English | Telugu

సుజాత ఇలా షాక్ ఇస్తుందనుకోలేదు!

కొన్ని విషయాలు తెలియకుండా జరిగిపోతాయి. అవి జరిగాక అయ్యో ఇప్పుడెలా అని అనుకుంటాం‌. అలా అనుకోకుండా జరిగేవాటినే షాకింగ్ విషయాలని అంటాం. ఇప్పుడదే జరిగింది. జబర్దస్త్ రాకింగ్ రాకేష్ వాళ్ళ భార్య జోర్దార్ సుజాత అతనికి షాక్ ఇచ్చింది. అసలేం జరిగింది.. ఏంటా షాక్ ఓసారి చూసేద్దాం.

సుజాతకి ఒకరి దగ్గరి నుండి కాల్ వస్తుంది. ఆ ఫోన్ మాట్లాడిన సుజాత.. కాస్త సంతోషంగా మాట్లాడతుంది‌. రాకేష్ ని పిలిచి ఓ గుడ్ న్యూస్ అని అంటుంది సుజాత. ఏంటా గుడ్ న్యూస్ అనగా.. అమ్మ వస్తుందంట.. ఓ నాలుగు రోజులు ఇక్కడే ఉంటుందంట అని సుజాత అనేసరికి.. ఒక్కసారిగా ఆలోచిస్తాడు రాకేష్. షూటింగ్ ఉందని చెప్పు.. నాలుగు రోజులు కాదు కాదు వారం రోజులు.. అసలు హైదరాబాద్ లోనే ఉండట్లేదని చెప్పేయ్ అని సుజాతతో రాకేష్ అంటాడు. అవునా ఎందుకని సుజాత అడుగగా.. అలాగే చెప్పని రాకేష్ అంటాడు. ఆ తర్వాత సుజాత కాల్ చేస్తుంది. హలో అత్తమ్మ మేము అవుట్ డోర్ షూటింగ్ కి వెళ్తున్నాం. నాలుగు రోజులు అవుతుందో తెలియదు. పది రోజులు అవుతుందో తెలియదు. ఎప్పుడొస్తామో తెలియదని సుజాత అంటుంది. అది విని రాకేష్ షాక్ అవుతాడు. ఇదంతా 'చంటబ్బాయ్' యూట్యూబ్ ఛానెల్ లో అప్లోడ్ చేశాడు రాకింగ్ రాకేష్.

రాకేష్ ఒక మిమిక్రీ ఆర్టిస్ట్ అన్న విషయం అందరికీ తెలిసిందే. జబర్దస్త్‌ కామెడీ షో ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న కమెడియన్స్ లో రాకేష్ కూడా ఒకరు. నార్మల్ గా కామెడీ చేసే స్టేజి నుంచి ఎదుగుతూ వచ్చి ఇప్పుడు టీం లీడర్ అయ్యాడు. తన కామెడీ పంచులు, డైలాగులతో ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేస్తూ ఉన్నాడు. రీసెంట్ గా జోర్దార్ సుజాతను పెళ్లి చేసుకున్నాడు. ఆమెతో కలిసాక రాకేష్ రేంజ్ ఒక్కసారిగా మారిపోయింది. జబర్దస్త్‌ స్టేజి మీద ఈ జోడీకి ఎంతో క్రేజ్‌ ఉంది.

Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.

Illu illalu pillalu : అమూల్యకి పెళ్ళిచూపులు.. కామాక్షి ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -362 లో.. పెళ్లిచూపులకి ఇంకా రావడం లేదని రామరాజు వాళ్ళు ఎదురుచూస్తుంటే వాళ్ళు రారుగా అని శ్రీవల్లి మనసులో అనుకుంటుంది. అప్పుడే అబ్బాయి వాళ్ళు పెళ్లిచూపులకు ఎంట్రీ ఇస్తారు‌. దాంతో శ్రీవల్లి షాక్ అవుతుంది. భాగ్యం, ఆనందరావు కూడా వస్తారు. వాళ్ళు ఏం జరిగిందో శ్రీవల్లికి చెప్తారు. వాళ్ళు చెప్పాల్సింది మొత్తం అబ్బాయి వాళ్ల నాన్నకి చెప్తారు కానీ అతనికి చెవులు వినిపించవు.. వాళ్ల అమ్మ కి చెప్పేలోపు అటువైపు గా ప్రేమ, ధీరజ్ వెళ్లడం చూసి మళ్ళీ చెప్పలేకపోయామని శ్రీవల్లికి భాగ్యం చెప్తుంది.