English | Telugu

బిగ్ బాస్ లో స్నో మ్యాన్.. డైరెక్ట్ గా ఫైనల్ కి వెళ్ళేది ఎవరు?

బిగ్ బాస్ హౌస్ లో ప్రస్తుతం ఎనిమిది మంది కంటెస్టెంట్స్ ఉన్నారు. కెప్టెన్సీ టాస్క్ గత వారమే ముగియడంతో, చివరి కెప్టెన్సీ పోటీ కూడా అయిపోయింది. ఈ వారం 'టికెట్ టు ఫినాలే' టాస్క్ మొదలైంది.

ఈ టాస్క్ లో గెలిచే కంటెస్టెంట్ ని, తర్వాత రెండు వారాల్లో ఎవరు నామినేట్ చేసే అవకాశం ఉండదు. వాళ్ళు డైరెక్ట్ ఫైనల్ వీక్ కి వెళ్తారు. ఈ టాస్క్ లో అందరూ కూడా నువ్వా నేనా అన్నట్టుగా తలబడాలి. కానీ ఎవరు కూడా టాస్క్ లో‌‌ సరిగ్గా పర్ఫామెన్స్ ఇవ్వలేదు. అయితే ఈ టాస్క్ లో మొదటి రౌండ్ లో ఎవరు అయితే‌ తొలగించబడ్డారో.. వారికి మళ్ళీ టాస్క్ పెట్టి, అందులో గెలిచిన వారికి 'టికెట్ టు ఫినాలే' టాస్క్ లోకి తిరిగి ఎంట్రీ లభిస్తుంది అని బిగ్ బాస్ చెప్పాడు.

"హౌస్ లో ఫైనల్ లెవల్ కి చేరడానికి ఈ టాస్క్ లో గెలిచిన వారికి అర్హత లభిస్తుంది. సమయానుసారం స్నో ఫాల్ జరుగుతుంది. అందులో‌నుండి 'స్నో మ్యాన్' పార్ట్స్ వెయ్యడం జరుగుతుంది. కంటెస్టెంట్స్ అందరూ వాటికోసం తలపడి వాటిని‌ సంపాదించుకోవాలి. ఆ పార్ట్స్ తో 'స్నో మ్యాన్' ని రెడీ చేయాలి. ఇదంతా మొదటి బజర్ మోగిన నుండి ఎండ్ బజర్ మోగే వరకు సమయంలో మాత్రమే జరగాలి. తక్కువ పార్ట్స్ ఉన్న 'స్నో మ్యాన్' చేసిన కంటెస్టెంట్ ఈ రౌండ్ నుండి తొలగించబడతారు" అని కంటెస్టెంట్స్ తో చెప్పాడు బిగ్ బాస్.

టాస్క్ లోని మొదటి లెవెల్ పూర్తి అయ్యేసరికి శ్రీసత్య వెళ్ళిపోగా మిగిలిన వాళ్ళు టాస్క్ లో ఉన్నారు.

Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.

Illu illalu pillalu : అమూల్యకి పెళ్ళిచూపులు.. కామాక్షి ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -362 లో.. పెళ్లిచూపులకి ఇంకా రావడం లేదని రామరాజు వాళ్ళు ఎదురుచూస్తుంటే వాళ్ళు రారుగా అని శ్రీవల్లి మనసులో అనుకుంటుంది. అప్పుడే అబ్బాయి వాళ్ళు పెళ్లిచూపులకు ఎంట్రీ ఇస్తారు‌. దాంతో శ్రీవల్లి షాక్ అవుతుంది. భాగ్యం, ఆనందరావు కూడా వస్తారు. వాళ్ళు ఏం జరిగిందో శ్రీవల్లికి చెప్తారు. వాళ్ళు చెప్పాల్సింది మొత్తం అబ్బాయి వాళ్ల నాన్నకి చెప్తారు కానీ అతనికి చెవులు వినిపించవు.. వాళ్ల అమ్మ కి చెప్పేలోపు అటువైపు గా ప్రేమ, ధీరజ్ వెళ్లడం చూసి మళ్ళీ చెప్పలేకపోయామని శ్రీవల్లికి భాగ్యం చెప్తుంది.