English | Telugu

నేను కాలభైరవ.. ఇనయా మిత్రవింద : శ్రీహాన్

బిగ్ బాస్ లోఈ సీజన్ మొదటి వారం నుండి ఎక్కువగా మాటల యుద్ధం ఎవరెవరి మధ్య జరిగిందంటే.. ఠక్కున ఇనయా శ్రీహాన్ అనే చెప్తారు. ఎందుకంటే నామినేషన్స్ వచ్చాయంటే వీళ్ళ మీదనే ప్రోమోలను చేస్తారు అని అనడం లో ఆశ్చర్యమే లేదు.

ప్రేక్షకులు కూడా వీళ్ళిద్దరి మధ్య నామినేషన్ వార్ చూడటంఎంటర్టైన్గా ఫీల్ అవుతారు. కానీ మధ్యలో కొన్ని రోజులు బాగున్నారు. మళ్ళీ ఈ మధ్య గతవారం హీటెడ్ ఆర్గుమెంట్ జరిగింది. అయితే మొన్నటి ఫ్యామిలీ వీక్ లో వచ్చిన కొన్ని ఫ్యామిలీస్ కూడా ఇనయా, శ్రీహాన్ ల మధ్య గొడవ చూడడానికి బాగుంటుందని చెప్పారు.

హౌస్ లో మొన్న మొదలైన 'స్నో మ్యాన్' టాస్క్ లో ఒక్కో కంటెస్టెంట్ చేసిన 'స్నో మ్యాన్' ని కాపాడుకునే ప్రక్రియలో భాగంగా శ్రీహాన్ దగ్గర ఎక్కువ పార్ట్స్ ఉండడంతో..ఇనయా, శ్రీహాన్ దగ్గరవి తీసుకునే ప్రయత్నం చేయగా.. శ్రీహాన్ కాపాడుకునే ప్రయత్నంలో ఇనయాని పట్టుకున్నాడు. నిజానికి ఆ సందర్భంలో ఇనయాని తోసిపడేయొచ్చు శ్రీహాన్. కానీ అలా చెయ్యకుండా.. తీసుకోవద్దు తీసుకోవద్దు అంటూ ఆమెను పట్టుకున్నాడు. ఇది చూసిన శ్రీసత్య "ఏం చేస్తున్నారు మీరిద్దరు.. డిఫెన్స్ చేసుకున్నట్లు లేదు. ఏదో సాంగ్ కి డాన్స్ చేస్తున్నట్లుగా ఉంది" అని అంది. ఫైమా, రేవంత్ ఇద్దరు కలిసి శ్రీహాన్, ఇనయా ఎలా పట్టుకున్నారో చేసి చూపించారు.

అయితే ఆ తర్వాత శ్రీహాన్, ఇనయాని ముట్టుకోగా "అబ్బా షాక్ కొట్టింది" అంటూనువ్వు "మగధీరలో మిత్రవిందవా" అని శ్రీహాన్ అన్నాడు. మరి ఐటమ్ సాంగ్ గర్ల్ ఎవరు అని అడుగగా, "శ్రీసత్య ఐటమ్ సాంగ్ గర్ల్" అని శ్రీహాన్ అన్నాడు. దీంతో శ్రీసత్య షాక్ అయ్యింది.

Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.

Illu illalu pillalu : అమూల్యకి పెళ్ళిచూపులు.. కామాక్షి ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -362 లో.. పెళ్లిచూపులకి ఇంకా రావడం లేదని రామరాజు వాళ్ళు ఎదురుచూస్తుంటే వాళ్ళు రారుగా అని శ్రీవల్లి మనసులో అనుకుంటుంది. అప్పుడే అబ్బాయి వాళ్ళు పెళ్లిచూపులకు ఎంట్రీ ఇస్తారు‌. దాంతో శ్రీవల్లి షాక్ అవుతుంది. భాగ్యం, ఆనందరావు కూడా వస్తారు. వాళ్ళు ఏం జరిగిందో శ్రీవల్లికి చెప్తారు. వాళ్ళు చెప్పాల్సింది మొత్తం అబ్బాయి వాళ్ల నాన్నకి చెప్తారు కానీ అతనికి చెవులు వినిపించవు.. వాళ్ల అమ్మ కి చెప్పేలోపు అటువైపు గా ప్రేమ, ధీరజ్ వెళ్లడం చూసి మళ్ళీ చెప్పలేకపోయామని శ్రీవల్లికి భాగ్యం చెప్తుంది.