనకోసం మొదలు పెడదాం అనుకున్నాం.. వేరే వాళ్ళ కోసం కాదని వసుధార అంటుంది. మీరు నా పాత ఎండీలాగా మారాలి అని చెప్తుంది. మన జర్నీ ఈ రాత్రి 12 గంటల నుండి మొదలు పెట్టాలని రిషి, వసుధారలు ఒక ఒప్పందానికి వస్తారు.

మరోవైపు జగతి, మహేంద్రలు కలిసి.. రిషి మన కాలేజీ పరువు కాపాడాడు. నిజంగా రిషి గ్రేట్ అంటూ ఫణీంధ్ర, దేవయానిలకు కాలేజీలో జరిగిన విషయాలు మొత్తం చెప్తారు. అంతలోనే రిషి, వసుధార ఇద్దరు కలిసి వస్తారు. "రిషి నువ్వు ఆ పేపర్స్ గురించి చాలా కష్టపడ్డావంట కదా. నాకు తెలుసు నాన్న, నువ్వు కాలేజీ కోసం ఏమైనా చేస్తావని.. అందరూ నీ గురించి గొప్పగా పొగుడుతుంటే హ్యాపీగా ఉంది నాన్న" అని దేవాయని అంటుంది. ఈ గొప్పతనం నాది కాదు వసుధారది.. తను కూడా చాలా కష్టపడిందని రిషి చెప్తాడు. సర్ నేను చేసిందేమీ లేదు.. అంత మీరే చేశారని వసుధార అనగానే.. ఎవరు గొప్పతనం ఒప్పుకోరు కదా అని ఫణింధ్ర అంటాడు. రిషి అలా వసుధారని పొగడటం దేవయానికి నచ్చదు.. దాంతో అక్కడ నుండి వెళ్ళిపోతుంది.

రిషి తన‌ గదిలో, వసుధార తన గదిలో ఉండి ఒకరి గురించి ఒకరు ఆలోచిస్తుంటారు. 12 ఎప్పుడు అవుతుందా, న్యూ జర్నీ ఎప్పుడు మొదలు పెడదామా అన్నట్లుగా ఇద్దరు చూస్తారు. పన్నెండు అవడంతోనే ఇద్దరు ఒకేసారి హాల్లోకి వచ్చి కాసేపు సరదాగా మాట్లాడుకుంటారు. ఉదయం తొమ్మిది నుండి రాత్రి ఏడు వరకు పాత రిషీ వసుధారలం.. మిగతా టైంలో మాములుగా ఉందామని రిషి అంటాడు. వసుధార సరే అంటుంది. బెస్టాఫ్ లక్ అని ఇద్దరు చెప్పుకొని, రిషి వెళ్ళిపోతుండగా.. వసుధార వెనకాల నుండి వచ్చి రిషిని హగ్ చేసుకుంటుంది. ఇదేంటని రిషి అడగగా.. ప్రేమ సర్ అని వసుధార అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.

Illu illalu pillalu : అమూల్యకి పెళ్ళిచూపులు.. కామాక్షి ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -362 లో.. పెళ్లిచూపులకి ఇంకా రావడం లేదని రామరాజు వాళ్ళు ఎదురుచూస్తుంటే వాళ్ళు రారుగా అని శ్రీవల్లి మనసులో అనుకుంటుంది. అప్పుడే అబ్బాయి వాళ్ళు పెళ్లిచూపులకు ఎంట్రీ ఇస్తారు‌. దాంతో శ్రీవల్లి షాక్ అవుతుంది. భాగ్యం, ఆనందరావు కూడా వస్తారు. వాళ్ళు ఏం జరిగిందో శ్రీవల్లికి చెప్తారు. వాళ్ళు చెప్పాల్సింది మొత్తం అబ్బాయి వాళ్ల నాన్నకి చెప్తారు కానీ అతనికి చెవులు వినిపించవు.. వాళ్ల అమ్మ కి చెప్పేలోపు అటువైపు గా ప్రేమ, ధీరజ్ వెళ్లడం చూసి మళ్ళీ చెప్పలేకపోయామని శ్రీవల్లికి భాగ్యం చెప్తుంది.