English | Telugu

నువ్వెంత పులిహోర కలిపినా నేను నీకు పడను!

జబర్దస్త్ షోకి కొత్త యాంకర్ సౌమ్యా రావు వచ్చింది. ఐతేఈమె ప్రస్తుతానికి పర్వాలేదనిపించేలా చేస్తోంది అని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. "కొత్తగా వచ్చిందో లేదు అప్పుడే ఆది ట్రాక్ వేయడం స్టార్ట్ చేసాడు", "సౌమ్య వాయిస్ వేరే లెవెల్".. ఇలా అంటూ ఆమె యాంకరింగ్‌కి నెమ్మదిగా అలవాటుపడుతున్నారు ఆడియన్స్.

ఇక నెక్స్ట్ వీక్ జబర్దస్త్ ఎపిసోడ్ లేటెస్ట్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇందులో సౌమ్య బుట్టబొమ్మ సాంగ్‌కి రెడ్ కలర్ డ్రెస్‌లో డాన్స్ వేస్తూ వచ్చింది. ఇంతలో ఆది స్టేజి మీదకు వచ్చి "నువ్వొక్కదానివే చేస్తే ఉత్తి బొమ్మ అవుతుంది.. నాతో కలిసి చేస్తేనే బుట్టబొమ్మఅవుతుంది" అని పంచ్ వేసాడు.

"నువ్వెంత పులిహార కలిపినా నేను నీకు పడను" అని యాంకర్ సౌమ్య కూడా సీరియస్ గానే చెప్పింది. "ఛాలెంజా.. నేను చిరంజీవి గారి ఫ్యాన్ అని తెలుసు కదా!" అని ఆది రివర్స్ అనేసరికి, "చిరంజీవి గారు కాదు కదా" అని టైమింగ్‌తో రివర్స్ పంచ్ వేసేసరికి అందరూ నవ్వేశారు.

స్టేజి మీద ఎవరేం మాట్లాడినా, కామెంట్ చేసినా సౌమ్య రావు కూడా స్ట్రైట్ గానే కౌంటర్లు పేల్చేస్తోంది. దాంతో ప్రస్తుతానికి బాగానే యాంకరింగ్ చేస్తొందనే అభిప్రాయం కలిగిస్తోంది.

Podharillu: మహా పెళ్ళికి అంతా ఫిక్స్.. చక్రిని ఆమె అర్థం చేసుకుందా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -12 లో.....మహా తన డ్రీమ్ గురించి భూషణ్ కి చెప్తుంది. డ్రీం లేదు ఏం లేదు ఫ్యామిలీ ని చూసుకుంటే సరిపోతుంది. నాకు నచ్చింది వండి పెడుతూ వెళ్ళేటప్పుడు బై చెప్పి వచ్చేటప్పుటికీ అందంగా రెడీ అయి ఉంటే చాలని చెప్పగానే వీడితో అనవసరంగా నా డ్రీమ్ గురించి చెప్పానని మహా అనుకుంటుంది. అదంతా చక్రి వింటాడు. మరొకవైపు మాధవ దగ్గరికి గాయత్రి వచ్చి.. ఈ పెళ్లి కూడా క్యాన్సిల్ అయ్యిందంట కదా అని చెప్పగానే అందరు షాక్ అవుతారు. ఏ సైలెంట్ గా ఉండు.. ఈ విషయం కన్నాకి తెలియదని మాధవ అంటాడు.