English | Telugu

ఆ విష‌యం ఆల‌స్యంగా అర్థం చేసుకున్నా.. వైర‌ల్ అవుతున్న సునీత పోస్ట్‌

జీవితం చాలా క్లిష్టమైనది. ఎన్నో ఊహించని సంఘటనలు జరుగుతూ ఉంటాయి. ఒక్కోసారి ఆ బాధలు, ఆవేదనలు చిన్నచిన్న కవితలుగా కూడా రూపాంతరం చెందుతాయి. అలాంటివి చాలా అద్భుతంగా ఎంతో లోతైన భావాల్ని పలికిస్తాయి. అలాంటి ఒక సందర్భాన్ని సింగర్ సునీత కూడా అనుభవించినట్లు కనిపిస్తోంది. ఐతే సునీత హోరెత్తే సముద్రం ఒడ్డున ఎక్కడో దూరంగా ఉన్న పడవను ఎంతో తన్మయత్వంతో నిలబడి చూస్తున్న ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు.

సముద్రం, దూరంగా ఉన్న ఓడ తనకేదో పాఠం నేర్పిస్తున్నట్టు తాను అలా మరో ప్రపంచంలోకి వెళ్లిపోయిన ఫీలింగ్ కలుగుతుంది ఈ ఫోటో చూస్తే. "మీరు డిమాండ్ చేయకపోతే మీ గురించి ఎవరూ పట్టించుకోరు. మీరు అందరిచేతా నిర్లక్ష్యం చేయబడతారు. నేను ఈ విషయాన్ని చాలా ఆలస్యంగా తెలుసుకున్నాను" అంటూ లోతైన భావాన్ని కవితాత్మకంగా రెండే రెండు వాక్యాల్లో తన ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేశారు.

ఎదుటివాళ్లను నిర్లక్ష్యం చేయడం అనే విషయం చాలా బాధాకరమైంది..అలాంటి బాధ ఎవరికీ రాకూడదు. ఈ సముద్రం, ఆ చివరన ఉన్న పడవ కూడా నాలాంటి ఒక పరిస్థితిలోనే ఉన్నాయేమో. అందుకే తనలోని అలలను ఎగసెగసి పడేలా చేస్తోంది, చొచ్చుకుంటూ ఇంకాఇంకా ముందుకొచ్చేస్తోంది ఈ సముద్రం.. అలా రాకపోతే ప్రపంచం తనని నిర్లక్ష్యం చేస్తుందని నాలాగే సముద్రానికి, ఆ ఓడకు కూడా అర్దమయ్యిందేమో అంటున్నట్టుగా పోస్ట్ చేసిన ఈ ఫోటో ఇప్పుడు వైరల్ అవుతోంది. అయితే ఇప్పుడే ఈ కామెంట్ ఎందుకు పెట్టింద‌నేది అంద‌రిలోనూ కుతూహ‌లాన్ని రేకెత్తిస్తోంది.

సునీత ఎప్పుడూ కెరీర్ అంటూ ఫామిలీ అంటూ బిజీగా ఉంటుంది. కానీ తాను ఎక్కువగా సూర్యదయాన్ని, సముద్రాన్ని, వర్షాన్ని, దేవుడు సృష్టించిన ఈ ప్రపంచాన్ని ఆస్వాదించడానికి చాలా ఇష్టపడుతుంది. అందుకే ప్రకృతికి సంబంధించిన ఫొటోస్ ని తన ఇన్స్టా పేజీలో ఎక్కువగా షేర్ చేస్తూ ఉంటుంది. జీవితంలో ఎన్నో పరిస్థితులను ఎదుర్కున్న మీరు చాలా స్ట్రాంగ్, మానసిక ప్రశాంతత చాలా అవసరం అంటూ సునీత ఫాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Brahmamudi: రాహుల్ మనిషిని పట్టుకున్న రాజ్, కావ్య.. ఇక దేత్తడి!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -905 లో....అప్పు పాప కేసు ఫైల్ చూస్తుంటే ఆఫీసర్ వస్తాడు. నీకు ఎన్నిసార్లు చెప్పాను వద్దని అయినా అలాగే చేస్తున్నావని కోప్పడతాడు. లేదు సర్ పాప చనిపోలేదు.. చనిపోయిన పాప వేరు.. ఆ పాప DNA తో మ్యాచ్ అవ్వడం లేదని రిపోర్ట్స్ చూపించగానే అవునా కేసులో ఒక కొత్త మలుపు తీసుకొని వచ్చావ్ గుడ్ కేరియాన్ అని ఆఫీసర్ అంటాడు. కాసేపటికి రేపు పాప వాళ్ళ ఫాదర్ ని స్టేషన్ కి రప్పించండి అని కానిస్టేబుల్ తో అప్పు చెప్తుంది. మరొకవైపు రాహుల్ అవార్డు ఫంక్షన్ కి రాజ్, కావ్య వెళ్తారు. అక్కడ రాహుల్ డిజైన్స్ చూసి రాజ్, కావ్య షాక్ అవుతారు.

Karthika Deepam2: జ్యోత్స్న చేసిన ఫ్రాడ్ చూసి కార్తీక్, శ్రీధర్ షాక్.. ఇంటి వారసురాలు కాదేమో!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -542 లో..... కార్తీక్, శ్రీధర్ జ్యోత్స్న రెస్టారెంట్ ఫుడ్ ట్రక్స్ బాగా పాపులర్ అయ్యాయని హ్యాపీగా ఉంటారు. ఇద్దరు బయట టీ తాగుతూ కబుర్లు చెప్పుకుంటారు. జ్యోత్స్న చాలా తప్పు డు లెక్కలు చూపించిందని శ్రీధర్ అనగానే ఎంత మొన్న కొన్న ల్యాండ్ గురించా అని  కార్తీక్ అడుగుతాడు. లేదు అది జస్ట్ శాంపిల్ మాత్రమే.... ఎంత అంటే అది చెప్తే శివన్నారాయణ గుండె పట్టుకొని పడిపోయేంత డబ్బులు ఫ్రాడ్ చేసిందని శ్రీధర్ అనగానే కార్తీక్ షాక్ అవుతాడు.