Read more!

English | Telugu

సముద్రం ఒడ్డున సుప్రీత.. వీడియో వైరల్!

సుప్రీత.. సురేఖావాణి కూతురిగా సోషల్ మీడియాలో అందరికీ పరిచయమే. సోషల్ మీడియాలో ఈమె చేసే హడావిడి అంతా ఇంతా కాదు. రీల్స్‌, ఫన్నీ వీడియోస్‌తో మస్త్ ఫేమస్‌ అయ్యింది. రీసెంట్‌గా ఒక ఇంటర్వ్యూలో తన తల్లికి మళ్లీ పెళ్లి చేసేస్తాననడం, ఎవరో ఒక పర్సన్ కూడా రెడీగా ఉన్నారంటూ సుప్రీత చేసిన వ్యాఖ్యలు వైరల్‌ కూడా అయ్యాయి. సుప్రీత సోషల్‌ మీడియాలో తన ఫాంగ్స్‌తో రెగ్యులర్‌గా టచ్‌లో ఉంటుంది.  

ఇప్పుడు లేటెస్ట్‌గా తన ఇన్‌స్టాగ్రామ్‌ పేజ్‌లో ఓ రీల్‌ షేర్‌ చేసింది. సముద్రం ఒడ్డున మెట్లపై నిలబడి ఉన్న ఒక వీడియోను తన ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసింది. నవ్వుతూ పాటకు తగ్గ ఎక్స్‌ప్రెషన్స్ ఇస్తూ ఈ వీడియో చేసింది. ఇప్పటివరకు షార్ట్ ఫిలిమ్స్, ప్రైవేట్ ఆల్బమ్స్‌తో పాపులరైన సుప్రీత వెండితెర మీద మెరవడానికి సిద్ధంగా ఉంది. కార్తీక్-అర్జున్ డ్యూయల్ కాంబినేషన్‌లో డైరెక్ట్ చేసిన "లేచింది మహిళా లోకం" అనే మూవీలో మంచు లక్ష్మితో కలిసి నటించి అందరినీ మెప్పించింది.