English | Telugu

చపాతీ విత్ ఐస్ క్యూబ్స్..గులాబ్ జామున్ విత్ పప్పు..కిచెన్ థీమ్ లో సూపర్ క్వీన్స్


సూపర్ క్వీన్ షో ప్రతీ వారం వెరైటీ కాన్సెప్ట్స్ చేస్తూ ఆడియన్స్ ని బాగా అట్ట్రాక్ట్ చేస్తోంది . లాస్ట్ వీక్ సూపర్ క్వీన్స్ కాస్తా సూపర్ కింగ్స్ లా వచ్చారు. ఇక నెక్స్ట్ వీక్ ఈ సూపర్ క్వీన్స్ అంతా "కిచెన్ థీమ్" రౌండ్ లో పార్టిసిపేట్ చేయబోతున్నారు. దీనికి సంబంధించిన ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. ఇందులో వంటలు చూస్తే వాటిని అస్సలు తినబుద్దే కాదు..అలాంటి వెరైటీస్ చేసేసరికి హోస్ట్ ప్రదీప్ కూడా షాకయ్యాడు. "అయ్యయ్యో ..నేను ఏం చూడకూడదు అనుకున్నానో మీరు అవే మీ చేతుల్లో తీసుకొచ్చారు" అని తెగ ఫీలైపోయాడు ప్రదీప్.

"చపాతీ విత్ ఐస్ క్యూబ్స్"పేరుతో ఓక్ వెరైటీ వంటకాన్ని ప్రిపేర్ చేసింది విద్యుల్లేఖ..."చూడడానికే ఇలా ఉందంటే తింటే ఇంకేమవుతుందో" అన్నాడు "గులాబ్ జామున్ విత్ పప్పు" అంటూ మరో సూపర్ క్వీన్ తీసుకొచ్చి ప్రదీప్ కళ్ళ ముందు పెట్టేసరికి చెవిలో వేలు పెట్టుకుని పక్కకు తప్పుకున్నాడు. ఇక కండక్టర్ ఝాన్సీ తాను చేసిన వంటకం చూపించి "మీ జన్మ ధన్యమైపోయే వంటకం" అంది. దానికి ప్రదీప్ " తినాలనికూడా అనిపించట్లేదు..నా జన్మ ధన్యమైపోయింది" అన్నాడు.. ఇలా ఈ ఆదివారం షోలో సూపర్ క్వీన్స్ అంతా కూడా రకరకాల వెరైటీ వంటకాలతో హోస్ట్, ఆడియన్స్ నోరు ఊరించడానికి రాబోతున్నారు. మరి ఆ వంటకాలు ఏమిటి ఎలా ప్రిపేర్ చేశారో తెలియాలి అంటే సండే వరకు వెయిట్ చేయాల్సిందే. సూపర్ క్వీన్స్ సీజన్ మాత్రం బాగా ఎంటర్టైన్ చేస్తోంది. రేటింగ్ కూడా పర్వాలేదనిపించేలా వస్తోంది.

Jayam serial : బాక్సింగ్ పోటీలో మిస్సెస్ గంగ రుద్ర ప్రతాప్.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -160 లో..... గంగని ఎలాగైనా అకాడమీ సెలక్షన్ కి వెళ్లకుండా ఆపాలని ఇషిక, వీరు ట్రై చేస్తారు కానీ గంగ, రుద్ర ఇద్దరు కలిసి ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసి అకాడమీకి వెళ్తారు. రుద్ర అకాడమీ బయటే ఉంటాడు. నాకు సంబంధించిన కేసు ఇంకా పెండింగ్ లో ఉంది అలా ఉండగా.. నేను లోపలకు రాకూడదని రుద్ర బయటే ఉండి గంగకి అంతా వివరిస్తాడు. నేను నీ పేరు మైక్ లో రావడం వినాలని రుద్ర అంటాడు. గంగ లోపలకు వెళ్తుంది. అక్కడ పారు ఇంకా తన ఫ్రెండ్స్ కలిసి గంగని చులకనగా మాట్లాడుతారు.

Brahmamudi : రుద్రాణిని రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన కనకం!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -922 లో.. ఒకతను వచ్చి రుద్రాణికి మళ్ళీ పసరు మందు ఇస్తాడు. ఆ పసరు మందు పని చేస్తుందా లేదా అని రుద్రాణి అతన్ని అడుగుతుంది. పని చేస్తుందని అతను చెప్తాడు. దాంతో రుద్రాణి పసరు మందు తీసుకొని లోపలికి వెళ్తుంటే అప్పుడే కనకం ఎదురుపడుతుంది. కనకాన్ని చూసి రుద్రాణి టెన్షన్ పడుతుంది. చేతిలో అదేంటీ అని కనకం అనగానే ఇదా.... నాకే పసరు మందు అజీర్తికి వాడమని చెప్పారని చెప్పి రుద్రాణి వెళ్ళిపోతుంది. అలా అయితే ఇంత రాత్రివేళ తీసుకొని వెళ్తుంది ఏంటని కనకంకి డౌట్ వస్తుంది.