English | Telugu

నాతో మీకు సెకండ్ టైం కదా...

సుమ అడ్డా షో నెక్స్ట్ వీక్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఈ షోకి "ఓ భామ అయ్యో రామ" మూవీ టీమ్ వాళ్ళు వచ్చారు. ఇందులో సుహాస్, ఆలీ, సౌమ్య శారద వచ్చారు. ఈ సినిమా టీమ్ వాళ్ళు వచ్చారు సరే మరి నువ్వు వచ్చావేంటి అంటూ సుమ సౌమ్యని అడిగింది. ఈ సినిమాలో భామ క్యారెక్టర్ కి నన్ను అడిగారు అని చెప్పింది సౌమ్య. "ఓ బామ్మ క్యారెక్టర్ కి నిన్ను అడిగారా" అంటూ సుమ కౌంటర్ వేసింది. "ఆమె భామ కాదు నేను భామ" అంటూ ఆలీ చెప్పాడు. "ఇది నాకు మీతో సెకండ్ టైం కదా" అంటూ సౌమ్య అనేసరికి ఆలీ షాకై "ఏంటది" అని అడిగాడు.. "షూటింగ్ షూటింగ్" అని సౌమ్య చెప్పింది. అది చెప్పు ఆడియన్స్ కి అన్నాడు ఆలీ. "ఈ అమ్మాయి అప్పుడప్పుడు తెలుగులో కొన్ని పదాలు వాడుతూ ఉంటుంది. నువ్వు అవన్నీ పట్టించుకోకు అంటూ సుహాస్ కి చెప్పాడు ఆలీ.

వెంటనే సౌమ్య "నాకు తెలుగు రాదు అని ఇక్కడ అందరూ అవమానిస్తున్నారు..అందుకే ఇప్పుడు నేనే వాళ్ళను అనుభవిస్తున్నా" అని మాట్లాడేసరికి సుమ షాకైపోయింది. "ఈ సినిమాలో ఆలీ గారు నాకు మావయ్యగా నటిస్తున్నారు" అని సుహాస్ చెప్పాడు. వెంటనే సౌమ్య "ఏంటండీ ఇంత చిన్న ఏజ్ లో మావయ్య క్యారెక్టర్ ఇస్తున్నారు. ఆయనే హీరోలా ఉన్నారుగా" అనేసింది. ఆలీ తనని అన్నదా ఇంకా ఎవరినన్నా అన్నదా అని వెనకా ముందు చూసుకుంటూ ఉన్నాడు. "నేను అన్నది మిమ్మల్నే" అంది సౌమ్య. వెంటనే సుమ ఆలిగారు మీరు సౌమ్యతో ఒక పోడియంలో ఉండి గేమ్ ఆడండి...ఈరోజు మీకు ఉంది లెండి అంది..వెంటనే ఆలీ "ఇంటికి వెళ్లిన తర్వాత కూడా ఉంటది నాకు" అనేశాడు. దానికి సౌమ్య "అది రోజూ ఉంటది వదిలేయండి" అంది. జనరల్ గా అమ్మాయిలు క్రీం రాస్తారు కానీ ఈ అమ్మాయి ఏకంగా సున్నం రాసేస్తోంది అంటూ ఆలీ సౌమ్య మీద సెటైర్ వేసాడు.

Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.

Illu illalu pillalu : అమూల్యకి పెళ్ళిచూపులు.. కామాక్షి ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -362 లో.. పెళ్లిచూపులకి ఇంకా రావడం లేదని రామరాజు వాళ్ళు ఎదురుచూస్తుంటే వాళ్ళు రారుగా అని శ్రీవల్లి మనసులో అనుకుంటుంది. అప్పుడే అబ్బాయి వాళ్ళు పెళ్లిచూపులకు ఎంట్రీ ఇస్తారు‌. దాంతో శ్రీవల్లి షాక్ అవుతుంది. భాగ్యం, ఆనందరావు కూడా వస్తారు. వాళ్ళు ఏం జరిగిందో శ్రీవల్లికి చెప్తారు. వాళ్ళు చెప్పాల్సింది మొత్తం అబ్బాయి వాళ్ల నాన్నకి చెప్తారు కానీ అతనికి చెవులు వినిపించవు.. వాళ్ల అమ్మ కి చెప్పేలోపు అటువైపు గా ప్రేమ, ధీరజ్ వెళ్లడం చూసి మళ్ళీ చెప్పలేకపోయామని శ్రీవల్లికి భాగ్యం చెప్తుంది.