English | Telugu

ఎక్స్ ఫెస్టివల్ లో సింగర్ దామిని.. ఇన్ స్టాగ్రామ్ లో ఆ పోస్టర్! 


కేవలం సినిమాల్లోనే కాకుండా.. మ్యూజికల్ షోస్‌లో సైతం సింగర్ దామిని పాటలు పాడుతుంటుంది. మార్చి 16 హైదరాబాద్‌ గండిపేటలో ఎక్స్ ఫెస్టివల్ పేరుతో భారీ మ్యూజికల్ షోని నిర్వహించబోతున్నారు. ఈ మ్యూజికల్ షోలో తన ఆట పాటలతో అలరించబోతుంది దామిని. కాగా ఈ మ్యూజిక్ షోకి సంబంధించి పోస్టర్‌ని తన ఇన్‌స్టాగ్రామ్‌లో రిలీజ్ చేసింది దామిని.

బిగ్ బాస్ హౌస్ లో సింగర్ గా ఎంట్రీ ఇచ్చి తనకి నచ్చినట్టుగా ఉండటంతో తొందరగా బయటకొచ్చేసింది. అతిగా ఆవేశపడేవాళ్లు, అనవసరంగా వాదిస్తూ సాగదీసేవాళ్లు, తమ డప్పు తామే కొట్టుకునేవాళ్లు, కేవలం డైలాగులకే పరిమితమయ్యేవాళ్లు, వెనకాల గోతులు తవ్వేవాళ్లు, కిచెన్‌కే పరిమితమై ఆడటమే మర్చిపోయేవాళ్లు.. ఇలా ప్రతిసీజన్‌లోనూ ఇలాంటి వాళ్లున్నారు. సీజన్‌ సెవెన్ లో అలాంటివారున్నారు. అయితే మిగతావాళ్ల సంగతి ఎలా ఉన్నా కిచెన్‌కే పరిమితమైనవాళ్లు మాత్రం హౌస్‌లో ఎక్కువ వారాలు ఉన్న దాఖలాలు లేవు. అందుకేనేమో దామిని త్వరగా బయటకొచ్చేసింది. మూడో వారంలో ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చేసింది. ఓ టాస్క్‌లో భాగంగా యావర్‌ని దారుణంగా హింసపెట్టి.. నెగిటివిటీని మూటకట్టుకుంది. ఇక ఓవర్ ఎక్స్ పోజింగ్ విషయంలోనూ ఫ్యామిలీ ఆడియన్స్‌‌కి దూరమైంది దామిని.

తాజాగా తను పాడిన ప్రేమలేఖ పాటని అఫీషియల్ గా విడుదల చేసిన దామిని.. వ్యాయామం పేరుతో ఓ కోర్స్ ని ఫాలో అవుతుంది. డైట్ ప్లాన్ కి సంబందించిన ఫుడ్, వర్కవుట్
ఫోటోలు, అప్లోడ్ చేస్తుంది. అయితే త్వరలో మొదలయ్యే మ్యూజిక్ లైవ్ షోకి తను వెళ్తున్నట్టుగా ఓ పోస్టర్ ని తన ఇన్ స్టాగ్రామ్ పేజీలో విడుదల చేయగా అది ఇప్పుడు ఫుల్ వైరల్ గా మారింది.

Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.

Illu illalu pillalu : అమూల్యకి పెళ్ళిచూపులు.. కామాక్షి ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -362 లో.. పెళ్లిచూపులకి ఇంకా రావడం లేదని రామరాజు వాళ్ళు ఎదురుచూస్తుంటే వాళ్ళు రారుగా అని శ్రీవల్లి మనసులో అనుకుంటుంది. అప్పుడే అబ్బాయి వాళ్ళు పెళ్లిచూపులకు ఎంట్రీ ఇస్తారు‌. దాంతో శ్రీవల్లి షాక్ అవుతుంది. భాగ్యం, ఆనందరావు కూడా వస్తారు. వాళ్ళు ఏం జరిగిందో శ్రీవల్లికి చెప్తారు. వాళ్ళు చెప్పాల్సింది మొత్తం అబ్బాయి వాళ్ల నాన్నకి చెప్తారు కానీ అతనికి చెవులు వినిపించవు.. వాళ్ల అమ్మ కి చెప్పేలోపు అటువైపు గా ప్రేమ, ధీరజ్ వెళ్లడం చూసి మళ్ళీ చెప్పలేకపోయామని శ్రీవల్లికి భాగ్యం చెప్తుంది.