Read more!

English | Telugu

వాళ్ళ మనసుల్లో ఉన్న వాళ్ళ పేర్లు ఇవే... షకీలా, సన్నీలియోన్, ఖత్తర్ పాప

శ్రీదేవి డ్రామా కంపెనీ ఈ వారం ఫుల్ ఎంటర్టైన్ చేసేసింది. ఇక ఇందులో ఈ వారం "చదివింపులు" పేరుతో ఈ షో రన్ అయ్యింది. ఇందులో "మనసులో మాట..మనసులో బొమ్మ" సెగ్మెంట్ లో కమెడియన్స్ అంతా స్టేజి మీదకు వచ్చి పొగ వేశారు. అలా వేసినప్పుడు పక్కన ఎల్ఈడీ స్క్రీన్ మీద వాళ్ళ మనసులో ఎవరైతే ఉన్నారో వాళ్ళ పిక్చర్స్ కనిపించాయి. ఇక ఈ సెగ్మెంట్ ఫుల్ కామెడీని పండించింది. మధ్యలో ఆది సెటైర్లు, కమెడియన్ లండన్ బాబు డైలాగ్స్ అదిరిపోయాయి.

ఇక ముందుగా  హైపర్ ఆది పొగ వేసాడు. స్క్రీన్ మీద ఖత్తర్ పాప బొమ్మ కనిపించింది. ఇక ఆమె కోసం బులెట్ భాస్కర్‌కు ఫోన్ కూడా చేసాడు. కానీ కలవలేదు. తర్వాత నాటీ నరేష్ పొగ వేసాడు. స్క్రీన్ మీద దొండకాయ పిక్చర్ వచ్చింది. ఇమ్మానుయేల్ పొగ వేయడంతో టిక్ టాక్ భాను, వర్ష ఇద్దరూ స్క్రీన్ మీద కనిపించారు. దాంతో ఇమ్ము ఒక నిమిషం  షాకయ్యాడు. "అసలు వీళ్ళిద్దరూ నా లిస్ట్ లో లేరు కదా. వర్ష అంటే ఒక మూల పడుంటుంది..కానీ భాను ఎందుకొచ్చింది" అని డైలాగ్స్ వేసాడు. తాగుబోతు రమేష్ స్టేజి మీదకు వచ్చి పొగ వేసేసరికి స్క్రీన్ మీద షకీలా బొమ్మ పడింది. దాంతో రమేష్ షాకయ్యాడు. ఇంతలో ఆది ఎంట్రీ ఇచ్చి "తెలుగు ఇండస్ట్రీ నుంచి మలయాళం ఇండస్ట్రీకి వెళ్ళిపోతున్నట్టు చాలా సార్లు చెప్పాడు ఇందుకా" అని కౌంటర్ వేసాడు.

ఇక కమెడియన్ సన్నీ పొగ వేసేసరికి స్క్రీన్ మీద సన్నీలియోన్ బొమ్మ వచ్చింది. అది చూసిన ఆది వచ్చి "యూట్యూబ్ లో జబర్దస్త్ సన్నీ అని కొట్టగానే నీ స్కిట్లు, బిట్లు రెండూ కనిపిస్తున్నాయి" అని పంచ్ డైలాగ్ వేసాడు. ఇక రష్మీ పొగ వేసేసరికి స్క్రీన్ మీద యాంకర్ సౌమ్య రావు బొమ్మ పడింది. "సౌమ్యకి హార్టీ వెల్కమ్..జబర్దస్త్ లో చాలా పాజిటివ్ రెస్పాన్స్ ఉంది..కానీ ఎప్పుడైనా జబర్దస్త్ కి నా అవసరం ఉంటే స్టాండ్ బైగా ఎప్పుడూ ఉంటాను" అని చెప్పింది. ఇలా ఈ సెగ్మెంట్ ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేసింది.